Maldives: డ్రాగన్తో మాల్దీవుల బంధం.. ఆ దేశాన్ని పట్టించుకోని భారతీయులు
మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తన చర్యలతో భారత్కు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లే మన పర్యటకుల సంఖ్య తగ్గుతోంది.
మాలె: భారత్తో దౌత్యపరమైన వివాదం వేళ.. మాల్దీవుల(Maldives)కు వెళ్లే పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆ దేశ పర్యటక ర్యాంకింగ్లో మన దేశం ఆరో స్థానానికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం..
గతేడాది డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యటకులు మాల్దీవుల(Maldives)ను సందర్శించారు. నాడు ద్వీపదేశ పర్యటక మార్కెట్లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. తర్వాత కూడా ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు డ్రాగన్కు దగ్గరవుతూ, భారత్పై నోరు పారేసుకుంటున్నారు.
‘భారత ప్రజలారా క్షమించండి’: దౌత్యవివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
ఈ వివాదంతో మాల్దీవుల(Maldives)కు వెళ్లే మన పర్యటకుల సంఖ్య పడిపోతోంది. జనవరి ప్రారంభంలో మోదీ పర్యటన తర్వాత.. మూడు వారాల్లో (జనవరి 21) అగ్రస్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి దిగొచ్చింది. 28 వేల మంది పర్యటకులతో(6.3శాతం) మార్చి 3 నాటికి ఆరో స్థానానికి పడిపోయింది. ఆ దేశ పర్యటక మార్కెట్లో 12 శాతం వాటాతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. రష్యా(9.8శాతం), ఇటలీ(9.6 శాతం), యూకే(9.0శాతం), జర్మనీ(6.5శాతం) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. -
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్ నియమితులయ్యారు. -
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో శత్రుదేశం ఇజ్రాయెల్ (Israel) పాత్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
Helicopter Crashes: ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన అత్యంత ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదాలు ఏవో చూద్దాం -
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
పారిస్లోని ఓ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. మారణాయుధాలతో వచ్చిన దుండగులు రూ. కోట్ల విలువైన ఆభరణాలు, వస్తువులను ఎత్తుకెళ్లారు. -
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
తుర్కియే పంపిన అత్యాధునిక బైరక్తర్ అకిన్సి డ్రోన్లు ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ గాలింపులో బాగా ఉపయోగపడ్డాయి. ప్రమాద స్థలం వివరాలను అత్యంత కచ్చితత్వంతో ఇరాన్కు అందజేశాయి. -
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ విదేశాంగ మంత్రిని కోల్పోవడం ఇరాన్కు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. -
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
ఇరాన్ అధ్యక్షుడు రైసీ చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఎదిగారు. ప్రాసిక్యూటర్గా జీవితం మొదలుపెట్టిన ఆయన అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు. -
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చివరి క్షణాలకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పటి ఫొటో అది. -
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 212గా గుర్తించారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం ప్రపంచదేశాలను షాక్కు గురిచేసింది. -
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా దేశ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై చర్చ మొదలైంది. -
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
Iran president Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ధ్రువీకరించింది. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు