Ambani succession plan: రిలయన్స్ బోర్డులోకి ముకేశ్ అంబానీ వారసులు
Ambani succession plan: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను క్రమంగా అమలు చేస్తున్నారు. గత ఏడాది తన ముగ్గురు పిల్లలకు వివిధ విభాగాల నిర్వహణ బాధ్యతలను అప్పగించిన ఆయన.. ఈసారి వారిని బోర్డులో నియమించారు.
ముంబయి: ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన వారసత్వ ప్రణాళిక (Ambani succession plan)ను క్రమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గత ఏడాదే తన ముగ్గురు పిల్లలు ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించిన ఆయన.. ఈ ఏడాది వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వీరు ముగ్గురు కేవలం వ్యాపార నిర్వహణ బాధ్యతల్లో మాత్రమే భాగస్వాములవుతూ వచ్చారు. ఇకపై కంపెనీ నిర్ణయాలు, విధానాల రూపకల్పనల్లోనూ ప్రధాన పాత్ర పోషించనున్నారు.
ఈరోజు రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశ (Reliance AGM) నిర్ణయాలను కంపెనీ ప్రకటించింది. దీనికి ముందు కంపెనీ బోర్డు సమావేశమైంది. ఈశా, అనంత్, ఆకాశ్లను బోర్డు సభ్యులుగా నియమిస్తూ అందులో నిర్ణయం తీసుకున్నారు. వీరు ఇకపై నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో సైతం కంపెనీ వెల్లడించింది. షేర్హోల్డర్ల ఆమోదం లభించిన వెంటనే వారు తమ కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తారని తెలిపింది.
డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ.. వినాయక చవితికి ఎయిర్ఫైబర్
గత ఏడాది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ బాధ్యతల్ని ఆకాశ్ అంబానీ (Akash Ambani) స్వీకరించారు. జియో ప్లాట్ఫామ్స్కు ఇన్ఫోకామ్ అనుబంధ సంస్థగా ఉంది. ప్లాట్ఫామ్స్ మాతృసంస్థే రిలయన్స్ ఇండస్ట్రీస్. జియో ప్లాట్ఫామ్స్లో గూగుల్, మెటా వంటి బడా సంస్థలకు వాటాలు ఉన్నాయి. మరోవైపు ఈశా అంబానీ (Isha Ambani) రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని తీసుకున్నారు. అలాగే అనంత్ అంబానీ (Anant Ambani) నూతన ఇంధన రంగ బిజినెస్ నిర్వహణని స్వీకరించారు.
మరోవైపు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరో ఐదేళ్ల పాటు కంపెనీ ఛైర్మన్ హోదాలో కొనసాగేందుకు రిలయన్స్ తమ షేర్హోల్డర్ల అనుమతి కోరనుంది. అలాగే ముకేశ్ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) బోర్డు డైరెక్టర్గా వైదొలగారు. తమ పిల్లలకు మార్గం సుగమం చేయడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమె నిర్ణయాన్ని బోర్డు వెంటనే ఆమోదించింది. ఇకపై ఆమె పూర్తిగా రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను చూసుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య