ఆర్థిక స్థిరత్వం.. ఇలా సాధ్యం..
పొదుపు, పెట్టుబడుల గురించి ఒకప్పుడు కుటుంబంలోని పెద్దలే చర్చించుకునే వారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చిన ఆదాయం, అయ్యే ఖర్చుల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంటోంది. దీనివల్ల బడ్జెట్ తలకిందులు కాకుండా.
పొదుపు, పెట్టుబడుల గురించి ఒకప్పుడు కుటుంబంలోని పెద్దలే చర్చించుకునే వారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చిన ఆదాయం, అయ్యే ఖర్చుల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంటోంది. దీనివల్ల బడ్జెట్ తలకిందులు కాకుండా.. సంపదను పెంచుకునేందుకు వీలవుతోంది. ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా.. ఎలాంటి వ్యూహాలు పాటించాలో తెలుసుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది.
ఒక లక్ష్యం నిర్ణయించుకొని, దానికి అనుగుణంగా పెట్టుబడులు ప్రారంభించడమే ఆర్థిక స్థిరత్వ సాధనలో తొలి అడుగు. మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని, అందుకు అయ్యే మొత్తం, వ్యవధిని ముందు గుర్తించండి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల జాబితాను తయారు చేయండి. అనుకోవడం తేలికే. కానీ, దాన్ని సాధించేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు ఉండాలి. ఇలాంటి వారు మదుపు చేసేందుకు డెట్ ఫండ్లను పరిశీలించాలి. మార్కెట్ ఇచ్చే అవకాశాలను అందుకుంటాం.. కాస్త నష్టభయం ఉన్నా ఇబ్బంది లేదు అనుకుంటే.. హైబ్రీడ్ ఫండ్లు లేదా పాసివ్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలుండి, కాస్త నష్టం వచ్చినా భరించే శక్తి ఉన్నవారు ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవాలి. వివిధ ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడుల ప్రణాళిక వ్యూహాత్మకంగా ఉండాలి. లేకపోతే అనుకున్న లక్ష్యం చేరేందుకు ఆలస్యం అవుతుంది.
కష్టంలో ఆదుకునేలా..
పెట్టుబడులను ఎప్పుడూ మధ్యలోనే వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అవసరం వచ్చినప్పుడల్లా.. భవిష్యత్ లక్ష్యాల కోసం దాచుకున్న మొత్తాన్ని తీస్తుంటే.. ఎప్పటికీ ఆర్థిక స్థిరత్వం సాధించలేం. కాబట్టి, ప్రతి కుటుంబానికీ కొంత అత్యవసర నిధి అందుబాటులో ఉండాలి. కుటుంబం ఖర్చులు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. పొదుపు మొత్తాన్ని ముట్టుకోకుండా మన అవసరాలు తీరేందుకు ఇది ఉపయోగపడుతుంది. కనీసం 3-6 నెలలకు సరిపోయే మొత్తం లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. సులువుగా డబ్బును వెనక్కి తీసుకునేలా ఉండటమే ఇక్కడ ప్రధానం.
వైవిధ్యంగా..
మార్కెట్ పనితీరు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. పెట్టుబడి పెట్టేవారు ఈ విషయాన్ని గమనించాలి. మార్కెట్ గమనం ఎలా ఉన్నా పెట్టుబడులు సాధ్యమైనంత వరకూ లాభాలను పంచేలా ఉండాలి. అందుకు అనుగుణంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీ, డెట్, బంగారం, స్థిరాస్తులు, డిపాజిట్లు ఇలా మదుపరులు వివిధ పథకాలను ఎంచుకోవాలి. ఒక పథకం పనితీరు బాగాలేకపోయినా మిగతావి పోర్ట్ఫోలియోలో నష్టాన్ని పరిమితం చేస్తాయి.
నష్టాన్ని భరించగలరా..
పెట్టుబడి పథకాలను ఎంచుకునే ముందు.. మీ కుటుంబం ఎంత మేరకు నష్టాన్ని తట్టుకోగలదు అనేది అంచనా వేసుకోండి. ఆర్జించే వ్యక్తుల్లో వయసులో పెద్దవారు కాస్త తక్కువ నష్టభయాన్ని భరించగలరు. చిన్నవారు అధిక నష్టం వచ్చినా తట్టుకోగలరు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు సురక్షిత పథకాలను ఎంచుకోవడం మంచిది. ఇదీ వ్యక్తుల అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. చిన్న వయసులో ఉన్నవారు.. ఈక్విటీల్లో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించగలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల నష్టాలు వచ్చే ఆస్కారం తగ్గుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యంతోపాటు, సమతౌల్యం పాటిస్తూ ఉన్నప్పుడే.. నష్టాలను పరిమితం చేసుకుంటూ.. మార్కెట్ లాభాలను కళ్లచూడగలరు.
సమీక్షించుకుంటూ..
పెట్టుబడులు ఎప్పుడూ దీర్ఘకాలం కొనసాగాలి. అంటే, మదుపు చేసి, మర్చిపోవడం కాదు. సమయానుకూలంగా వాటిని సమీక్షించుకుంటూ ఉండాలి. మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా మన పెట్టుబడులు ఉన్నాయా చూసుకోవాలి. కొత్త లక్ష్యాలకు అనుగుణంగా పథకాల ఎంపిక మారాలి. లేకపోతే ఆర్థికంగా వెనుకబడిపోతాం.
కుటుంబం ఆర్థికంగా స్థిరంగా మారాలంటే.. ఒక్కరితోనే సాధ్యం కాదు. సభ్యులందరూ తమ వంతుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. వేసుకున్న బడ్జెట్కు కట్టుబడి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబ ఆర్థిక ప్రయాణం సాఫీగా సాగుతుంది.
- రాఘవ్ అయ్యంగార్, సీబీఓ, యాక్సిస్ ఏఎంసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!