హైదరాబాద్లో కో-వర్కింగ్ కేంద్రాలు
కో-వర్కింగ్ సేవల సంస్థ ఆఫీస్, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలను విస్తరించనుంది. దీని కోసం నూజివీడు సీడ్స్ (ఎన్ఎస్ఎల్) తో ఒప్పందం కుదుర్చుకుంది.
నూజివీడు సీడ్స్తో ‘ఆఫీస్’ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: కో-వర్కింగ్ సేవల సంస్థ ఆఫీస్, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలను విస్తరించనుంది. దీని కోసం నూజివీడు సీడ్స్ (ఎన్ఎస్ఎల్) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ప్రస్తుతం బెంగళూరులో 23 కేంద్రాలు, హైదరాబాద్లో 14 కేంద్రాలు నిర్వహిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఈ 2 నగరాల్లో మరికొన్ని కేంద్రాలను ప్రారంభించనుంది. బంజారాహిల్స్లోని 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ‘ఎన్ఎస్ఎల్ ఐకాన్’ భవనంలో ఒక కో-వర్కింగ్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించింది. ఎన్ఎస్ఎల్తో కలిసి బెంగళూరులో ఒక భవనాన్ని నిర్మిస్తున్నామంది.
మ్యాగ్నైట్ ఎస్యూవీలు లక్ష విక్రయించాం: నిస్సాన్
చెన్నై: జపాన్కు చెందిన నిస్సాన్ అనుబంధ నిస్సాన్ మోటార్ ఇండియా తమ స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) ‘మ్యాగ్నైట్’ మోడల్లో 1,00,000వ కారును మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. ఫ్రాన్స్ సంస్థ రెనోతో కలిసి నిస్సాన్ సంయుక్తంగా నెలకొల్పిన రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియాకు తమిళనాడులో ఉన్న ప్లాంటులో ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎరుపు రంగులోని ఈ కారును కంపెనీ అధికారులు ఆవిష్కరించారు. భారత్లో అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు కట్టుబడి ఉన్నామనడానికి మ్యాగ్నైట్ లక్ష కార్ల తయారీ ఘనతే ఓ నిదర్శనమని నిస్సాన్ మోటార్ ఇండియా తెలిపింది.
ఎల్ఐసీ ఎండీ పదవులకు ఇద్దరి ఎంపిక
దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) తాజాగా ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) పదవులకు సత్ పాల్ భానూ, ఆర్ దొరై స్వామి పేర్లను సూచించింది. ‘2023 ఏప్రిల్ 29 నుంచి ఖాళీగా ఉన్న ఎండీ పదవికి సత్ పాల్ భానూను; 2023 సెప్టెంబరు 1న ఖాళీ అయ్యే ఎండీ స్థానానికి ఆర్ దొరై స్వామిని బ్యూరో సిఫారసు చేస్తున్నట్లు’ పేర్కొంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఎండీ పదవికి ఎమ్ రాజేశ్వరి సింగ్ పేరును; జీఐసీ రీ సీఎండీ హోదాకు రామస్వామి నారాయణన్ను సిఫారసు చేసింది.
ఫండ్ వ్యాపారంలోకి బజాజ్ ఫిన్సర్వ్
ముంబయి: వివిధ ఆర్థిక సేవలనందిస్తున్న బజాజ్ఫిన్సర్వ్ తాజాగా మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వచ్చే కొన్నేళ్లలో భారీ స్థాయిలో ఈ విభాగాన్ని నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఫిక్స్డ్ ఇన్కమ్, లిక్విడ్, మనీ మార్కెట్ ఉత్పత్తుల్లో 3 పథకాలను ఈ నెలాఖరుకు ఆవిష్కరించనుంది. నియంత్రణ అనుమతులపై ఆధారపడి త్వరలో మరో 4 పథకాలనూ తీసుకురానున్నట్లు గ్రూప్ ఛైర్మన్, ఎండీ సంజీవ్బజాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ గ్రూప్ 8 అనుబంధ కంపెనీల ద్వారా 7 కోట్ల మంది వినియోగదార్లకు సేవలందిస్తోందని బజాజ్ పేర్కొన్నారు. గ్రూప్ తొమ్మిదో సంస్థ అయిన బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్, ప్రస్తుతం ఈ వ్యాపారం చేస్తున్న 40 మ్యూచువల్ ఫండ్ కంపెనీలతో పోటీ పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!