LIC Dhan Vriddhi: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెలాఖరు వరకే
LIC Dhan Vriddhi plan end on Sep 30: పొదుపు, బీమా కాంబినేషన్లో ఎల్ఐసీ తీసుకొచ్చిన ధన వృద్ధి ప్లాన్ సెప్టెంబర్ 30తో ముగియనుంది.
DHAN VRIDDHI PLAN | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) తీసుకొచ్చిన సింగిల్ ప్రీమియం బీమా ప్లాన్ ధన వృద్ధి (LIC Dhan Vriddhi) గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఏడాది జూన్లో తీసుకొచ్చిన ఈ పరిమితకాలపు ప్లాన్ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తోందని ఎల్ఐసీ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. పొదుపు+ బీమా కాంబినేషన్లో వస్తున్న ఈ పాలసీ కావాలనుకునేవారు ఏజెంట్లను లేదా బ్రాంచ్ను సంప్రదించాలని, ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చని ఎల్ఐసీ సూచించింది.
ఏమిటీ ప్లాన్?
ఎల్ఐసీ తీసుకొచ్చిన ధన వృద్ధి (Plan no 869) అనేది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్తో కూడిన సింగిల్ ప్రీమియంతో వస్తున్న లైఫ్ ప్లాన్. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది. ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీ మొత్తం లభిస్తుంది.
₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!
రెండు ఆప్షన్లు..
ధన వృద్ధి ప్లాన్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. మొదటి ఆప్షన్లో పాలసీదారు మరణిస్తే 1.25 రెట్లు చెల్లిస్తారు. రెండో ఆప్షన్లో ఈ మొత్తం 10 రెట్లుగా ఉంటుంది. ఈ ప్లాన్ 10, 15, 18 ఏళ్ల కాలవ్యవధితో వస్తోంది. కనీస వయసు టర్మ్ను బట్టి 90 రోజులుగా నిర్ణయించారు. టర్మ్, ఆప్షన్ ఆధారంగా గరిష్ఠ వయసు 32 ఏళ్ల నుంచి 60 ఏళ్లుగా నిర్ధారించారు. ఆప్షన్-1లో గరిష్ఠ వయసు 60 ఏళ్లు కాగా ఆప్షన్-2లో 40 ఏళ్లుగా పేర్కొన్నారు. కనీస హామీ మొత్తాన్ని రూ.1.25 లక్షలుగా ఎల్ఐసీ నిర్ణయించింది. ఆపై రూ.5 వేల చొప్పున సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా ఎంచుకోవచ్చు.
తొలి ఆప్షన్లో ప్రతి వెయ్యి రూపాయలకి ఎంచుకున్న టర్మ్ ఆధారంగా ఏడాదికి రూ.60-75 వరకు గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. ఆప్షన్-2లో అయితే ఈ మొత్తం టర్మ్ బట్టి రూ.25-40 మధ్య ఉంటుంది. మెచ్యూరిటీ/ డెత్ సమయంలో ఐదేళ్ల కాలానికి విడతల వారీగా (నెల, త్రైమాసికం, 6 నెలలు, సంవత్సరం) సెటిల్మెంట్ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్పై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. సెక్షన్ 80సి కింద మినహాయింపులు పొందొచ్చు. సింగిల్ ప్రీమియం కాబట్టి ల్యాప్స్ అనే మాటే తలెత్తదు.
ఎలా కొనాలి?
ఎల్ఐసీ ధనవృద్ధి స్కీమ్ను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ కామన్ సర్వీస్ సెంటర్లలోనూ పాలసీని కొనుగోలు చేయొచ్చు. లేదంటే నేరుగా ఎల్ఐసీ ఇండియా వెబ్సైట్కి వెళ్లి కూడా కొనుగోలు చేయొచ్చు. పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలకు ఎల్ఐసీ సేల్స్ బ్రోచర్ కోసం క్లిక్ చేయండి. ఆన్లైన్ కొనుగోలుకు ఎల్ఐసీ వెబ్సైట్ను సందర్శించండి.
- ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఆప్షన్-1 కింద 15 ఏళ్ల టర్మ్కు గానూ రూ.10 లక్షల హామీ మొత్తాన్ని ఎంచుకుంటే సింగిల్ ప్రీమియం కింద రూ.8.96 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది (జీఎస్టీతో కలిపి). అదే 30 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షలకు హామీ మొత్తం కోసం ఆప్షన్-2 ఎంచుకుంటే జీఎస్టీతో కలిపి రూ.8.05 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ₹10 లక్షల సమ్ అష్యూర్డ్ కోసం ఏ వయసు వారు ఎంతెంత చెల్లించాలో ఈ పట్టికలో చూడొచ్చు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 48 పాయింట్ల లాభంతో 66,018 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 37 పాయింట్లు పెరిగి 19,832 దగ్గర కొనసాగుతోంది. -
జనవరి నుంచి కార్ల ధరల పెంపు..
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వెల్లడించాయి. -
6 నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 6 నెలల గరిష్ఠానికి చేరాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర సోమవారం 2013.99 డాలర్లకు చేరింది. -
రేమండ్ వ్యాపారం సాఫీగా సాగుతుంది
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరోసా ఇచ్చారు. -
రూ.13,000 కోట్లతో భారత్లో ఫాక్స్కాన్ విస్తరణ!
ఐఫోన్ తయారీ సంస్థ హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ భారత్లో మరింత విస్తరించనుంది. ఫాక్స్కాన్గా సుపరిచితమైన ఈ సంస్థ ఇక్కడి నిర్మాణ ప్రాజెక్టులపై 1.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్లో పూర్తి వాటా విక్రయించం
బ్యాంకస్యూరెన్స్ ప్రయోజనాలు పొందేందుకు, ఐడీబీఐ బ్యాంక్లో కొంత వాటా అట్టే పెట్టుకోవాలని.. ఆ బ్యాంక్ ప్రమోటర్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తోంది. -
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుందాం
కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. -
66,500 పాయింట్ల స్థాయి కీలకం!
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. -
అల్యూమినియంలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.61,985 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,351; రూ.62,967 వరకు రాణిస్తుందని భావించొచ్చు. -
దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం
చదువులో ఇబ్బందిపడే దివ్యాంగుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోరా’ను ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
వినియోగదారు సేవా ఏజెంట్ల పని భారం తగ్గించేందుకు ఏఐ చాట్బాట్ను వినియోగించడం ప్రారంభించినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
-
Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
-
Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక
-
Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్చాట్.. అదెలా సాధ్యమంటే..?
-
Australia: ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ను అందించిన ఆ ఒక్క మీటింగ్..!
-
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు