గ్రాసిమ్ లాభంలో 13% వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ.2,758.75 కోట్లుగా నమోదైంది.
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ.2,758.75 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2,447.97 కోట్లతో పోలిస్తే ఇది 12.7 శాతం అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.19,919.40 కోట్ల నుంచి 40.77 శాతం పెరిగి రూ.28,041.54 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.16,853.28 కోట్ల నుంచి రూ.24,393.95 కోట్లకు పెరిగాయి. ఏకీకృత-స్టాండలోన్ పద్ధతిలోనూ రికార్డు స్థాయి ఎబిటా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. స్టాండలోన్ పద్ధతిలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్రూ.7,253.04 కోట్ల ఆదాయంపై రూ.808.56 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అనుబంధ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ ఆదాయాలు రూ.11,829.82 కోట్ల నుంచి రూ.15,163.93 కోట్లకు చేరాయి. రసాయనాలు, జౌళి, ఆర్థిక సేవలు తదితర విభాగాలూ రాణించాయి. రంగుల వ్యాపారంలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఈ ఏడాది మేలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
హీరో మోటోకార్ప్ లాభం రెట్టింపు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్లో హీరో మోటోకార్ప్ ఏకీకృత ప్రాతిపదికన రూ.585.58 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.256.46 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే అధికం. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,502.80 కోట్ల నుంచి రూ.8,447.54 కోట్లకు వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మోటార్సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు 36 శాతం పెరిగి 13.90 లక్షలుగా నమోదయ్యాయి. వ్యయ నియంత్రణ చర్యలకు తోడు, వాహన ధరలు పెంచడం, కొత్త మోడళ్ల విడుదలతో కంపెనీ మార్జిన్లను నిలబెట్టుకున్నట్లు సంస్థ వివరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎదురైన సరఫరా వ్యవస్థ ఆటంకాలు, ఇతర ప్రతికూలతలను తట్టుకున్నామని తెలిపింది. మొత్తం వ్యయాలు రూ.5,169.4 కోట్ల నుంచి రూ.7,692.93 కోట్లకు పెరిగాయి. ముడివస్తువుల వ్యయాలు రూ.4,174.94 కోట్ల నుంచి రూ.6,095.68 కోట్లకు చేరాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ప్రారంభించామని, మార్చి త్రైమాసికంతో పాటు గతేడాది జూన్ త్రైమాసికంతో పోల్చినా, మెరుగైన వృద్ధి సాధించామని హీరో మోటోకార్ప్ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా అన్నారు. పండగల సీజన్ ప్రారంభం కావడంతో ద్విచక్రవాహనాలకు గిరాకీ పెరగొచ్చని, సాధారణ వర్షపాతం వంటి ఇతర అంశాలు ఇందుకు కలిసిరావొచ్చని అంచనా వేశారు. పండగల సీజన్లో విద్యుత్ వాహనాన్ని విడుదల చేయడానికి చూస్తున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికుల వాహన సరఫరాలు 11% పెరిగాయ్: సియామ్
దిల్లీ: సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడడంతో జులైలో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల (పీవీ) సరఫరా 11 శాతం పెరిగిందని వాహన డీలర్ల సంఘం సియామ్ పేర్కొంది. 2021 జులైలో 2,64,442 పీవీల సరఫరా జరగ్గా.. గత నెలలో ఇవి 2,93,865కు పెరిగాయి. ప్రయాణికుల కార్ల సరఫరా 1,30,080 నుంచి 10% పెరిగి 1,43,522కు చేరాయి. యుటిలిటీ వాహనాల టోకు అమ్మకాలు 11% వృద్ధితో 1,37,104గా నమోదయ్యాయి. వ్యాన్ల సరఫరాలు 10,305 నుంచి 13,239కి చేరాయి. మొత్తం ద్విచక్ర వాహనాల సరఫరా 10% హెచ్చి 13,81,303కు పెరిగాయి. స్కూటర్ల టోకు అమ్మకాలు 3,73,695 నుంచి 4,79,159కు చేరాయి. మోటార్సైకిళ్ల టోకు అమ్మకాలు 8,37,166 నుంచి 8,70,028కు, త్రిచక్ర వాహనాల సరఫరా 18,132 నుంచి 31,324కు పెరిగింది.
యూపీఐతో ఎన్పీఎస్ చెల్లింపులు
ఈనాడు, హైదరాబాద్: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లకు చెల్లించే మొత్తాలను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జమ చేసేందుకు పీఎఫ్ఆర్డీఏ వీలు కల్పించింది. ఇప్పటివరకూ ఈ పథకాలకు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ పద్ధతుల్లోనే నిధులు జమ చేసే వీలుండేది. దీనికి తోడుగా నేరుగా ఈ పథకాల్లో నిధులు జమ చేసే చందాదారుల కోసం యూపీఐ ఆధారిత వ్యవస్థనూ అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ శుక్రవారం వెల్లడించింది. చందాదారులు తమ 15అంకెల వర్చువల్ అకౌంట్ సంఖ్య ద్వారా ఈ చెల్లింపులు జరపొచ్చు. రోజూ ఉదయం 9.30 గంటల్లోపు వచ్చే పెట్టుబడులను అదే రోజు చెల్లించినట్లుగా పరిగణిస్తామని వెల్లడించింది.
బ్రిటన్కూ మాంద్యం భయాలు
ఏప్రిల్-జూన్ జీడీపీలో క్షీణత
లండన్: బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఏప్రిల్-జూన్లో దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) క్షీణించడమే ఇందుకు కారణం. రాబోయే త్రైమాసికాలపై భయాలను పెంచింది. జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం మేర తగ్గింది. జనవరి-మార్చిలో 0.8 శాతం వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. చాలా వరకు రిటైలర్లకు జూన్ త్రైమాసికం కఠినంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. జీవన వ్యయాలు పెరగడం; ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయి 9.4 శాతం నుంచి మరింత పెరిగేందుకు అవకాశం ఉండడం వల్ల ఈ ఏడాది చివర్లో దేశం మాంద్యంలోకి వెళ్లవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో సగటు బ్రిటిషర్ ఇంధన వ్యయాలు ఈ ఏడాది 50 శాతం పెరిగాయి. బ్రిటన్కు కొత్త ప్రధాని సెప్టెంబరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్తో ఇది వస్తోంది. -
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
బైజూస్ సంస్థ పూర్వ వైభవం కోసం కృషి చేస్తోంది. ఇందులోభాగంగా కోర్సు ఫీజులను తగ్గించింది. సేల్స్ టీమ్కు ప్రోత్సాహకాలను పెంచింది. -
దలాల్ దఢేల్: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22 వేల స్థాయిని కోల్పోయింది. -
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. -
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్బడ్స్ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
Ola CEO: ఓలా సీఈఓ చేసిన ఓ పోస్ట్ను లింక్డిన్ తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు రానుంది. మే 15న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 17న ముగియనుంది. -
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
TCS CEO Salary: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అదే సమయంలో సీఓఓ గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
AI Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. -
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. -
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!