Akash Ambani: ‘ఆ విషయం మా నాన్న నమ్మలేదు’: ఆకాశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్య
కాలేజ్ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్ మూమెంట్స్ అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ(Akash Ambani) అన్నారు.
ముంబయి: తనకు మళ్లీ కళాశాల రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే.. తాను ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రయత్నిస్తానని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ(Akash Ambani) అన్నారు. ఐఐటీ బాంబేలో ప్రసంగించేందుకు ఆహ్వానం వచ్చిందని చెప్పినప్పుడు తన తండ్రి ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇచ్చిన రియాక్షన్ గురించి వెల్లడించారు. ఐఐటీ బాంబే(IIT Bombay) టెక్ఫెస్ట్లో పాల్గొన్న ఆయన కొన్ని ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు.
‘ఇక్కడకు రావడం నా లక్ష్యాల్లో ఒకటి. నేను ఇంజినీర్ కావాలని నా తండ్రి కోరుకునేవారు. కానీ నేను ఇంజినీర్ను కాదు. కానీ ఈ ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలో ప్రసంగించేందుకు అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ ప్రసంగించేందుకు ఆహ్వానం వచ్చిందంటే నా తండ్రి నమ్మలేదు. అందుకే సాక్ష్యం కోసం నా భార్యను వెంట పంపారు’ అని ఆకాశ్(Akash Ambani) చమత్కరించారు. ఐఐటీ బాంబే(IIT Bombay)కు రావడం ఎలా ఉందని అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.
‘పసిడి మెరుపులు.. భారీ GST వసూళ్లు.. రికార్డు యూపీఐ లావాదేవీలు..!’
తర్వాత తన విద్యాభ్యాసం గురించి వెల్లడించారు. ‘అదృష్టవశాత్తు.. నాకు కళాశాల విద్యకు సంబంధించి మంచి జ్ఞాపకాలున్నాయి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే.. కళాశాలలో గడిపిన సమయమే బెస్ట్గా ఉంటుందనేది నా అభిప్రాయం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే తరగతి గదిలో నా స్నేహితుల నుంచి నేర్చుకోవడంపై నేను ఎక్కువ దృష్టి పెట్టలేదు. వారి నుంచి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఒక విద్యార్థికి చదువుతో పాటు సమాజంతో కలివిడిగా ఉండటం ముఖ్యమని నా అభిప్రాయం’ అని అన్నారు.
ఐఐటీ బాంబే టెక్ఫెస్ట్లో భాగంగా బుధవారం ఆయన ప్రసంగం వైరల్ అవుతోంది. అలాగే ఈ సందర్భంగా తమ సంస్థ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు. ‘కంపెనీ అభివృద్ధికి ఒక వ్యవస్థను రూపొందించడం చాలా ముఖ్యం. జియో 2.0 పై ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఐఐటీ బాంబేతో కలిసి భారత్ జీపీటీ ప్రోగ్రామ్పై పనిచేస్తున్నాం. కృత్రిమ మేధ(ఏఐ)తో ప్రతీ రంగంలోని ఉత్పత్తులు, సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావొచ్చు. ఏఐని అన్ని రంగాల్లోనూ ఆవిష్కరించాలని చూస్తున్నాం. మీడియా, కామర్స్, కమ్యూనికేషన్స్లో ఉత్పత్తులు, సేవలను తీసుకురానున్నాం. గత కొద్ది కాలంగా టీవీల కోసం సొంత ఓఎస్పై పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక