Audi Q8 e-tron: ఆడి కొత్త ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్తో 600 కిలోమీటర్లు..!
ఆడి ఇండియా (Audi India) ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron) పేరుతో ఎస్యూవీ, స్పోర్ట్స్బ్యాక్ వేరియంట్లో ఈ కారు అందుబాటులో ఉంది.
దిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron) పేరుతో నాలుగు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చింది. ఆడి క్యూ8 50 ఈ-ట్రాన్, ఆడి క్యూ8 55 ఈ-ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్బ్యాక్ 50 ఈ-ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్బ్యాక్ 55 ఈ-ట్రాన్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, మెరుగైన ఇంజిన్ పనితీరు, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఈ కార్లు అందిస్తాయని కంపెనీ తెలిపింది. వీటిలో ప్రారంభ మోడల్ ధర రూ. 1.13 కోట్లు కాగా.. హైఎండ్ వేరియంట్ ధర రూ.1.30 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది.
ఆడీ క్యూ8 ఈ-ట్రాన్ ఫీచర్లు
- క్యూ8 55 మోడల్లో 114kWh బ్యాటరీ అమర్చారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కి.మీ ప్రయాణిస్తుంది. అలాగే 408 హెచ్పీ శక్తిని 664 ఎన్ఎమ్ టార్క్ను విడుదల చేస్తుంది. 5.6 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.
- క్యూ8 50 మోడల్లో 95kWh బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్తో 505 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది 340 హెచ్పీ శక్తిని 664 ఎన్ఎమ్ టార్క్ను విడుదల చేస్తుంది. ఈ మోడల్ ఆరు సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. 20 నుంచి 80 శాతం బ్యాటరీ 26 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
- ప్రయాణికుల భద్రత కోసం ఈ కారులో 8 ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్లో ఆటో, డైనమిక్, ఆఫ్-రోడ్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో ఏడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్లో సింగిల్ టచ్తో డ్రైవ్ మోడ్లను మార్చుకోవచ్చు. రహదారి పరిస్థితులకు అనుగుణంగా కారు ఎత్తును సర్దుబాటు చేసుకునేందుకు ఇందులో అడ్జస్టబుల్ రైడ్ హైట్ అనే ఫీచర్ ఉంది.
‘‘ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఆడి క్యూ8 ఈ-ట్రాన్ ఎస్యూవీ, స్పోర్ట్స్బ్యాక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆధునిక లగ్జరీ ఫీచర్లతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలు కావాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక. ఆడి కస్టమర్లను ఈ కార్లు తప్పక ఆకట్టుకుంటాయి’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడు జిల్లాలో వైకాపా, తెదేపా కార్యకర్తల పరస్పర దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన