JMM: కల్పనా సోరెన్.. జేఎంఎం ప్లాన్-బి కర్త ఆమె..!
ఝార్ఖండ్లోని సోరెన్ కుటుంబంలో మరో నేత అరెస్టయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సోరెన్ వైదొలగి.. అతని భార్యకు పగ్గాలు అప్పగించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇంటర్నెట్డెస్క్: ఈడీ తనిఖీలు.. ఆపై కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అదృశ్యంతో రాంచీలో రాజకీయం వేడెక్కింది. భూకుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో ఆయన కీలక నిందితుడు. ఇప్పటికే 10 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా పట్టించుకోలేదు. ఈడీ అధికారులు వెతుక్కుంటూ దిల్లీలోని ఆయన నివాసానికి చేరుకొన్నా, అక్కడా జాడలేదు. నేటి మధ్యాహ్నం రాంచీలోని స్వగృహంలో జరిగిన సంకీర్ణ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన సతీమణి కల్పనా సోరెన్ కూడా దీనికి హాజరయ్యారు. దీంతో హేమంత్ అరెస్టు ఖాయమనే ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది. ఈనేపథ్యంలో జేఎంఎం ‘ప్లాన్-బి’ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఏమిటీ వ్యూహం..
ఒకవేళ హేమంత్ జైలుకు వెళ్లాల్సి వస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతలను ఆయన సతీమణి కల్పనా సోరెన్కు అప్పగించనున్నారు. ప్రస్తుతానికి ఆమె ఎమ్మెల్యే కాదు. కానీ, అధికార కూటమిలో ఆమె శక్తిని సవాలు చేసే స్థాయిలో ఎవరూ లేరు. పార్టీలో మెజార్టీ వర్గం ఆమె వెనకే ఉంది. గాండే అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఖాన్ రాజీనామా చేశారు. ఆయన అక్కడి నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచారు. రెండు సార్లు కాంగ్రెస్ టికెట్పై విజయం సాధించగా.. 2019లో జేఎంఎం తరఫున పోటీ చేసి నెగ్గారు. పార్టీ వ్యూహంలో భాగంగా ఈ స్థానం నుంచి తాజాగా హేమంత్ సతీమణి ఉప ఎన్నిక బరిలోకి దిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా త్వరలో సర్ఫరాజ్ రాజీనామాకు ఆమోదముద్ర పడనున్నట్లు తెలుస్తోంది. భాజపా ఎంపీ నిషికాంత్ దూబే ఇదే విషయాన్ని ఎక్స్లో పోస్టు చేశారు.
ఎవరీ కల్పనా సోరెన్..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన కల్పన ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేశారు. ఎంబీఏ పూర్తి చేశారు. పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ప్రస్తుతం ఆమె సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటూ ఓ పాఠశాలను నడుపుతున్నారు. రాజకీయాల్లో హేమంత్కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది.
రాంచీకి చేరుకున్న సోరెన్.. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్
సంకీర్ణ ప్రభుత్వంలో 17 సీట్లు ఉన్న కాంగ్రెస్ నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఒకవేళ ఏమైనా విభేదాలు తలెత్తితే అది ‘ఇండియా’ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆమెకు పోటీ ఉంటుందా..?
జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. శిబు రాజ్యసభ సభ్యుడు. హేమంత్, బసంత్ ఎమ్మెల్యేలు. మరో కుమారుడు దుర్గా 2009లో మరణించారు. ఆయన భార్య సీత ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆమెకు జేఎంఎం పార్టీ విధానాలు అసలు నచ్చవు. భాజపాతో కలిసి హేమంత్ ప్రభుత్వం అవినీతిపై పోరాడింది. ఈ ప్రభుత్వాన్ని ఆమె కూలదోస్తుందని 2022 నుంచి ప్రచారం జరుగుతోంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అంత రాజకీయ శక్తి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. బసంత్కు రాజకీయ చతురత లేదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. శిబు కుమార్తె అంజలి రాజకీయాలకు దూరం. ఈ నేపథ్యంలో కల్పన రాజకీయ భవిష్యత్తుకు తక్షణమే వచ్చిన ముప్పేమీ లేదు. ఒకవేళ అవినీతి కేసుల వల్ల హేమంత్ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే.. పార్టీలో పూర్తిగా చక్రం తిప్పేది కల్పనయే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. -
విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..
విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మండిపడ్డారు. -
ఆమ్ఆద్మీ పార్టీ అంతానికి ‘ఆపరేషన్ ఝాడూ’
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
సూత్రధారులపై చర్యలు తీసుకోండి
తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్ అధికారులను కోరారు. -
అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా
విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలట్ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. -
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. -
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్ఛైర్మన్ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
మమత గురించి ఖర్గే చెప్పినా వినను: అధీర్
మమతా బెనర్జీ విషయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చెబుతున్నా అంగీకరించేది లేదని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి తేల్చిచెప్పారు. -
పెద్దలను మోదీ అలా అనొచ్చా!
లోక్సభ ఎన్నికల తరవాత విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందులోని మిత్రపక్షమైన ఆప్ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు యత్నిస్తుందని భాజపా ఆందోళనలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య