ఆహార సేవలకు భారీ గిరాకీ
భారత ఆహార సేవల విపణి 2028 నాటికి 79.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.51 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని ఆహార సేవలు, రెస్టారెంట్ల వ్యాపారం 2022-23 నివేదిక వెల్లడించింది.
2028 నాటికి 79.65 బి.డాలర్లకు విపణి: నివేదిక
దిల్లీ: భారత ఆహార సేవల విపణి 2028 నాటికి 79.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.51 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని ఆహార సేవలు, రెస్టారెంట్ల వ్యాపారం 2022-23 నివేదిక వెల్లడించింది. 2022లో 41.1 బి.డాలర్లుగా ఉన్న ఈ విపణి 11.19 శాతం వార్షిక సంచిత వృద్ధి రేటు (సీఏజీఆర్)ను సాధిస్తుందని తెలిపింది. ఫ్రాన్కార్ప్, రెస్టారెంట్ఇండియా.ఇన్లు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. నివేదిక ప్రకారం..
* కొవిడ్-19 సమయంలో సుమారు 20 లక్షల మందికి పైగా ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోయారు. అయితే 2025 నాటికి ఉపాధి అవకాశాలు మళ్లీ కోటికి చేరతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
* రెస్టారెంట్లు, ఆహార సేవల విపణి దేశంలో రెండు విభాగాలుగా ఉంది. ఇందులో వ్యవస్థీకృతం కాని విభాగమే అధిక వాటా కలిగి ఉంది. వ్యవస్థీకృత విభాగం కూడా 2014-2020 మధ్య బలమైన వృద్ధి రేటును నమోదు చేసింది.
* దేశంలో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల (క్యూఎస్ఆర్) విపణి ఈ ఏడాది 690.21 మిలియన్ డాలర్లు ఉండగా, 2027 నాటికి 9.15 సీఏజీఆర్తో 1069.3 మి.డాలర్లకు చేరుకుంటుంది.
* 2020-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య క్యూఎస్ఆర్ చైన్ మార్కెట్ 23 శాతం సీఏజీఆర్తో అత్యధిక వృద్ధి సాధించే ఉప విభాగంగా నిలవనుంది. చైన్ మార్కెట్లోనే కాకుండా పూర్తి ఆహార సేవల విపణిలో ఇది అధిక వృద్ధిని నమోదు చేస్తుంది.
* మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, డొమినోస్ వంటి పెద్ద ఆహార సేవల చైన్ వ్యాపారాలు దేశంలోని చిన్న పట్టణాలకు కూడా వ్యాపిస్తూ యువతరాన్ని ఆకట్టుకుంటుండటంతో గిరాకీ బాగా పెరుగుతోంది.
* ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని మధ్య స్థాయి ఆదాయ కుటుంబాలు ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లపై గత రెండేళ్లలో వ్యయాల్ని రూ.2,500 నుంచి రూ.5,400కు పెంచాయి. అంటే 108 శాతం వృద్ధి నమోదైంది.
* 2021 నాటికి ఆహార సేవల రంగంలో 73 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కొవిడ్-19 సమయంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2025 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య కోటికి చేరొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది.
* ద్రవ్యోల్బణం ప్రభావంతో సుమారు 51 శాతం మంది వినియోగదార్లు తక్కువగా ఆర్డర్లు చేస్తున్నారు. 40 శాతం మంది తక్కువ ఆహార పదార్థాలను లేదా తక్కువ ధర కలిగిన వాటిని ఆర్డర్ చేస్తున్నారు.
* 2021లో 96 శాతం మంది ఆపరేటర్లు కీలకమైన ఆహారం లేదా పానీయాల కొరత ఎదుర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఇది కొనసాగొచ్చు. ఈ రంగాన్ని ప్రస్తుతం సరఫరా ఆలస్యం, కీలక ఆహార పదార్థాల కొరత వంటివి ఇబ్బంది పెడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..