Karvy Group: ఆ సొమ్ము ఏమైనట్లు?
కార్వీ గ్రూపు కుంభకోణంలో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) ఒకదాని తర్వాత మరొకటిగా తుది ఉత్తర్వులు జారీ చేస్తోంది.
కార్వీ గ్రూపు కుంభకోణంలో తేలని రూ.1442 కోట్ల లెక్క
కేఎస్బీఎల్ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ కేపిటల్కు బదిలీ
ఆ సంస్థల నుంచి నిధులు ఎక్కడికి మళ్లించారో తేలలేదు
ఆ సొమ్ము వస్తేనే 3 లక్షల మంది బాధితులకు న్యాయం
ఈనాడు - హైదరాబాద్
కార్వీ గ్రూపు కుంభకోణంలో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) ఒకదాని తర్వాత మరొకటిగా తుది ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పటి వరకు కార్వీ కేపిటల్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్), కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఈ వ్యవహారంలో సెబీ దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లుగా కనిపిస్తోంది.
* తన వద్ద ట్రేడింగ్/ డీమ్యాట్ ఖాతాలు నిర్వహిస్తున్న మదుపరులకు చెందిన ఈక్విటీ షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి, కేఎస్బీఎల్ సమీకరించిన అప్పుల నుంచి రూ.1094 కోట్ల నగదు కార్వీ రియాల్టీకి బదిలీ అయినట్లు తేలింది. ఆ సొమ్ము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది, ఎలా దుర్వినియోగం అయ్యిందనే విషయం ఇంకా వెలుగు చూడలేదు.
* అదే విధంగా కార్వీ కేపిటల్ అనే మరొక అనుబంధ కంపెనీకి, కేఎస్బీఎల్ రూ.348 కోట్లు తరలించినట్లు నిర్థారణ అయింది.
* అంటే ఈ 2 కంపెనీలకు మళ్లించిన రూ.1442 కోట్ల సొమ్ము ఏమైంది, ఎటు వెళ్లింది.. అనే విషయం మాత్రం తెలియలేదు.
మూలమే ఇది
తనవి కానివి, పూర్తిగా మదుపరులకు చెందిన షేర్లను తనఖా పెట్టడం ద్వారా కేఎస్బీఎల్ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి, ఆ సొమ్మును దుర్వినియోగం చేయడమే ఈ కుంభకోణానికి మూలం. అప్పుగా తెచ్చిన సొమ్ములో కొంత కార్వీ రియాల్టీకి, కార్వీ కేపిటల్కు బదిలీ చేసిన విషయం సెబీ ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఆ తర్వాత ఎర్నెస్ట్ అండ్ యంగ్ నిర్వహించిన ‘ఫోరెన్సిక్ ఆడిట్’ లోనూ ఈ విషయం రుజువైంది. ‘ఈ సొమ్ము చివరికి ఎక్కడ తేలింది.. దానికి బాధ్యులు ఎవరు.. ఆ సొమ్మును వెనక్కి తెప్పించే అవకాశం ఉందా’ అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. కార్వీ బాధితులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎంతో మందికి ఇంకా వారి షేర్లు, సొమ్ము రావలసి ఉంది. కేఎస్బీఎల్ అనుబంధ కంపెనీలకు బదిలీ అయిన సొమ్ము వ్యవహారం తేలితే, దాన్ని వెనక్కి తెప్పించి, బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొందరిపై నిషేధం, జరిమానా
ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సెబీ, పలు చర్యలు తీసుకుంది. తొలుత బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం కోసం కేఎస్బీఎల్ తనఖా పెట్టిన మదుపరుల షేర్లను బ్యాంకుల నుంచి ఆయా మదుపరుల ఖాతాకు బదిలీ చేయించింది. కార్వీ కుంభకోణం వెలుగులోకి రాగానే ఈ చర్య తీసుకుంది. తదుపరి కార్వీ స్టాక్బ్రోకింగ్ లైసెన్సును సస్పెండ్ చేసింది.
* తాజాగా కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్తో పాటు సంస్థ సీఎండీ సి.పార్థసారథిని ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించి, రూ.21 కోట్ల జరిమానా విధించింది.
* కేఎస్బీఎల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్న బీడీ నారంగ్, జ్యోతి ప్రసాద్లను రెండేళ్ల పాటు కీలకమైన పదవులు చేపట్టకుండా నిషేధించడంతో పాటు, వారిపై రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది.
* కేఎస్బీఎల్కు సీఈఓగా వ్యవహరించిన రాజీవ్ రంజన్ సింగ్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కేఎస్బీఎల్కు అనుబంధ సంస్థ అయిన కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్పై సస్పెన్షన్ విధిస్తూ సెబీ మరొక ఉత్తర్వు జారీ చేసింది.
* అదే సమయంలో మరొక డైరెక్టర్ మేక యుగంధర్కు ఈ కుంభకోణంతో సంబంధం లేదని సెబీ నిర్థారించింది. కేఎస్బీఎల్ చేసిన తప్పులు, తీసుకున్న అప్పులతో తనకు బాధ్యత లేదని, పైగా కంపెనీలో చోటుచేసుకుంటున్న లొసుగులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని తాను కోరినా, ఎవరూ పట్టించుకోలేదని యుగంధర్ చెప్పిన విషయాన్ని సెబీ పరిగణనలోకి తీసుకుంది. మరొక డైరెక్టర్ ఆషిష్ అగర్వాల్నూ వదలిపెట్టింది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచన
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ బాధితుల్లో కొంతమందికి నిధులు, షేర్లు వెనక్కి వచ్చినా, ఇంకా 3 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నట్లు సెబీ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతమందికి న్యాయం జరగాలంటే కార్వీ రియాల్టీ, కార్వీ కేపిటల్కు బదిలీ చేసిన సొమ్ము ఏమైందో, ఎక్కడుందో తేల్చి.. వెనక్కి తెప్పించాలి. అది ఎప్పుడు జరుగుతుందో.. ఎంతవరకూ సాధ్యమో కూడా స్పష్టత లేదు. అప్పటి వరకు బాధితులకు ఎదురుచూపులు తప్పేటట్లు లేదు. కార్వీ బాధితులు గత మూడేళ్లుగా తీవ్ర వేదనకు గురవుతున్నారు. రూ.1442 కోట్లను 3 నెలల్లోగా కార్వీ రియాల్టీ, కార్వీ కేపిటల్ వెనక్కి ఇవ్వని పక్షంలో ఈ కంపెనీలను ఎన్ఎస్ఈ ఆఫ్ ఇండియా తన నియంత్రణలోకి తీసుకుంటుందని సెబీ తాజాగా స్పష్టం చేసింది. ఈ చర్యతో తమ సొమ్ము వెనక్కి వస్తే సరి.. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కొంతమంది బాధితులు స్పష్టం చేస్తున్నారు. కేఎస్బీఎల్ బదిలీ చేసిన సొమ్ము ఎక్కడ ఉందో కనిపెట్టి, వెనక్కి తెప్పించి తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..