ఆయనో ఇసుకోటీశ్వరుడు
స్థానికేతరుడిగా వచ్చిన ఆయన... పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధిగా పోటీ చేశారు. అయినా... ప్రజలు ఆదరించి ఎన్నుకున్నారు.
రెండేళ్లలోనే భారీగా ఆర్జన
సహజ వనరుల దోపిడీలో దూకుడు
పేదల ఇళ్ల స్థలాల పేరిట భారీగా మేత
ఎదిరించినా... ప్రశ్నించినా... కేసులతో వేధింపులు
అనుచరులతో దాడులూ నిత్యకృత్యం
పల్నాడు జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబ కథా చిత్రమ్
ఆయన పేరులో అమరేశ్వరుడున్నారు...!
ఎత్తింది మాత్రం బకాసుర అవతారం...
నాటి బకాసురుడిది తిండి కోసం ఆకలి...
ఈయనకేమో అక్రమార్జన దాహం...
జేబులు నింపుకొనేందుకు కృష్ణమ్మను తోడేస్తున్నారు...
ఇసుకలో కాసులను పిండుకుంటున్నారు
ఆ అడ్డగోలు మేతలో ‘అన్న’కూ ఉందట భాగస్వామ్యం...
అక్రమాల్లో కుమారుడు, సహధర్మచారిణిది తోడూనీడలాంటి సహకారం...
వెరసి... వీరి కుటుంబ కథా చిత్రంలో దౌర్జన్యమే కథా వస్తువు!!
స్థానికేతరుడిగా వచ్చిన ఆయన... పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధిగా పోటీ చేశారు. అయినా... ప్రజలు ఆదరించి ఎన్నుకున్నారు. ఇప్పుడు అక్రమాల్లో అనకొండగా మారిన ఆయన ఆ ప్రజలకే చుక్కలు చూపిస్తున్నారు. పేరులో అమరేశ్వరుడున్నా... చేసేవి వికారపు పనులే. ఇసుకాసుర అవతారమెత్తి రెండేళ్లలోనే రూ.వందల కోట్లు పిండేశారు. ఆయన ఆకలికి కృష్ణమ్మ విలవిల్లాడుతోంది. ఇసుక, మట్టి, బినామీ లారీలు, కాంట్రాక్టులు, అటవీ భూముల ఆక్రమణ, బెదిరింపులు, దాడులు, వేధింపులు ఇలా చెప్పుకొంటూపోతే ఈయన లీలలు చాలానే ఉన్నాయి. అక్రమాలపై ఎవరైనా ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా పోలీసు కేసులు బనాయిస్తారు. అనుచరులను పంపి దాడులూ చేయిస్తారు. ఈ అక్రమాల్లో ఆయన కుమారుడు తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధి సహధర్మచారిణి సైతం పతి ధర్మాన్నే పాటిస్తున్నారు.
రోజూ వేయి లారీల్లో ఇసుక తరలింపు
తన పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కన్ను కృష్ణా నదిలోని ఇసుకపై పడింది. ఇసుక కాంట్రాక్టు సంస్థపై తన అనుచరులతో తిరుగుబాటు చేయించారు. ఆ సంస్థ తప్పుకోవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలను ఆయనే చేజిక్కించుకున్నారు. ప్రజాప్రతినిధి కుమారుడు, ఆయన మిత్రులు ఈ దందాను పర్యవేక్షించడానికి గుంటూరులో కార్యాలయం తెరిచారు. ఇసుక రవాణాకు ఏకంగా నదిలోనే రోడ్డు వేయించారు. ఇందుకోసం కృష్ణా పక్కనే వేంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర కొండను సైతం తవ్వి రాళ్లు, మట్టిని తీసుకెళ్లారు.
తవ్వకాల పేరిట నదిలో అడ్డుకట్ట వేసి, ప్రవాహ గతినే మార్చేశారు. వరదల సమయంలోనూ సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో నదీతీరంలో ఇసుక కొండలను సృష్టించారు. చింతపల్లి, కొత్తపల్లి, చామర్రు, కోనూరు, మల్లాది, దిడుగు, ముత్తాయపాలెం, అమరావతి, వైకుంఠపురం, ప్రకాశం బ్యారేజీకి దిగువనున్న గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు, అత్తలూరివారిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, బొమ్మువానిపాలెం, గాజుల్లంక, పెదలంక ఇసుక రీచ్లలో రాత్రిపగలు తవ్వకాలు కొనసాగించారు. నదీ తీరగ్రామాల ప్రజలు ఆందోళనకు దిగితే కేసుల పేరుతో బెదిరించారు. రోజూ వేయి లారీలకుపైగా ఇసుకను తరలించారు. పరిమితికి మించి నింపుతూ అదనంగా వసూలు చేశారు. ఒక్కో రీచ్ నుంచి ఇసుక తవ్వకాల ద్వారా రూ.10 లక్షల మేర అక్రమాదాయం పొందారు. ఈ లెక్కన 10 రీచ్లకు కలిపి రోజుకు రూ.కోటి చొప్పున నెలకు రూ.30 కోట్లు పొందారు. 16 నెలలపాటు నిరాటంకంగా ఇసుక తవ్వకాలు సాగించడం ద్వారా రూ.480 కోట్లు అక్రమంగా ఆర్జించి, అందులో వైకాపా పెద్దలకు రూ.320 కోట్లు చెల్లించి ఆయన రూ.160 కోట్లు పొందారనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రజాప్రతినిధి మేతను స్ఫూర్తిగా తీసుకున్న స్థానిక వైకాపా నేతలు నదీ తీరంతోపాటు వాగులు, చెరువుల్లో మట్టి తవ్వి జేబులు నింపుకొన్నారు. ఆయన అనుచరుల్లో ఒకరు క్రోసూరు మండలంలో 50 ఎకరాల అటవీ భూములను చదును చేసి, ఎకరా రూ.లక్ష చొప్పున అమ్ముకున్నారు.
సొంత లారీలతో రవాణా
ఇసుక రవాణాను సైతం ఈ ప్రజాప్రతినిధి పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. తన కుమారుడి మిత్రుడు, అతని బంధువు పేర్లతో ఒక ట్రాన్స్పోర్టు సంస్థను ఏర్పాటు చేశారు. దీనిద్వారా నాడు-నేడు, జగనన్న కాలనీలకు ఉచిత ఇసుకను తరలించారు. లారీలకు సీరియల్ లేకుండా నేరుగా రీచ్లోకి వెళ్లి నింపుకొచ్చేవి. ఇందులో కొన్నింటిని లెక్కల్లో చూపకుండా సొమ్ము చేసుకున్నారు. పల్నాడు ప్రాంతంలోని సిమెంటు కంపెనీలు, గుత్తేదారులు, బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని ఇసుక తరలించారు. బినామీ ట్రాన్స్పోర్టు ద్వారా నెలకు రూ.2.50 కోట్ల వరకు అర్జించారు. 16 నెలల్లో ఖర్చులు పోగా రూ.40 కోట్లు వెనకేసుకున్నారు.
పేదల స్థలాల కొనుగోళ్లలోనూ దోపిడీ
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో 250 ఎకరాలను సేకరించింది. ఇందులోనూ ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. ఒక ఎకరం ధర రూ.15-20 లక్షలుగా పలుకుతున్న భూముల రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. వాటినే ఎకరాకు రూ.50-55 లక్షల చొప్పున ప్రభుత్వానికి అంటగట్టారు. రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమకాగానే అనుచరులను పంపించి, తన వాటాను వసూలు చేయించారు. ఒక గ్రామంలో 7.10 ఎకరాల భూమిని ఈ నేత అనుచరులు కొన్నారు. దాన్నే ప్రభుత్వానికి భూసేకరణలో ఇచ్చారు. అందులోని కొంతభూమి గుంటూరులోని ఒక బ్యాంకు తనఖాలో ఉంది. దీనిపై బ్యాంకు అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో... బకాయిలన్నీ చెల్లించేశారు.
బినామీ కంపెనీలతో రోడ్ల నిర్మాణం
ఈ ప్రజాప్రతినిధి... ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్ల పనులను తమ బినామీ గుత్తేదారు సంస్థకు ఇప్పించారు. రూ.149 కోట్లకుపైగా అంచనాతో చేపట్టిన రోడ్డు టెండర్లలో ఇతరులెవరూ పాల్గొనకుండా అడ్డుపడ్డారు. రెండు కంపెనీలే టెండర్లు వేసేలా చూసి పనులను దక్కించుకున్నారు. వారు వేసిందే రోడ్డు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
ప్రశ్నిస్తే హత్యాయత్నం కేసులు
- ఎన్నికలప్పుడు తమకు ఓట్లు వేయలేదని ఒక ఎస్సీ కాలనీలోని బడుగులపై వైకాపా కార్యకర్తలతో దాడిచేయించి, కేసులు పెట్టించారు. మరో గ్రామంలో మైనారిటీ నేతపై పదుల సంఖ్యలో కేసులు పెట్టించి, రౌడీషీట్ తెరిపించారు.
- రాజధాని మహిళా రైతులు అమరేశ్వరుని దర్శనానికి అమరావతి వెళ్తుండగా లేమల్లె వద్ద బస్సుపై దాడి చేశారు. ప్రతిఘటించిన తెదేపా వారిపై హత్యాయత్నం కేసులు పెట్టించి, రౌడీషీట్లు తెరిపించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద ధర్నాలో ఉన్న తెదేపా వారిపై రాళ్లతో దాడిచేశారు. ఈ ప్రజాప్రతినిధిని ప్రశ్నించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీరుపై కేసు పెట్టి, అనుచరులతో దాడి చేయించారు. తనకు ఎదురుతిరిగిన వైకాపా నేతపైనే హత్యాయత్నం కేసు పెట్టించారు. ఆ నేతకు సహకరించారనే నెపంతో మరో వ్యక్తిపై లేనిపోని కేసులు పెట్టించి, జిల్లా బహిష్కరణ చేయించడంతోపాటు పీడీ యాక్టు కింద జైలుకు పంపారు.
- ఇసుక రీచ్లలో అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని తెదేపా కార్యకర్తపై కేసు పెట్టించి, చిత్రహింసకు గురి చేశారు. ఎస్టీ కాలనీ వాసుల గృహాల్లో వాలంటీరు రూ.30 లక్షల అవినీతికి పాల్పడ్డాడని పోస్టు పెట్టినందుకు మరో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడులు చేశారు. సోషల్మీడియాలో వ్యతిరేక పోస్టు పెట్టారని, అమరావతి-బెల్లంకొండ రోడ్డు గురించి ప్రశ్నించారని ఇద్దరు ముస్లిం యువకులపై కేసులు పెట్టించారు.
- చెరువులో మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసినందుకు ఓ మాజీ సర్పంచిపై దాడులు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై మరో సర్పంచి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై అధికారులు పరిశీలిస్తున్న సమయంలో... న్యాయవాదులు, గ్రామస్థులపై పోలీసుల సమక్షంలో దాడులు జరిగాయి.
- మాట వినడంలేదని మండల స్థాయి అధికారిని బదిలీ చేయించడంతో ఆయన కోర్టు ద్వారా మళ్లీ విధులో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అనుకూలంగా వ్యవహరించలేదని పలువురిని బదిలీ చేయించారు. వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ తహసీల్దారు బదిలీ చేయించుకున్నారు.
సహధర్మం
ఈ ప్రజాప్రతినిధి సహధర్మచారిణి ఆయనకు నీడగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఏకంగా అధికారులతో సమీక్షలూ నిర్వహిస్తారు. ఉద్యోగుల బదిలీల్లోనూ కలగజేసుకుంటారు. డ్వాక్రా మహిళలకు ‘ఆసరా’ చెక్కుల పంపిణీ సభలోనూ అన్నీ తానై వ్యవహరించారు. ఇంటింటికీ తిరుగుతూ కుక్కర్లను పంపిణీ చేసి తన భర్తకు అండగా నిలవాలని కోరారు. అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పాస్టర్లు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, యానిమేటర్లు, వాలంటీర్లతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి తమను గెలిపించాలని కోరుతున్నారు.
ఈ ప్రజాప్రతినిధి తనయుడు ఇటీవల ఒక మండలంలో కొందరిని వెంటబెట్టుకుని వెళ్లి తెదేపా కార్యకర్తపై దాడి చేసి, వీరంగం చేసినా కేసు నమోదు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్