Boeing 737 Max: అమెరికా నిర్ణయం.. భారత వైమానిక రంగానికి బ్యాడ్ న్యూస్
బోయింగ్పై అమెరికాలో ఎఫ్ఏఏ విధించిన ఆంక్షలు భారత్పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దీంతో మూడు ప్రధాన విమానయాన సంస్థలకు డెలివరీలు జాప్యం కావచ్చు.
ఇంటర్నెట్డెస్క్: బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీని పరిమితం చేయాలంటూ అమెరికా వైమానిక రంగ నియంత్రణ సంస్థ తీసుకొన్న నిర్ణయం భారత్పై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్జెట్, ఆకాశ్ ఎయిర్ సంస్థలు వందల సంఖ్యలో ఈ విమానాల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయి.
ఇటీవల అలస్కా ఎయిర్లైన్స్ విమానం గాల్లో ఉండగానే డోర్ప్లగ్ ఊడిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. నాణ్యతాపరంగా ఇప్పటికే మ్యాక్స్ విమానాల్లో పలు లోపాలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 737 మ్యాక్స్ విమానాల తయారీని విస్తరించొద్దని తాజాగా అమెరికా ఎఫ్ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) ఆదేశించింది. ‘‘ఈ విమానాల తయారీ విస్తరణకు సంబంధించి బోయింగ్ నుంచి వచ్చే ఏ ప్రతిపాదనలను మేం అంగీకరించం. తనిఖీల్లో విమానాల నాణ్యత సంతృప్తికరంగా ఉందని మేం భావించేవరకు ఇలానే కొనసాగుతుంది’’ అని ఎఫ్ఏఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ నిర్ణయం భారత్లోని మూడు ప్రధాన విమానయాన సంస్థల ఆర్డర్లపై ప్రభావం చూపనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ 181 విమానాలను గతేడాది ఆర్డర్ చేసింది. ఇక ఆకాశ్ఎయిర్ 204, స్పైస్ 142 ఎయిర్క్రాఫ్ట్ల కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయి. వీటి డెలివరీలపై ఎఫ్ఏఏ నిర్ణయం ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్కు చెందిన డీజీసీఏ ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న 737 శ్రేణి విమానాల్లో తనిఖీలను పూర్తి చేసింది. దేశంలో వాడుతున్న మొత్తం 40 విమానాలకు గాను ఒక దానిలో చిన్న వాషర్ లేనట్లు గుర్తించారు.
కొత్తగా అప్పు తీసుకుంటున్నారా?
ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కార్పొరేట్ విషాదంగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు