కరీంనగర్లో 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్లో ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఏకంగా 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ కావడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అధికారిక గణాంకాలను
రాష్ట్రంలో 2 వారాల్లో 161 క్రియాశీల కేసుల పెరుగుదల
కొత్తగా 156 పాజిటివ్ల నమోదు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్లో ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఏకంగా 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ కావడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అధికారిక గణాంకాలను పరిశీలిస్తే కొవిడ్ పాజిటివ్ల సంఖ్య పెరుగుతోందనే విషయం స్పష్టమవుతోంది. గత నెల 20న 134 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ నెల 1న 193 నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే ఈ నెల 4న కేసుల సంఖ్య 200 దాటడం గమనార్హం. క్రియాశీల కేసులను పరిశీలిస్తే.. పాజిటివ్ల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గత నెల 20న రాష్ట్రంలో 3,626 క్రియాశీల(యాక్టివ్) కేసులు ఉండగా.. ఈ నెల 5న 3,787కి పెరిగాయి. కేవలం 2 వారాల వ్యవధిలోనే 161 క్రియాశీల కేసులు పెరిగినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించకపోతే.. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
4 వేలకు చేరువగా మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 156 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,76,943కు పెరిగింది. కరోనా మరణాలు ఆదివారం 4 వేల చేరువకు చేరుకున్నాయి. మహమ్మారితో మరొకరు మృతిచెందగా.. ఇప్పటివరకూ మొత్తం 3,999 మంది కన్నుమూశారు. తాజాగా 147 మంది కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 6,69,157 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 5న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,787 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 25,693 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 2,87,64,155కు పెరిగింది. 1,372 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 54 కేసులు నమోదు కాగా.. కరీంనగర్లో 47, రంగారెడ్డిలో 12 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రానికి 291 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాగా.. కొవిడ్ పరీక్షల్లో అందరూ నెగెటివ్గానే నిర్ధారణ అయ్యారు.
కర్ణాటకలోని నవోదయ విద్యాలయంలో 70 మందికి కొవిడ్
చిక్కమగళూరు, న్యూస్టుడే : కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా ఎన్.ఆర్.పుర తాలూకా సీగోడులోని జవహర్ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. అక్కడ 63 మంది విద్యార్థులు సహా మొత్తం 70 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. బెంగళూరు సమీపం ఆనేకల్ తాలూకా మరసూరు గ్రామంలోని ఓ నర్సింగ్ కళాశాలలో పలువురికి కొవిడ్ సోకింది.
వైద్య కళాశాలకు సెలవు
కరీంనగర్ గ్రామీణం, న్యూస్టుడే: కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ గ్రామీణ మండలం బొమ్మకల్ గ్రామంలోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తొలుత అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. శని, ఆదివారాల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 42 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు కళాశాల ఛైర్మన్ లక్ష్మీనరసింహారావు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి కళాశాలకు సెలవు ప్రకటించారు. గత ఆదివారం నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.