Meta: ఒక్కోరోజే 25% పతనమైన మెటా షేరు.. ఏడాదిలో ₹55 లక్షల కోట్లు ఆవిరి
సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో మెటా షేరు గురువారం భారీగా పతనమైంది. దీంతో మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగత సంపద సైతం భారీగా తరిగిపోయింది.
వాషింగ్టన్: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్ఫామ్స్ షేరు విలువ గురువారం 25 శాతం పడిపోయింది. ఫిబ్రవరి తర్వాత కంపెనీకి ఇదే ఒకరోజు అతిపెద్ద నష్టం. కంపెనీ ఇప్పటికే ప్రకటనల ఆదాయం విషయంలో సవాళ్లు ఎదుర్కొంటోందని సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఈ తరుణంలో భవిష్యత్తులో ఫలాలు ఇచ్చే వేదికలపై సంస్థ పెట్టుబడులు భారీగా పెరుగుతోందని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే షేరు ధర భారీగా కుంగింది. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు ఆదాయాలపైనా ఆయన నిరాశపరిచే అంచనాలను ప్రకటించారు. జుకర్బర్గ్ వ్యక్తిగత సంపద గురువారం 11.2 బిలియన్ డాలర్లు (రూ.92.32 వేల కోట్లు) తగ్గి 37.7 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆయన బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచీలో 28వ స్థానంలో కొనసాగుతున్నారు.
వర్చువల్ రియాలిటీ, మెటావర్స్, కృత్రిమ మేధ వల్ల తమ సామాజిక మాధ్యమాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని జుకర్బర్గ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందన్నారు. అయితే, షార్ట్ వీడియో, బిజినెస్ మెసేజింగ్, మెటావర్స్పై పెట్టిన పెట్టుబడులు సరైన ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, అవి ఎప్పుడు, ఎంత మొత్తంలో లబ్ధిచేకూర్చుతాయనేది మాత్రం చెప్పలేమన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మెటా స్టాక్ ధర 71 శాతానికి పైగా తగ్గింది. అయినా, కొనుగోళ్ల జాడ మాత్రం కనబడటం లేదు. దీంతో ఈ ఏడాది కంపెనీ కంపెనీ మార్కెట్ విలువ 676 బిలియన్ డాలర్లు (రూ.55.72 లక్షల కోట్లు) తగ్గింది. ఫలితంగా అమెరికాలో విలువపరంగా అతిపెద్ద 20 కంపెనీల జాబితాలో స్థానం కోల్పోయింది.
ఈ సవాళ్లన్నింటిలో ఒక్కో దానికి ఒక్కో సమయంలో కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని జుకర్బర్గ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో ఓపికగా ఉంటూ తమ కంపెనీలో పెట్టుబడులుతున్న వారిని ఆయన అభినందించారు. కచ్చితంగా వారందరికీ ఫలితం లభిస్తుందన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మెటా ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం తగ్గింది. విక్రయాలు వరుసగా రెండో త్రైమాసికంలోనూ తగ్గుముఖం పట్టాయి. వచ్చే మూడు నెలల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. ఈ ఏడాది కంపెనీ వ్యయాలు 85-87 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది అది 96-101 బిలియన్ డాలర్లకు వరకు చేరొచ్చని తెలిపింది.
మార్కెట్లోని అస్థిర పరిస్థితుల కారణంగా మెటా ప్రకటనల ఆదాయం ఇప్పటికే తగ్గింది. మరోవైపు యాపిల్ గోప్యతా విధానాల్లో మార్పులు చేయడంతో అన్ని సామాజిక మాధ్యమాల ప్రకటనలపై ప్రభావం పడింది. దీంతో నియామకాల్లో తగ్గింపు వంటి చర్యల ద్వారా మెటా వ్యయ నియంత్రణకు దిగింది. ఒక్క ఈ కంపెనీయే కాకుండా ఆల్ఫాబెట్, స్నాప్ వంటి కంపెనీల ప్రకటనల ఆదాయంపైనా ప్రభావం పడింది. అయితే, మెటా మాత్రం విక్రయాల నుంచి వస్తున్న ప్రతి 10 డాలర్లలో ఒక డాలర్ను భవిష్యత్తు వర్చువల్ టెక్నాలజీపై ఖర్చు చేస్తోంది. అది ఎప్పటికి ఫలితాలిస్తుందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో మదుపర్లలో ఆందోళన నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..