గృహ, వాహన రుణాలు మరింత ప్రియం
రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఫలితంగా ఇల్లు, వాహన కొనుగోలు కోసం కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు, ఇప్పటికే తీసుకున్న వారు కూడా నెలవారీ వాయిదా కింద ప్రస్తుతం కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.
నెలవారీ వాయిదాలు భారం
రెపోరేటు 0.25% పెంచిన ఆర్బీఐ
మరిన్ని పెంపులుంటాయని సంకేతాలు
వచ్చే ఏడాది జీడీపీ అంచనా 6.4%
విదేశీయులకూ యూపీఐ అందుబాటులోకి
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే గట్టిగా కట్టుబడి ఉన్నాం. కరోనాకు ముందుతో పోలిస్తే విధాన రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నాయి. వ్యవస్థలో ద్రవ్యలభ్యతకు ఇబ్బంది లేదు. అంతర్జాతీయ కమొడిటీ ధరల్లో అనిశ్చితులు కనిపిస్తున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. రబీ సీజనులో భారీ దిగుబడుల వల్ల ఆహార ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఫలితంగా ఇల్లు, వాహన కొనుగోలు కోసం కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు, ఇప్పటికే తీసుకున్న వారు కూడా నెలవారీ వాయిదా కింద ప్రస్తుతం కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. తాజా సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును మరో 0.25% పెంచడం ఇందుకు నేపథ్యం. 2022 మే నుంచి ఇప్పటిదాకా రెపోరేటును 6 విడతలలో 2.5 శాతం (250 బేసిస్ పాయింట్లు) పెంచినట్లయ్యింది. బుధవారం ముగిసిన పరపతి విధాన కమిటీ (ఎమ్పీసీ) సమావేశంలో, రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులకు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు)ను 6.25 శాతం నుంచి 6.5 శాతానికి చేర్చాలని 4-2 ఓటింగ్తో నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉన్నందున, భవిష్యత్తులోనూ రేట్ల పెంపులు ఉంటాయన్న సంకేతాలను ఆర్బీఐ ఇచ్చింది.
వృద్ధి రేటు-ద్రవ్యోల్బణ అంచనాలివీ..: ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదుకావొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. (ఆర్థిక సర్వే అంచనా 6.5% కావడం గమనార్హం.) ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనా 7 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. అంతర్జాతీయ వృద్ధి వాతావరణం కాస్తంతే మెరుగైందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ‘కొద్ది నెలల కిందటితో పోలిస్తే ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి అంచనాలు మెరుగైనా, ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయుల్లోనే ఉంద’ని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాలను 6.8% నుంచి 6.5 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
ప్రభుత్వ సెక్యూరిటీలపై కీలక నిర్ణయం: ప్రభుత్వ సెక్యూరిటీలను అప్పుగా ఇవ్వడానికి, తీసుకోవడానికి (లెండింగ్/బారోయింగ్) అనుమతి ఇచ్చింది. తద్వారా పెట్టుబడిదార్లు తమ వద్ద ఉన్న సెక్యూరిటీలపై ప్రతిఫలాలను పెంచుకోవచ్చని పేర్కొంది. ‘ఈ చర్యల వల్ల ప్రభుత్వ బాండ్ల మార్కెట్ విస్తృతి, ద్రవ్యలభ్యత పెరుగుతుంది. ధరలకు మద్దతు లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్ రుణ పథకాలు సులువుగా పూర్తి కాగలవ’ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ సమయాన్ని కరోనాకు ముందున్నట్లుగా, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సవరించింది.
మన రూపాయి.. బలంగానే..: ఆసియాలోనే అతి తక్కువ ఊగిసలాటలున్న కరెన్సీగా రూపాయి కొనసాగుతోందని దాస్ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ఇతరత్రా సంక్షోభాల సమయంలోని హెచ్చుతగ్గులతో పోలిస్తే ప్రస్తుత ఊగిసలాటలు చాలా తక్కువేనన్నారు.
* ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేస్తున్న యాప్ల జాబితాను ప్రభుత్వానికి ఇచ్చామని.. దీని ఆధారంగా ప్రభుత్వం ఇతర యాప్లపై నిషేధం విధించిందని దాస్ తెలిపారు.
* డిజిటల్ రూపాయి: ఇటీవల ఆవిష్కరించిన ఇ-రూపాయి (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టును 50,000 మంది వినియోగదార్లు, 5,000 మంది వ్యాపారులు వినియోగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. రిటైల్ వినియోగదార్ల కోసం ఇ-రూపాయి జారీకి మరో 5 బ్యాంకులు, ఇంకో 9 నగరాల్లో జత చేరాయి.
* దేశీయ మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు.
* సూక్ష్మ, చిన్న, మధ్య కంపెనీ(ఎమ్ఎస్ఎమ్ఈ)లకు మరిన్ని రుణాలిచ్చే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
* తగిన సమయంలో నెలవారీ వాయిదాలను చెల్లించకపోతే విధించే అపరాధ రుసుములపై ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ త్వరలోనే జారీ చేయనుంది. హరిత డిపాజిట్లను అంగీకరించడంపైనా మార్గదర్శకాలను జారీ చేయనుంది.
* 2023-24లో తొలి పరపతి విధాన సమావేశం ఏప్రిల్ 3-6 తేదీల్లో జరగనుంది.
బ్యాంకులు పెంచేశాయ్
ఆర్బీఐ ప్రకటన వెంటనే, రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్లను (ఆర్ఎల్ఎల్ఆర్) పెంచుతున్నట్లు పలు బ్యాంకులు బుధవారమే వెల్లడించాయి.
* బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేటును 9.35 శాతానికి పెంచాయి.
* ఆర్బీఎల్ బ్యాంక్ వడ్డీ రేటు 11.60 శాతానికి చేరింది. నీ ఇండియన్ బ్యాంక్ ప్రామాణిక రెపో రేటును 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. నీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో ఆధారిత వడ్డీ రేటును 9.00 శాతానికి చేర్చింది.
క్యూఆర్ కోడ్ ఆధారిత నాణేల వెండింగ్ మెషీన్లు
ముంబయి: చిల్లర నాణేలకు అధికంగా డిమాండు ఉండే కూరగాయల మార్కెట్ల సమీపంలో నాణేల వెండింగ్ మెషీన్లను ఆర్బీఐ ఏర్పాటు చేస్తోంది. అయితే నాణేల కోసం జమచేస్తున్న వాటిలో నకిలీ నోట్లు ఉంటున్నందున, ప్రత్యామ్నాయంగా యూపీఐ ఆధారిత వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నరు టి.రవి శంకర్ తెలిపారు. కరెన్సీ నోట్లకు బదులుగా యూపీఐకి అనుసంధానమైన క్యూఆర్ కోడ్ ఉపయోగించి నాణేలను పొందాల్సి ఉంటుంది. నేరుగా వినియోగదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్డ్రా అయి, అతనికి నాణేలు అందుతాయి. ఇప్పటికే ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించామని వెల్లడించారు. ప్రజలు తమకు కావాల్సిన సంఖ్యలో, డినామినేషన్లో నాణేలను ఈ మెషీన్ ద్వారా తీసుకోవచ్చ’ని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. తొలుత దేశవ్యాప్తంగా 12 నగరాల్లో రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్లు, మార్కెట్ల సమీపంలో 19 ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత వెండింగ్ మెషీన్లను ప్రయోగాత్మక పద్ధతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
‘అదానీ గ్రూప్ రుణాల ప్రభావం బ్యాంకులపై ఉండదు’
అదానీ గ్రూప్నకు దేశీయ బ్యాంకులు ఇచ్చిన రుణాలు ‘మరీ ఎక్కువగా లేవ’ని ఆర్బీఐ పేర్కొంది. మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా బలంగా, భారీగా ఉందని.. అది కేవలం ‘ఒక సందర్భం’ వల్ల ప్రభావితం కాజాలదని పేర్కొంది. ఆయా కార్పొరేట్ల ఆస్తులు, నగదు, ప్రాజెక్టుల ఆధారంగానే దేశీయ బ్యాంకులు రుణాలిస్తున్నాయి కానీ, వాటి మార్కెట్ విలువ పరంగా కాదని డిప్యూటీ గవర్నర్ ఎమ్.కె. జైన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?