PSB: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది.
ఎన్నికల తర్వాత కొన్ని బ్యాంకుల విలీనం
ఆర్థిక శాఖ వర్గాల వెల్లడి
దిల్లీ: ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ప్రైవేటీకరణకు బదులుగా, మరికొన్ని పీఎస్బీల విలీనం ద్వారానే బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులను విలీనం చేసి, పెద్ద బ్యాంకులుగా మార్చడాన్ని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. 2021-22 సాధారణ బడ్జెట్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినా, అమలు కాలేదు. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటా విక్రయించడంలోనూ విఫలమయ్యారు. పీఎస్బీలను కొనుగోలు చేసేందుకు, ఆసక్తి-తగిన పెట్టుబడులున్న వారు లభించడంపైనా ధీమా లేనందునే, ప్రైవేటీకరణ ప్రణాళికపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటా విక్రయిస్తే గనుక, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సులభతరం అవుతుందని భావించారు. అయితే కొవిడ్ పరిణామాలు, పీఎస్బీలపై పెట్టుబడిదార్లలో ఆసక్తి తగ్గడం ప్రతికూల ప్రభావం చూపాయి.
గత రెండేళ్లలో లాభాల పంట
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మంచి లాభాలను నమోదుచేశాయి. ఒక సమయంలో మొండి బకాయిలతో కుదేలైన ఈ బ్యాంకులు, ప్రస్తుతం గణనీయంగా పుంజుకున్నాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.3 లక్షల కోట్ల మూలధన సాయాన్ని ప్రభుత్వం అందించింది. కొన్ని త్రైమాసికాలుగా ఇవి ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేయడంతో పాటు ప్రభుత్వానికి భారీగా డివిడెండ్ చెల్లిస్తున్నాయి. 2023-24లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.1.4 లక్షల కోట్లుగా నమోదైంది. 2022-23లో బ్యాంకులు ఆర్జించిన రూ.1 లక్ష కోట్లతో పోలిస్తే ఇది 35% అధికం.
ప్రజా వాటా నిబంధన అందుకునేందుకూ
ప్రభుత్వ రంగంలోని పెద్ద బ్యాంకులతో కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తే, సెబీ ప్రజా వాటా నిబంధనలను అందుకునేందుకూ దోహదపడనుంది. అన్ని నమోదిత సంస్థల్లో కనీసం 25% ప్రజా వాటా ఉండాలన్నది సెబీ నిబంధన. ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా, ప్రజా వాటా నిబంధనలను 5 బ్యాంకులు అందుకోవడం లేదు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13.54%, సెంట్రల్ బ్యాంక్లో 6.92%, యూకో బ్యాంక్ 4.61%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 3.62%, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 1.75% చొప్పునే ప్రజలకు వాటాలు ఉండటం గమనార్హం.
ప్రైవేటీకరణ లేదా విలీనంపై స్పందించలేం
ఆర్థిక సేవల కార్యదర్శి ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం లేదా ప్రైవేటీకరణపై స్పందించలేమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. ఇటువంటి అంశాలపై ఇప్పుడు మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పటి వరకు రెండు దఫాల్లో బ్యాంకుల విలీనాలను ప్రభుత్వం చేపట్టింది. 2019 ఏప్రిల్ 1న విజయా బ్యాంక్, దేనా బ్యాంక్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. 2020 ఏప్రిల్ 1న మరో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి 4 పెద్ద బ్యాంకులుగా ఏర్పడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు