Elon Musk: ‘వర్క్ ఫ్రమ్ హోం’పై ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
Elon Musk Criticizes Work From Home: వర్క్ ఫ్రమ్ హోంపై ఎలాన్ మస్క్ తొలి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ అడుగు ముందుకేసి ఈ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని (Work From Home)’ చేసే వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో దశలవారీగా తిరిగి ఆఫీసులకు రావాలని తమ ఉద్యోగులను ఆదేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసుల నుంచి పనిచేసే కొత్త హైబ్రిడ్ విధానం పుట్టుకొచ్చింది. అయితే, కొంత మంది ఇప్పటికీ ఇంటి నుంచే పనిచేయడానికి (Work From Home) మొగ్గు చూపుతున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) వర్క్ ఫ్రమ్ హోంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాన్ మస్క్ తొలి నుంచి వర్క్ ఫ్రమ్ హోం (Work From Home)పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్లా ఉద్యోగులంతా వారానికి కనీసం 40 గంటలు ఆఫీసు నుంచి పనిచేయాలని ఆదేశించారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల నుంచి ఆశించినంత ఉత్పాదకతను రాబట్టలేమని ఆయన గతంలో ఓ సందర్భంలో అభిప్రాయపడ్డారు. తాజాగా సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఓ అడుగు ముందుకేశారు. వర్క్ ఫ్రమ్ హోం (Work From Home) నైతికతకు సంబంధించిన విషయమన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) వల్ల.. కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిన సర్వీస్ వర్కర్లకు తప్పుడు సందేశం వెళ్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు. కార్ల తయారీ, వాహన సర్వీసింగ్, భవన నిర్మాణ కార్మికులు, వంట మనుషులు.. ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారు, ఇంట్లో ఉండి ల్యాప్టాప్పై పనిచేసేవారిని చూసి మరో రకంగా అనుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం విధానం కేవలం ఉత్పాదకతకు సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు. ఇది నైతికపరమైన విషయంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.