Electric Vehicles: 2030 నాటికి ఈవీ విక్రయాల్లో ఈ రెండు విభాగాలదే ఆధిపత్యం!
రానున్న కొన్నేళ్లలో విద్యుత్తు ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయాలు వేగంగా పెరగనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక అంచనా వేసింది....
ఏసీఎంఏ, మెకిన్సీ నివేదిక
దిల్లీ: రానున్న కొన్నేళ్లలో విద్యుత్తు ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయాలు వేగంగా పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి మొత్తం విద్యుత్తు వాహన (EV) విక్రయాల్లో వీటి వాటాయే 50-70 శాతం ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల, భారీ వాణిజ్య వాహనాలతో పోలిస్తే ద్విచక్ర, త్రిచక్ర ఈవీలు మరింత అందుబాటు ధరలో లభ్యమవుతాయని పేర్కొంది. వాహన పరికరాల తయారీ సమాఖ్య (ACMA), మెకిన్సీ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.
2030 నాటికి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ విక్రయాల్లో ప్రయాణికుల వాహనాల వాటా 10-15 శాతం, భారీ వాణిజ్య వాహనాల వాటా 5-10 శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఈ రెండు విభాగాల్లో మరికొన్నేళ్ల పాటు సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలదే ఆధిపత్యం కొనసాగుతుందని తెలిపింది. ఈవీల విక్రయాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ ఇంధన వాహన పరికరాల తయారీ పడిపోతుందని పేర్కొంది. ఆ రంగంలోని కంపెనీలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది. అయితే, ఈవీ పరికరాల తయారీలోకి మారడానికి వాటికి ఇదొక అవకాశం కూడా అని పేర్కొంది. దేశీయ కంపెనీలు విదేశీ మార్కెట్ల అవసరాలకూ సరఫరా చేయొచ్చని తెలిపింది. స్థూలంగా ఈ దశాబ్దంలో మొత్తం వాహన పరిశ్రమ రూపురేఖలే మారిపోనున్నాయని పేర్కొంది.
విద్యుత్తు వాహనాలకు మారడంలో చైనా, ఐరోపా ముందుంటాయని నివేదిక తెలిపింది. ఈ దశాబ్దం మధ్య నాటికి భారత్, చైనాలో ప్రయాణికుల వాహన విక్రయాలు గరిష్ఠ స్థాయికి చేరతాయని పేర్కొంది. దీంతో వాహన రంగంలో ఈ రెండు దేశాలు ముందుంటాయని తెలిపింది. దేశీయ కంపెనీలు ఎగుమతులను విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఫలితంగా భారత్ భవిష్యత్తు వాహన తయారీ కేంద్రంగా అవతరిస్తుందని తెలిపింది.
నాలుగేళ్లలో 100 శాతం విద్యుదీకరణ: అమితాబ్ కాంత్
వచ్చే నాలుగేళ్లలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 100 శాతం విద్యుదీకరణే లక్ష్యంగా భారత్ ముందుకు సాగాలని జీ20 కూటమి షెర్పా అమితాబ్ కాంత్ అన్నారు. దేశంలో మొత్తం విక్రయాల్లో 80 శాతం వాటా వీటిదేనని తెలిపారు. దిల్లీలో బుధవారం జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2021-22లో భారత్లో 1.34 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహన యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2.60 లక్షల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1.75 కోట్ల వాహన విక్రయాలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే