కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి. మరి ఆసుపత్రులూ ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే? డాక్టర్లే లేకుండా సేవలందిస్తే? పరీక్షలు చేస్తే? ఆశ్చర్యంగా అనిపించినా అలాంటి రోజులు మరెంతో దూరంలో లేవు.
ఏఐ క్లినిక్లు మున్ముందు పెద్ద విప్లవమే సృష్టించనున్నాయి. ఇప్పటికే దీని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేర్పాడ్ క్లినిక్కులే నిదర్శనం. అమెరికాలోని ఫార్వర్డ్ హెల్త్ కంపెనీ వీటిని ఆరంభించింది. సంప్రదాయ ఆరోగ్య సేవలను ఏఐ పరిజ్ఞానంతో జతచేసి, ‘రోబో డాక్టర్ల’తో చికిత్స చేయటం దీని ప్రత్యేకత. అన్నీ సరిగ్గా సాగితే మున్ముందు మాల్స్, ఆఫీసు కార్యాలయాలు ఎక్కడైనా ఇలాంటి ఏఐ క్లినిక్కులు దర్శనమిచ్చే అవకాశం లేకపోలేదు.
ఎలా పనిచేస్తుంది?
కేర్పాడ్ కేంద్రం దగ్గరికి వెళ్లాక, ఫోన్తో తలుపును అన్లాక్ చేయాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లగానే భారీ టచ్ స్క్రీన్, కుర్చీ, నేల మీద కాంతి వలయం కనిపిస్తుంది. ఈ కాంతి వలయం శరీరం మొత్తాన్ని స్కాన్ చేయగలదు. టచ్ స్క్రీన్ మీద ఫుల్ బాడీ స్కాన్, థైరాయిడ్ పరీక్ష, మధుమేహ పరీక్ష, అధిక రక్తపోటు పరీక్ష.. ఇలాంటి బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అంటే ప్రతి జబ్బుకూ ఒక పోగ్రామ్ ఉంటుందన్నమాట. అవసరమైన సేవలను ఎంచుకుంటే చాలు. దానికదే రక్త నమూనా తీసుకుంటుంది కూడా. అదెలా అంటారా? దీనిలో సూది లేకుండానే రక్త నమూనా తీసుకునే సదుపాయం ఉంటుంది! వైర్లెస్ చేతి పట్టీ ద్వారా రక్తపోటును కొలుస్తుంది. సుఖవ్యాధులనూ పరీక్షిస్తుంది. అయితే ఈ పరీక్ష ఎలా చేస్తుందనేది ఇంకా తెలియరాలేదు. ఆయా పరీక్షలు పూర్తయ్యాక తెర మీద ఫలితాలు కనిపిస్తాయి. ఏదైనా చికిత్స అవసరమైతే ఆన్లైన్లో డాక్టర్ మందులు రాసిస్తారు. క్లినిక్ను ఎలా వాడుకోవాలో చెప్పటానికి సహాయకులు అందుబాటులో ఉంటారు. కానీ వీళ్లు బయటే ఉంటారు. లోపల పరికరాలను ఎలా వాడుకోవాలో చెబుతారంతే. పరీక్ష ఫలితాలు, చికిత్స, వ్యక్తిగత వివరాల వంటివన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. స్పెషలిస్ట్కు సిఫారసు చేయాల్సి వస్తేనే సమాచారాన్ని పంపిస్తారు.
అత్యాధునిక పరిజ్ఞానాల సాయం
ఏఐ-ఆరోగ్యరంగ సమ్మేళనానికి కేర్పాడ్ ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఆరోగ్యరంగం రోజు రోజుకీ కృత్రిమ మేధను అధికంగా వాడుకుంటోంది. ఇందుకు ఎన్నెన్నో అధునాతన పరిజ్ఞానాలు సాయం చేస్తున్నాయి.
- మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానం ద్వారా ఆల్గారిథమ్లు భారీ మొత్తంలో సమాచారాన్ని విశ్లేషించి జబ్బుల తీరుతెన్నులను పసిగడుతున్నాయి. మెరుగైన చికిత్సలను ఎంచుకోవటానికి, ఖర్చు తగ్గించటానికి తోడ్పడుతున్నాయి.
- కృత్రిమ మేధలో భాగమైన నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) పరిజ్ఞానాలు స్కాన్ ఇమేజ్ల వంటి వాటిని పరిశీలించి జబ్బులను నిర్ధరిస్తున్నాయి. తగిన చికిత్సలను, మందులను సూచిస్తున్నాయి. జబ్బులతో ముడిపడిన ముప్పులనూ వివరిస్తున్నాయి.
- డేటా ఎంట్రీ, బీమా క్లెయిమ్ల పరిష్కారం, అపాయింట్మెంట్ ఇవ్వటం వంటి పదే పదే చేసే పనులనూ ఏఐ చేసి పెడుతోంది.
కంటి స్కాన్తోనే గుండెజబ్బు గుర్తింపు
కళ్లలోకి చూసి గుండెజబ్బును గుర్తించే కృత్రిమ మేధనూ గూగుల్ రూపొందించింది. సుమారు 2.85 లక్షల మంది రెటీనా ఇమేజ్లతో దీనికి శిక్షణ ఇచ్చారు. వీటి సాయంతో గుండెజబ్బుకు కారణమయ్యే వయసు, లింగ బేధం, రక్తపోటు, పొగ తాగే అలవాటు వంటి వాటిని పసిగట్టి గుండెజబ్బు ముప్పును అంచనా వేస్తుంది. ఇది 70% వరకు గుండెజబ్బు ముప్పును అంచనా వేస్తున్నట్టు తేలటం గమనార్హం. ఈ పరిజ్ఞానం రెండంచెలుగా పనిచేస్తుంది. ఇమేజింగ్ పరిజ్ఞానంతో కంట్లోని రెటీనా దృశ్యాన్ని తీసుకుంటుంది. దీనిలోని రక్తనాళాల తీరును ఏఐ విశ్లేషించి గుండెజబ్బును గుర్తిస్తుంది. చాలారకాల జబ్బుల ఆనవాళ్లు కంట్లో కనిపిస్తుంటాయి. వీటిని నిశితంగా గమనిస్తే ఆయా జబ్బులను అంచనా వేయొచ్చు. కృత్రిమ మేధ పరిజ్ఞానానికీ ఇదే ఆధారం. దీని సాయంతో డయాబిటిక్ రెటినోపతీ.. చివరికి క్యాన్సర్లనూ అంచనా వేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్