హిండెన్బర్గ్పైౖ న్యాయ పరమైన చర్యలకు చూస్తున్నాం
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అదానీ గ్రూప్
దిల్లీ
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అదానీ గ్రూప్, తమ కంపెనీల షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతా పుస్తకాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ హిండెన్బర్గ్ నివేదిక వెలువరించింది. ఈ నివేదిక అదానీ గ్రూప్, వాటాదార్లు, మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపిందని, భారత పౌరుల్లో అనవసర భయాలను సృష్టించిందని అదానీ గ్రూప్ లీడ్ హెడ్ జతిన్ జలుంధ్వాలా పేర్కొన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలపై ప్రతికూల ప్రభావం పడేలా, నివేదికలోని అంశాలను రూపొందించారని, ఇందుకోసం నిరాధార అంశాలను పొందుపర్చారని తెలిపారు. పెట్టుబడిదార్ల సమూహాన్ని, అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఒక విదేశీ సంస్థ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం బాధ కలిగించిందని వెల్లడించారు. భారత, అమెరికా చట్టాల ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అదానీ గ్రూప్ ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్పీఓ (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ఈనెల 27న ప్రారంభం కానున్న నేపథ్యంలో, దానికి ఆదరణ దక్కకూడదనే ఉద్దేశంతోనే హిండెన్బర్గ్ ఇలా చేసిందని పేర్కొన్నారు.
* కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారే కానీ, హిండెన్బర్గ్పై అదానీ గ్రూప్ దావా వేసే ఆలోచనలు ఉన్నట్లు సంస్థ ప్రకటన స్పష్టం చేయలేదు.
ఒకరోజులో రూ.48,000 కోట్ల నష్టం
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు బుధవారం ఒక్కరోజే 3-8 శాతం కుదేలయ్యాయి. ఫలితంగా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో గౌతమ్ అదానీ సంపద విలువ 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.48,600 కోట్లు) తగ్గింది. ప్రస్తుతం 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో అదానీ ఉన్నారు.
అజర్ బైజాన్లో అదానీ పెట్టుబడులు
అజర్బైజాన్లో పెట్రోరసాయనాలు, గనుల ప్రాజెక్టులను దక్కించుకోవాలని అదానీ గ్రూప్ చూస్తోంది. భారత వెలుపల కూడా వ్యాపారాన్ని విస్తరించాలని సంస్థ భావిస్తోంది. గతవారం దావోస్లో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియెవ్తో జరిగిన భేటీలో, అదానీ ఈ ప్రణాళికలపై చర్చించారని అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది.
అదానీ గ్రూప్పై నివేదికకు కట్టుబడి ఉన్నాం: హిండెన్బర్గ్
న్యాయపరమైన చర్యలు చేపట్టే మార్గాలు పరిశీలిస్తున్నట్లు, అదానీ గ్రూప్ హెచ్చరించిన నేపథ్యంలో హిండెన్బర్గ్ స్పందించింది. అదానీ గ్రూప్పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు ఆధారాలుగా తమ వద్ద పలు పత్రాలు ఉన్నాయని గురువారం స్పష్టం చేసింది. నివేదికలో తాము సూటిగా వేసిన 88 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదని వెల్లడించింది. ‘నివేదిక విడుదల చేసి 36 గంటలు గడిచినా, కంపెనీ పారదర్శకంగా ఉందని చెప్పడానికి అడిగిన 88 ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేదు’ అని హిండెన్బర్గ్ పేర్కొంది. తమపై ఏ న్యాయపరమైన చర్యకు ప్రయ త్నించినా, అది సఫలం కాదని అభిప్రాయపడింది. అదానీ గ్రూప్ కనుక అమెరికా కోర్టులో దావా వేస్తే, ఆ కంపెనీకి చెందిన మరిన్ని పత్రాలు ఇమ్మని కోరతామని తేల్చి చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.