Income tax: తక్కువ సేవింగ్స్ చేసే వారికి తక్కువ ట్యాక్స్..!
New Income tax Regime: కొత్త పన్ను విధానంవైపు వేతన జీవులను ఆకర్షించేందుకు మోదీ సర్కారు బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేపడుతూ ప్రకటన చేసింది. అదే సమయంలో పాత విధానం జోలికి ఏమాత్రం పోలేదు.
ఇంటర్నెట్ డెస్క్: పన్ను వర్తించే ఆదాయం (Income tax) పరిమితి విస్తరణ, శ్లాబుల సవరింపు, 80సి పెంపు.. ఇవీ గత కొంతకాలంగా మధ్య తరగతి ఆదాయ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్. గత కొన్నేళ్లుగా ఈ డిమాండ్ బలపడుతోంది. అయినా కొన్నేళ్ల నుంచి నిరాశే ఎదురవుతోంది. తాజా బడ్జెట్లో (Budget 2023) ఆదాయపు పన్ను విషయంలో కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది మోదీ సర్కారు. పాత విధానం జోలికి పోని ప్రభుత్వం.. కొత్త పన్ను విధానంలో భారీ మార్పులు చేపట్టింది. రూ. 7 లక్షల వరకు ఎటువంటి పన్ను పడకుండా రిబేట్ ప్రకటించింది. శ్లాబుల సంఖ్యను సైతం కుదించింది. రిటర్న్ల సమయంలో కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్గా మార్చింది. దీనిబట్టి ఎలాంటి మినహాయింపులూ లేని కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
పాత పన్ను విధానం ఇలా..
దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఏళ్లుగా ఒకే పన్ను చెల్లింపు విధానం అమల్లోఉంది. అయితే, 2020 బడ్జెట్లో తొలిసారి కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఐచ్ఛికం మాత్రమే. పాత పన్ను విధానమే డిఫాల్ట్ ఆప్షన్గా కొనసాగించారు. ఈ విధానంలో హెచ్ఆర్ఏ, 80C, 80D, 80CCD సెక్షన్ల కింద దాదాపు రూ.2.5 లక్షల వరకు వేతన జీవులు ఆదాయపు మినహాయింపులు పొందేవారు. ఈ విధానంలో ప్రస్తుతం మూడే పన్ను శ్లాబులు ఉన్నాయి. రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్నూ ఉండదు. మినహాయింపులు పోనూ ప్రస్తుతం రూ.5లక్షల వరకు ఎలాంటి పన్నూ వర్తించడం లేదు. ఒకవేళ ఆదాయం రూ.5 లక్షలు దాటిన మొత్తంపై 20 శాతం, రూ.10 లక్షలు దాటిన మొత్తంపై 30 శాతం పన్ను వర్తిస్తోంది.
ఆప్షనల్గా వచ్చి డిఫాల్ట్గా
ఎలాంటి మినహాయింపులూ చూపించకుండా ఆదాయాన్ని బట్టి పన్ను చెల్లించే కొత్త పన్ను విధానాన్ని 2020లో కేంద్రం తీసుకొచ్చినప్పటికీ.. ఇది పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో ఈ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో తాజాగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. రిబేట్తో కలిపి రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వెల్లడించారు. ఒకవేళ వార్షికాదాయం రూ.9 లక్షలు ఉన్నా.. 10 శాతం పన్ను శ్లాబులోకే వస్తారు. అదే పాత పన్ను విధానం అయితే రూ.5 లక్షలు దాటిన మొత్తంపై 20 శాతం పన్ను వర్తిస్తుంది. అయితే, రెండు పన్ను విధానాల్లో రూ.15 లక్షలు ఆదాయం దాటితే వర్తించే పన్ను శ్లాబు మాత్రం 30 శాతం అన్నది గుర్తుంచుకోవాలి. గృహరుణం తీసుకోని, పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయని వారికి కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది.
లక్ష్యం క్లియర్..
తాజా బడ్జెట్ ప్రకటన బట్టి వేతన జీవులను కొత్త పన్ను విధానం వైపు మరల్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వేతన జీవుల్లో ఎక్కువ మంది పన్ను ఆదా కోసం పొదుపునకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు రిటర్నులు ఫైల్ చేసే సమయంలో ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దీనికి ఛార్టెడ్ అకౌంటెంట్ వంటి నిపుణుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఎలాంటి మినహాయింపులు లేకుండా సులువుగా రిటర్నులు ఫైల్ చేసేందుకు కొత్త పన్ను విధానం వీలు కల్పిస్తోంది. దీన్నే డిఫాల్ట్ ఆప్షన్గా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం బట్టి సర్కారు లక్ష్యం అర్థమవుతోంది. లీవ్ ఎన్క్యాష్మెంట్ మినహాయింపు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడం మినహా పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులూ చేయకపోవడం బట్టి కొత్త పన్ను విధానానికి సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం అర్థమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..