ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది.
ముంబయి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. స్టాండలోన్ ఖాతాల ప్రకారమూ.. 2022-23 మార్చి త్రైమాసికం నాటి రూ.16,694.51 కోట్ల నుంచి రూ.20,698.35 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 3.13% పెరిగి రూ.41,655 కోట్లకు చేరుకుంది. వడ్డీయేతర ఆదాయం 24.41% పెరిగి రూ.17,369 కోట్లకు చేరడం కలిసి వచ్చింది.
పూర్తి ఆర్థికానికి: 2022-23తో పోలిస్తే 2023-24లో ఎస్బీఐ ఏకీకృత నికర లాభం రూ.55,648.17 కోట్ల నుంచి రూ.67,084.67 కోట్లకు పెరిగింది. త్రైమాసిక, వార్షిక లాభాలు జీవనకాల గరిష్ఠాలకు చేరాయని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15-16 శాతంగా ఉండొచ్చని ఖరా అంచనా వేశారు. దేశీయ నికర వడ్డీ మార్జిన్ 3.46% వద్దే కొనసాగొచ్చని అన్నారు. 2023-24లో డిపాజిట్లు 11.13% వృద్ధి చెందగా.. 2024-25 ఏడాదికి 13% లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఆర్బీఐ నిబంధనల ప్రభావం ఉండదు.. ఖరా: నిర్మాణంలో ఉన్న మౌలిక ప్రాజెక్టుల రుణాలపై ఆర్బీఐ ముసాయిదా నిబంధనలు అమల్లోకి వచ్చినా, ఎస్బీఐపై ప్రభావం చూపవని ఖరా అన్నారు. ఆ రుణాలను రీప్రైసింగ్ చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. 2023-24లో ప్రాజెక్టు రుణాల నుంచి ఎటువంటి ఒత్తిడీ ఎదురు కాలేదన్నారు. రూ.4 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల్లో నాలుగింట మూడొంతులు ప్రైవేటు రంగానికి ఇవ్వగా, మిగతావి ప్రభుత్వ రంగానికి చేరినట్లు తెలిపారు. నిరర్థక ఆస్తులకు కేటాయింపులు రూ.8,049 కోట్ల నుంచి రూ.7,927 కోట్లకు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఒత్తిడికి గురవుతున్న రుణాలు రూ.3,185 కోట్ల నుంచి రూ.3,867 కోట్లకు పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తి 2.78% నుంచి 2.24 శాతానికి తగ్గింది. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 2.42 శాతంగా ఉన్నాయి.
తగ్గిన ఉద్యోగుల సంఖ్య: గత నాలుగేళ్లలో ఉద్యోగుల సంఖ్య 27,000 వరకు తగ్గడాన్ని ప్రస్తావిస్తూ, యాంత్రీకరణ (ఆటోమేషన్) వల్లేనని ఖరా అన్నారు. సాంకేతికత, కృత్రిమ మేధ టూల్స్పై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. 12,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేట్లలో 85% మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే కావడంతో.. టెక్ కార్యకలాపాల్లోనూ నియమిస్తున్నట్లు వివరించారు. 2023-24లో 139 శాఖలు జతకావడంతో మొత్తం బ్యాంకు శాఖలు 22,542కు చేరాయి. ఈ ఏడాదిలో మరో 300 జత చేయనున్నారు.
గురువారం సూచీలు భారీగా నష్టపోయినా, ఎస్బీఐ షేరు మాత్రం బీఎస్ఈలో గురువారం 1.14% లాభంతో రూ.819.65 వద్ద ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం