Ather 450S: ఓలాకు పోటీగా ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ధర, ఫీచర్లు ఇవే..!
Ather Energy 450S details: ఏథర్ ఎనర్జీ కొత్తగా 450 ఎస్ మోడల్ను లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ఎయిర్కు పోటీగా దీన్ని తీసుకొచ్చింది.
దిల్లీ: విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్లో పోటీకి తెరలేపుతూ ఏథర్ ఎనర్జీ సంస్థ (Ather Energy) మరో కొత్త ఈవీని లాంచ్ చేసింది. ఓలా (Ola EV) ఎంట్రీ లెవల్ స్కూటర్ ఎస్1 ఎయిర్కు (S1 Air) పోటీగా ఏథర్ 450Sను (Ather 450S) తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.29 లక్షలుగా నిర్ణయించింది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న స్కూటర్లకు అదనపు ఫీచర్లను జోడించింది.
కొత్తగా తీసుకొచ్చిన ఏథర్ 450Sలో 2.9 kWh బ్యాటరీ ఇస్తున్నారు. సింగిల్ ఛార్జింగ్తో 115 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లని ఏథర్ ఎనర్జీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఇప్పటికే ఉన్న 450X మోడల్ ఇకపై రెండు ఆప్షన్లతో వస్తుంది. ఒకటి సింగిల్ చార్జింగ్తో 115 కిలోమీర్ల రేంజ్ పనిచేస్తుంది. దీని ధరను కంపెనీ రూ.1.37 లక్షలుగా నిర్ణయించింది. 145 కిలోమీటర్ల రేంజ్ కలిగిన మోడల్ ధరను రూ.1.44 లక్షలుగా పేర్కొంది.
మూడేళ్ల తర్వాత హానర్ రీ ఎంట్రీ.. త్వరలోనే స్మార్ట్ఫోన్!
కొత్తగా తీసుకొచ్చిన వాహనంతో 450 శ్రేణిలో మూడు రకాల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అయ్యిందని ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు. ఇవి వేర్వేరు ధరల శ్రేణిలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎంట్రీ లెవల్ మోడల్ అయినప్పటికీ 450 క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని మెహతా పేర్కొన్నారు. 450Sలో పార్క్ అసిస్టెంట్, ఆటో హోల్డ్, సైడ్ స్టాండ్ సెన్సర్, ఆటో ఇండికేటర్ కటాఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 450Xలో 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అందిస్తుండగా.. 450Sలో మాత్రం 7 అంగుళాల డీప్వ్యూ డిస్ప్లే ఇస్తున్నారు. ఇందులో గూగుల్ మ్యాప్స్ కాకుండా టర్న్ బై టర్న్ నావిగేటర్ ఇస్తున్నారు.
దశలవారీగా స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. 450X మోడల్ 2.9 kWh బ్యాటరీ వేరియంట్ డెలవరీలు ఆగస్టు మూడో వారం నుంచి; 450S స్కూటర్ను ఆగస్టు చివరి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 450X మోడల్ 3.7 kWh బ్యాటరీ కెపాసిటీ కలిగిన వాహనాల డెలివరీని అక్టోబర్ నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.