ఇప్పటికీ పెద్ద షేర్లే చౌక
బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు జీవనకాల రికార్డు స్థాయికి చేరాయి. రోజురోజుకీ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.
స్మాల్ క్యాప్ షేర్లు ‘ఖరీద’య్యాయి
స్టాక్మార్కెట్ ఇంకా ప్రమాదకర స్థాయికి చేరలేదు
యూటీఐ మ్యూచువల్ ఫండ్ సీఐఓ వెట్రి సుబ్రమణియం
ఈనాడు, హైదరాబాద్: బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు జీవనకాల రికార్డు స్థాయికి చేరాయి. రోజురోజుకీ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడంపై కొంతమంది మదుపర్లు తేల్చుకోలేకపోతున్నారు. కానీ ఈక్విటీల విలువలు ఇంకా ప్రమాదకర స్థాయికి చేరనందున, కొత్త పెట్టుబడుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని యూటీఐ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) వెట్రి సుబ్రమణియం అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ స్టాక్మార్కెట్ సూచీలు రెండేళ్ల నాటి పరిస్థితితో పోల్చితే ఇంకా తక్కువగానే ఉన్నట్లు చెప్పుకోవచ్చన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం..
* రెండేళ్లతో పోల్చితే సూచీలు 5-6 శాతమే పెరిగాయి. అదే సమయంలో కంపెనీల ఆదాయాల్లో 40% వృద్ధి నమోదైంది. అందువల్ల సూచీలు ప్రమాదకర స్థాయికి చేరినట్లు కాదు.
*పెద్ద కంపెనీల (లార్జ్ క్యాప్) షేర్ల ధరలు ఇంకా చౌకగానే ఉన్నాయి. ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలున్నాయి. కానీ.. చిన్న కంపెనీల (స్మాల్ క్యాప్) షేర్ల ధరలు తక్కువ సమయంలోనే బాగా పెరిగాయి. అందువల్ల చిన్న కంపెనీల షేర్లపై పెట్టుబడి ఇప్పుడు ఆకర్షణీయం కాదు.
* వాహన రంగంలో సమీప భవిష్యత్తులో మెరుగైన వృద్ధి నమోదు కావచ్చు. స్వల్పకాలంలో ఈ రంగ షేర్లపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని అందించొచ్చు.
* ‘కాంట్రా ఇన్వెస్ట్మెంట్’ కింద ఔషధ కంపెనీలపై పెట్టుబడి పెట్టొచ్చు.
* ఐటీ రంగంలో వృద్ధి అవకాశాలున్నందున, ఈ కంపెనీల షేర్లపై దశల వారీగా పెట్టుబడి పెడితే మంచి ప్రతిఫలాన్ని పొందొచ్చు.
యూటీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్
యూటీఐ మ్యూచువల్ ఫండ్, కొత్తగా ‘యూటీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్’ పథకాన్ని ఈ నెల 21న ప్రారంభిస్తోంది. దీనికి సచిన్ త్రివేది, అనురాగ్ మిట్టల్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. కంపెనీల వాస్తవిక విలువ కంటే, సెంటిమెంట్ ఆధారంగానే మదుపరులు ఈక్విటీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారని, దానివల్ల కొన్ని సందర్భాల్లో నష్టం జరుగుతుందని వెట్రి సుబ్రమణియం అన్నారు. దీన్ని అధిగమించడానికి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు దోహదపడతాయని వివరించారు. వాస్తవిక విలువను పరిగణనలోకి తీసుకుని, పెట్టుబడులను ఎప్పటికప్పుడు క్రియాశీలకంగా ఈక్విటీ, రుణ విభాగాల మధ్య మార్చుకుంటూ, సమన్వయ పరుచుకోవడమే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ల ప్రత్యేకతగా వివరించారు. దీనివల్ల మదుపరులకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నారు. మార్కెట్ విలువ పెరిగినప్పుడు ఈక్విటీకి పెట్టుబడులు తగ్గించి, రుణ విభాగంలో పెట్టుబడులు పెంచడం; మార్కెట్ విలువలు తగ్గినప్పుడు ఈక్విటీకి పెట్టుబడులు పెంచి, రుణ పెట్టుబడులు తగ్గించడం ద్వారా అధిక లాభాలు నమోదు చేసే అవకాశం ఈ పథకాల్లో ఉంటుందని తెలిపారు.
ఏయూఎం ఇంకా పెరుగుతుంది
దేశంలో మ్యూచువల్ ఫండ్ల అజమాయిషీలో ఉన్న నిధుల మొత్తం (ఏయూఎం) గత అయిదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల నుంచి, రూ.44.39 లక్షల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం ఇంకా పెరుగుతుందని సుబ్రమణియం అభిప్రాయపడ్డారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుండటం ఇండుకు కారణమన్నారు. దేశంలోని మ్యూచువల్ ఫండ్లలో 8వ స్థానంలో ఉన్న యూటీఐ మ్యూచువల్ ఫండ్కు హైబ్రిడ్ పథకాల నిర్వహణలో ఎంతో అనుభవం ఉందని వివరించారు. వివిధ పథకాల న్యూ ఫండ్ ఆఫర్ లలో రూ.2,500 - 5,000 కోట్ల వరకు సమీకరించిన అనుభవం తమకు ఉందని, అంతే స్థాయిలో కొత్త పథకం కింద నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
SBI Rewardz Fraud: తమ బ్యాంకు పేరిట వాట్సప్, ఎసెమ్మెస్ సందేశాల్లో వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. -
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ సదుపాయం గురించి తెలుసా? -
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన