ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ.
ఏప్రిల్లో రూ.18,917 కోట్లే
సిప్ల మదుపు రూ.20,000 కోట్ల మైలురాయికి
దిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. లార్జ్ క్యాప్ ఫండ్ల్లోకి పెట్టుబడులు గణనీయంగా తగ్గడం, సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్కెట్లలో ఒడుదొడుకులు పెరగడంతో, మదుపర్లు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పాటించడం ఇందుకు నేపథ్యం. అయితే ఈక్విటీ ఫండ్ల్లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగడం ఇది వరుసగా 38వ నెల కావడం గమనార్హం.
- నెలవారీ క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్) ద్వారా మదుపు రూ.20,000 కోట్ల మైలురాయిని అందుకుంది. ఏప్రిల్లో రూ.20,371 కోట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. మార్చిలో సిప్ల ద్వారా మదుపు రూ.19,271 కోట్లుగా ఉంది. సిప్ ఖాతాల సంఖ్య కూడా 63.65 లక్షల మేర పెరిగి 8.7 కోట్లకు చేరింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) గణాంకాల ప్రకారం..
- ఏప్రిల్లో మొత్తంగా మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.1.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్ పథకాల్లోకి గణనీయ స్థాయిలో రూ.1.9 లక్షల కోట్లు రావడం వల్లే, ఏప్రిల్లో ఎంఎఫ్లలోకి అధిక పెట్టుబడులు నమోదయ్యాయి.
- డెట్, ఈక్విటీ ఫండ్ పథకాల్లోకి నికర పెట్టుబడుల రాక కొనసాగడంతో ఏప్రిల్ చివరికి ఫండ్ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.57.26 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి ఈ విలువ రూ.53.54 లక్షల కోట్లుగా ఉంది.
- స్మాల్ క్యాప్ ఫండ్ విభాగం పుంజుకుంది. మార్చిలో ఈ తరహా పథకాల్లో నుంచి రూ.94 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఏప్రిల్లో నికరంగా రూ.2,208 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- లార్జ్ క్యాప్ ఫండ్ల్లోకి రూ.357 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో వచ్చిన రూ.2,218 కోట్లతో పోలిస్తే ఏప్రిల్లో పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గింది.
- హైబ్రిడ్ ఫండ్ పథకాల్లోకి పెట్టుబడులు మార్చిలో రూ.5,584 కోట్లు కాగా, ఏప్రిల్లో రూ.19,863 కోట్లకు చేరాయి.
- మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య ఏప్రిల్లో జీవనకాల గరిష్ఠమైన 18.14 కోట్లుగా నమోదైంది.
రుణ భారం వల్లే పొదుపు తగ్గింది!
దిల్లీ: కుటుంబాల పొదుపు గత ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గి ఉండొచ్చని అంచనా. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీద పెరగడంతో, నెలవారీ కిస్తీలు అధికంగా చెల్లించాల్సి రావడం వల్ల కుటుంబాల పొదుపుపై ప్రభావం పడి ఉండొచ్చని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వ్యక్తిగత రుణాల మంజూరుపై ఇటీవల ఆంక్షలు విధించిన నేపథ్యంలో, 2024-25లో ఈ ధోరణిలో మార్పు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నికర కుటుంబాల పొదుపు వరుసగా మూడేళ్ల నుంచి తగ్గుతోందని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబాల నికర పొదుపు 2020-21తో పోలిస్తే, 2022-23కు రూ.9 లక్షల కోట్ల మేర తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. 2023-24 గణాంకాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. హామీ రహిత (అన్సెక్యూర్డ్) వ్యక్తిగత రుణాల జారీపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో, 2024-25లో కుటుంబాల పొదుపు పెరగొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థిక వేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. పొదుపునకు సంబంధించి పోర్ట్ఫోలియో మార్పులతో కుటుంబాల పొదుపు తగ్గినట్లు కనిపించినా, పొదుపు మొత్తాలు స్థిరాస్తుల్లోకి వెళ్లాయని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు.
- 2020-21లో కుటుంబాల పొదుపు రూ.23.29 లక్షల కోట్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. 2021-22లో రూ.17.12 లక్షల కోట్లకు, 2022-23లో రూ.14.16 లక్షల కోట్లకు తగ్గింది.
- 2022-23లో ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), కుటుంబాలకు అందించిన రుణాలు నాలుగింతలు పెరిగి రూ.3.33 లక్షల కోట్లకు చేరాయి. 2020-21లో ఇవి రూ.93,723 కోట్లుగా నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
Hero MotoCorp: హీరో-హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోడళ్లు రానున్నాయి. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. -
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
HDFC Bank Pixel Play: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా పిక్సెల్ ప్లే పేరిట కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. దీంట్లో మీకు నచ్చిన కేటగిరీని ఎంపిక చేసుకుని రివార్డు ప్రయోజనాలు అందుకోవచ్చు. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
SBI Rewardz Fraud: తమ బ్యాంకు పేరిట వాట్సప్, ఎసెమ్మెస్ సందేశాల్లో వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. -
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ సదుపాయం గురించి తెలుసా? -
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్