కంటి చుక్కల మందుపై యూఎస్లో కలకలం
భారతీయ ఔషధ కంపెనీలు మందుల నాణ్యత విషయంలో అంతర్జాతీయంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.
హానికారక బ్యాక్టీరియా గుర్తింపు, కొందరికి అస్వస్థత
సరఫరా చేసిన భారతీయ కంపెనీపై చర్యలు?
పూర్వాపరాలపై ‘ఫార్మాగ్జిల్’ విచారణ
ఈనాడు - హైదరాబాద్: భారతీయ ఔషధ కంపెనీలు మందుల నాణ్యత విషయంలో అంతర్జాతీయంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆఫ్రికాలోని గాంబియాలో దగ్గు మందు కారణంగా 66 మంది పిల్లలు చనిపోగా.. ఆ మందు సరఫరా చేసిన మేడెన్ ఫార్మా ఇబ్బందుల్లో పడింది. మరియోన్ బయోటెక్ అనే కంపెనీకి చెందిన మందును ఉజ్బెకిస్తాన్లో వినియోగించి 18 మంది పిల్లలు ప్రాణాపాయానికి గురయ్యారు. తాజాగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ అనే సంస్థ, అమెరికా మార్కెట్కు ‘కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్’ పద్ధతిలో సరఫరా చేసిన కంటి చుక్కల మందు విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది.
ఇలా కనిపెట్టారు..
‘ఎజ్రికేర్’ అనే బ్రాండు పేరుతో ఈ సంస్థ కంటి చుక్కల మందును అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ మందు సీసాలో ‘సూడోమనాస్ ఏరుజినోసా’ అనే ఒక హానికారక బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మందులకు లొంగదు. దీనివల్ల యూఎస్లోని కాలిఫోర్నియా, కొలరాడో, కనెటికట్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, న్యూయార్క్... తదితర ప్రాంతాల్లో 55 మందికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకడమే కాకుండా, కొందరికి కంటి సమస్యలు ఎదురైనట్లు, ఒకరు చనిపోయినట్లు వెలుగులోకి రావడంతో పెద్ద కలకలం రేగింది. దీనిపై యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించటంతో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) రంగంలోకి దిగి, ఈ మందును గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ నుంచి దిగుమతి చేయకుండా నిషేధించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా మార్కెట్ నుంచి ఈ మందును వెనక్కి తీసుకోవాలని గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ నిర్ణయించింది. ఈ తాజా వ్యవహారం మనదేశంలో అటు ఫార్మా పరిశ్రమ వర్గాల్లో, ఇటు ఔషధ నియంత్రణ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ), ఫార్మాగ్జిల్ (ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) రంగంలోకి దిగాయి.
పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశం
ఇప్పటికే గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఫార్మాగ్జిల్ కోరింది. మీకున్న ఔషధ ఎగుమతుల లైసెన్సులు ఎన్ని? ఏ ఔషధాలకు అనుమతులు తీసుకున్నారు? సంబంధిత పూర్తి సమాచారాన్ని వెంటనే తెలియజేయాలంటూ ఆదేశించింది. అంతేగాక అమెరికా మార్కెట్కు సరఫరా చేసిన మందు విషయంలో ఎందుకు సమస్యలు తలెత్తాయనేది పరిశీలించి ఆ వివరాలు కూడా సత్వరం అందించాలని స్పష్టం చేసింది. ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ను దీనిపై ‘ఈనాడు’ సంప్రదించగా.. ‘మన ఔషధ పరిశ్రమకు ఇది ఎంతో నష్టం కలిగించే వ్యవహారం. తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నాం. యూఎస్ మార్కెట్ మనకు ఎంతో ముఖ్యం. మన ఔషధ ఎగుమతుల్లో మూడో వంతు యూఎస్ మార్కెట్కు వెళ్తున్నాయి. అందువల్ల ఇది మన ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న అంశం’ అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా యూఎస్తో పాటు అంతర్జాతీయంగా భారతీయ ఔషధ పరిశ్రమ ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. యూఎస్ వెలుపల యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉన్న యూనిట్లు అత్యధికంగా మన దేశంలోనే ఉన్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..