Adani గ్రూప్లో LIC పెట్టుబడుల విలువ రూ.44,670 కోట్లకు
జనవరి- మార్చి త్రైమాసికంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏకీకృత నికర లాభం 5 రెట్లకు పైగా పెరిగి రూ.13,191 కోట్లకు చేరింది.
దిల్లీ: అదానీ గ్రూప్నకు చెందిన ఏడు కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. అమెరికా సంస్థ హిండెన్బర్గ్ నివేదిక అనంతరం కనిష్ఠాలకు చేరిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు మళ్లీ పుంజుకోవడమే ఇందుకు కారణం. అదానీ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ ఏప్రిల్లో దాదాపు రూ.5,500 కోట్ల మేర పుంజుకుంది.
* అదానీ పోర్ట్స్లో ఎల్ఐసీకి అత్యధికంగా 9.12% షేర్లున్నాయి. బీఎస్ఈలో బుధవారం ఈ షేరు రూ.717.95 వద్ద ముగియగా, ఈ ప్రకారం ఎల్ఐసీ విలువ రూ.14,145 కోట్లుగా నమోదైంది. అదానీ ఎంటర్ప్రైజెస్లో ఎల్ఐసీకి ఉన్న 4.25% వాటా విలువ రూ.12,017 కోట్లుగా ఉంది. అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్ కంపెనీల్లో ఎల్ఐసీకి రూ.10,500 కోట్ల విలువైన షేర్లున్నాయి.
* అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ రూ.30,127 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. ఈ ఏడాది జనవరి 27కు వీటి విలువ రూ.56,142 కోట్లకు చేరింది. హిండెన్బర్గ్ నివేదిక వల్ల ఫిబ్రవరి 23కు ఆ పెట్టుబడుల విలువ దాదాపు రూ.27,000 కోట్లకు పడిపోయినా, మళ్లీ కోలుకుంది.
* మూడు రోజుల దూకుడు తర్వాత అదానీ గ్రూప్లోని 7 షేర్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 5.90%, అదానీ విల్మర్ 2.15%, అదానీ పోర్ట్స్ 2.13%, అదానీ పవర్ 1.63%, అంబుజా సిమెంట్స్ 1.25%, అదానీ గ్రీన్ ఎనర్జీ 0.52% చొప్పున నష్టాలు నమోదుచేశాయి. అదానీ ట్రాన్స్మిషన్ 5%, అదానీ టోటల్ గ్యాస్ 5%, ఎన్డీటీవీ 4.98% లాభపడ్డాయి.
* గురువారం నుంచి స్వల్పకాలిక ఏఎస్ఎం నియమావళిలో అదానీ ఎంటర్ప్రైజెస్ను పెడుతున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి.
ఎల్ఐసీ లాభంలో 5 రెట్లకు పైగా వృద్ధి
జనవరి- మార్చిలో రూ.13,191 కోట్లు
రూ.3 తుది డివిడెండు
దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏకీకృత నికర లాభం 5 రెట్లకు పైగా పెరిగి రూ.13,191 కోట్లకు చేరింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం రూ.2,409 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,15,487 కోట్ల నుంచి తగ్గి రూ.2,01,022 కోట్లకు పరిమితమైంది.
* పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2022-23) ఎల్ఐసీ నికర లాభం పలు రెట్లు పెరిగి రూ.35,997 కోట్లకు చేరింది. 2021-22లో నికర లాభం రూ.4,125 కోట్లు మాత్రమే.
* 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.3 (30%) తుది డివిడెండును ఎల్ఐసీ బోర్డు సిఫారసు చేసింది. ఎల్ఐసీ స్థూల నిరర్థక ఆస్తులు 6.03 శాతం నుంచి 2.56 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.04 శాతం నుంచి సున్నాకు తగ్గాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..