LIC Dhan Vriddhi: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెలాఖరు వరకే
LIC Dhan Vriddhi plan end on Sep 30: పొదుపు, బీమా కాంబినేషన్లో ఎల్ఐసీ తీసుకొచ్చిన ధన వృద్ధి ప్లాన్ సెప్టెంబర్ 30తో ముగియనుంది.
DHAN VRIDDHI PLAN | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) తీసుకొచ్చిన సింగిల్ ప్రీమియం బీమా ప్లాన్ ధన వృద్ధి (LIC Dhan Vriddhi) గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఏడాది జూన్లో తీసుకొచ్చిన ఈ పరిమితకాలపు ప్లాన్ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తోందని ఎల్ఐసీ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. పొదుపు+ బీమా కాంబినేషన్లో వస్తున్న ఈ పాలసీ కావాలనుకునేవారు ఏజెంట్లను లేదా బ్రాంచ్ను సంప్రదించాలని, ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చని ఎల్ఐసీ సూచించింది.
ఏమిటీ ప్లాన్?
ఎల్ఐసీ తీసుకొచ్చిన ధన వృద్ధి (Plan no 869) అనేది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్తో కూడిన సింగిల్ ప్రీమియంతో వస్తున్న లైఫ్ ప్లాన్. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది. ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీ మొత్తం లభిస్తుంది.
₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!
రెండు ఆప్షన్లు..
ధన వృద్ధి ప్లాన్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. మొదటి ఆప్షన్లో పాలసీదారు మరణిస్తే 1.25 రెట్లు చెల్లిస్తారు. రెండో ఆప్షన్లో ఈ మొత్తం 10 రెట్లుగా ఉంటుంది. ఈ ప్లాన్ 10, 15, 18 ఏళ్ల కాలవ్యవధితో వస్తోంది. కనీస వయసు టర్మ్ను బట్టి 90 రోజులుగా నిర్ణయించారు. టర్మ్, ఆప్షన్ ఆధారంగా గరిష్ఠ వయసు 32 ఏళ్ల నుంచి 60 ఏళ్లుగా నిర్ధారించారు. ఆప్షన్-1లో గరిష్ఠ వయసు 60 ఏళ్లు కాగా ఆప్షన్-2లో 40 ఏళ్లుగా పేర్కొన్నారు. కనీస హామీ మొత్తాన్ని రూ.1.25 లక్షలుగా ఎల్ఐసీ నిర్ణయించింది. ఆపై రూ.5 వేల చొప్పున సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా ఎంచుకోవచ్చు.
తొలి ఆప్షన్లో ప్రతి వెయ్యి రూపాయలకి ఎంచుకున్న టర్మ్ ఆధారంగా ఏడాదికి రూ.60-75 వరకు గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. ఆప్షన్-2లో అయితే ఈ మొత్తం టర్మ్ బట్టి రూ.25-40 మధ్య ఉంటుంది. మెచ్యూరిటీ/ డెత్ సమయంలో ఐదేళ్ల కాలానికి విడతల వారీగా (నెల, త్రైమాసికం, 6 నెలలు, సంవత్సరం) సెటిల్మెంట్ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్పై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. సెక్షన్ 80సి కింద మినహాయింపులు పొందొచ్చు. సింగిల్ ప్రీమియం కాబట్టి ల్యాప్స్ అనే మాటే తలెత్తదు.
ఎలా కొనాలి?
ఎల్ఐసీ ధనవృద్ధి స్కీమ్ను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ కామన్ సర్వీస్ సెంటర్లలోనూ పాలసీని కొనుగోలు చేయొచ్చు. లేదంటే నేరుగా ఎల్ఐసీ ఇండియా వెబ్సైట్కి వెళ్లి కూడా కొనుగోలు చేయొచ్చు. పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలకు ఎల్ఐసీ సేల్స్ బ్రోచర్ కోసం క్లిక్ చేయండి. ఆన్లైన్ కొనుగోలుకు ఎల్ఐసీ వెబ్సైట్ను సందర్శించండి.
- ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఆప్షన్-1 కింద 15 ఏళ్ల టర్మ్కు గానూ రూ.10 లక్షల హామీ మొత్తాన్ని ఎంచుకుంటే సింగిల్ ప్రీమియం కింద రూ.8.96 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది (జీఎస్టీతో కలిపి). అదే 30 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షలకు హామీ మొత్తం కోసం ఆప్షన్-2 ఎంచుకుంటే జీఎస్టీతో కలిపి రూ.8.05 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ₹10 లక్షల సమ్ అష్యూర్డ్ కోసం ఏ వయసు వారు ఎంతెంత చెల్లించాలో ఈ పట్టికలో చూడొచ్చు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.