Income Tax: ఐటీ నోటీసులకు స్పందించలేదా.. తనిఖీలు తప్పవు

ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం స్క్రూటినీ (పునః పరిశీలన) కోసం కేసులను ఎలా ఎంపిక చేయాలనే విషయమై మార్గదర్శకాలు విడుదల చేసింది.

Updated : 29 May 2023 09:13 IST

దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం స్క్రూటినీ (పునః పరిశీలన) కోసం కేసులను ఎలా ఎంపిక చేయాలనే విషయమై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రకారం.. ఐటీ నోటీసులకు ప్రతిస్పందించని మదింపుదార్ల (అసెసీ) కేసులను తప్పనిసరిగా తనిఖీ చేయనుంది. పన్ను ఎగవేతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని, ఏదైనా చట్టబద్ద ఏజెన్సీ, నియంత్రణ అధికారులు అందించినా కూడా ఐటీ విభాగం సదరు కేసులను పరిశీలిస్తుంది.  ఆదాయ వ్యత్యాసాలకు సంబంధించి పన్ను అధికారులు జూన్‌ 30లోగా ఐటీ చట్టంలోని సెక్షన్‌ 143(2) కింద నోటీసు పంపాల్సి ఉంటుంది. వాటికి సమాధానాన్ని అసెసీ ఇవ్వాలి. ఇవ్వకపోతే, ఐటీ చట్టంలోని 142(1) ప్రకారం.. తదుపరి చర్యను తీసుకునే నేషనల్‌ ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ సెంటరు (ఎన్‌ఏఎఫ్‌ఏసీ)కు పంపుతారు. ఈ సెక్షన్‌ కింద రిటర్న్‌ గురించి మరింత స్పష్టమైన సమాచారాన్ని, వివరాలను కోరుతూ నోటీసు జారీ చేసే అధికారం పన్ను అధికారులకు ఉంటుంది. రిటర్న్‌ దాఖలు చేయకపోతే, అవసరమైన సమాచారాన్ని సూచించిన పద్ధతిలో అందించాలనీ కోరవచ్చు. రద్దు చేసిన, ఉపసంహరించిన ఐటీ మినహాయింపులను క్లెయిమ్‌ చేయడం కొనసాగించిన కేసుల ఏకీకృత జాబితాను పన్ను విభాగం సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని