వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌

యూత్‌ మెచ్చే మంచి ఫీచర్లతో ఫోన్లు అందించే వన్‌ప్లస్‌ సంస్థ త్వరలో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ ఫోన్‌ని భారత విపణిలోకి తేనుంది.

Published : 09 Jun 2021 00:36 IST


యూత్‌ మెచ్చే మంచి ఫీచర్లతో ఫోన్లు అందించే వన్‌ప్లస్‌ సంస్థ త్వరలో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ ఫోన్‌ని భారత విపణిలోకి తేనుంది. పంచ్‌-హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో వచ్చే ఈ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు. 4,500 ఏఎంహెచ్‌ బ్యాటరీ, 30టీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వెనుకవైపు 8ఎంపీ అల్ట్రావైడ్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 64 ఎంపీ మెయిన్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.3 అంగుళాల ఆమ్‌లెడ్‌ తెర ఇందులో ఉండనున్నాయి. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వరకు లభిస్తుంది. ధర దాదాపు పాతిక వేల వరకు ఉండొచ్చని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని