పన్ను చెల్లింపుదార్ల సగటు ఆదాయం రూ.13 లక్షలు
దేశంలో ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే వారి వార్షిక సగటు ఆదాయం రూ.13 లక్షలకు చేరినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
2014-23 మధ్య 195% వృద్ధి
ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక
ఈనాడు, దిల్లీ: దేశంలో ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే వారి వార్షిక సగటు ఆదాయం రూ.13 లక్షలకు చేరినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 2014 మదింపు సంవత్సరంలో ఒక్కో రిటర్నుదారు సగటు వార్షికాదాయం రూ.4.4 లక్షలుగా, 2023 నాటికి అది రూ.13 లక్షలకు చేరినట్లు వెల్లడించింది. 2025 నాటికి రూ.17.2 లక్షలకు, 2047 నాటికి రూ.49.7 లక్షలకు చేరనున్నట్లు అంచనా వేసింది. అల్పాదాయవర్గాలు ఎగువ ఆదాయ వర్గానికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రతి స్థాయిలోని వారికి ఆదాయాలు పెరుగుతున్నాయని, ప్రతి శ్లాబ్లో రిటర్న్లు దాఖలు చేసేవారి సంఖ్య 3 రెట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
- 2023లో మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ నుంచి అత్యధిక స్థాయిలో రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. మొత్తం రిటర్నుల్లో ఈ 5 రాష్ట్రాల వాటానే 48% ఉన్నట్లు తెలిపింది. 2022తో పోలిస్తే 2023లో 64 లక్షల రిటర్నులు అధికంగా వచ్చాయని, వీటిల్లోనూ ఆ 5 రాష్ట్రాల నుంచే ఎక్కువ పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. 2047కు 48 కోట్లకు పైగా రిటర్నులు: ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్లు కాగా.. 2047కు 48.2 కోట్లకు చేరనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. 2047 నాటికి 25% మంది ఐటీ రిటర్నుదారులు, అల్పాదాయ విభాగం నుంచి బయటపడతారని తెలిపింది. దీనివల్ల తలసరి ఆదాయం 2023-47 మధ్య కాలంలో రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు చేరనున్నట్లు పేర్కొంది. ప్రజల ఆదాయం పెరగడం వల్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్యా పెరగనున్నట్లు అంచనా వేసింది.
ఆదాయాల పరంగా
- జీరో ట్యాక్స్ లయబిలిటీ ఉన్న రిటర్నుల సంఖ్య 2022లో 65.1% ఉండగా 2023లో అది 64%కి తగ్గినట్లు వివరించింది.
- 2012 మదింపు ఏడాదితో పోలిస్తే 2023 నాటికి 13.6% మంది అల్పాదాయ విభాగం నుంచి పైకి ఎదిగినట్లు వెల్లడించింది.
- రూ.5-10 లక్షల ఆదాయం ఉన్నవారి సంఖ్య 8.1%, రూ.10-20 లక్షల ఆదాయం ఉన్న వారి సంఖ్య 3.8%, రూ.20-50 లక్షల ఆదాయం ఉన్నవారి సంఖ్య 1.5%, రూ.50 లక్షలు-కోటి మధ్య ఆదాయ వర్గం 0.2%, రూ.కోటికిపైగా ఆదాయం ఉన్నవారి నిష్పత్తి 0.02% పెరిగినట్లు వివరించింది.
వలసల కారణంగా 0.4% జీడీపీ కోల్పోనున్న ఏపీ
వలసల కారణంగా 6 రాష్ట్రాల జీఎస్డీపీ పెరిగితే, మరో 6 రాష్ట్రాల జీఎస్డీపీ తగ్గనున్నట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది. వ్యక్తులు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న చోటు, పాన్, ఆధార్కార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా ఈ వలసలను లెక్కించినట్లు పేర్కొంది. వీటి ప్రకారం కేరళ (2.5%), దిల్లీ (2.5%), తమిళనాడు (1.3%), గుజరాత్ (0.5%), కర్ణాటక (0.5%), మహారాష్ట్ర (0.4%) జీఎస్డీపీ 7.8% పెరిగితే.. ఉత్తర్ప్రదేశ్ (-2.5%), బిహార్ (-2.2%), రాజస్థాన్ (-1.0%), మధ్యప్రదేశ్ (-0.9%), ఒడిశా(-0.6%), ఆంధ్రప్రదేశ్ (-0.4%), పశ్చిమబెంగాల్(-0.2%)ల జీఎస్డీపీ 7.8% తగ్గనున్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
సూపర్ టాపప్ తీసుకోవచ్చా?
నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్ టాపప్ను ఎంచుకోవాలా? -
కార్డు బాకీ తీర్చలేకపోతే
చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. -
కారు రుణం ముందే తీర్చేస్తే
అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా..
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ