Best Companies 2023: ప్రపంచ అత్యుత్తమ 100 కంపెనీల్లో భారత్ నుంచి ఒకే ఒక్కటి!
TIME World’s Best Companies 2023: టైమ్ 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (TIME World’s Best Companies 2023)లో మైక్రోసాఫ్ట్ (Microsoft) అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఒకే ఒక్క కంపెనీ చోటు దక్కించుకుంది.
TIME World’s Best Companies 2023 | ఇంటర్నెట్ డెస్క్: టైమ్ మ్యాగజైన్ స్టాటిస్టాతో కలిసి ప్రపంచంలో 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (TIME World’s Best Companies 2023)ను విడుదల చేసింది. దీనిలో మైక్రోసాఫ్ట్ (Microsoft) అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ (Apple), గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, మెటా ప్లాట్ఫామ్స్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో కేవలం ఒకే భారత కంపెనీ స్థానం దక్కించుకుంది. దేశీయ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) టైమ్ 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (World’s Best Companies 2023)లో 64వ స్థానంలో నిలిచింది.
ఇన్ఫోసిస్ (Infosys)ను ఏడుగురు యువ ఇంజినీర్లు 1981లో స్థాపించారు. వీరిలో ఎన్.ఆర్.నారాయణ మూర్తి, నందన్ నీలేకని అందరికీ సుపరిచితులే. వీరితో పాటు ఎస్.డి.శిబులాల్, గోపాలకృష్ణన్, అశోక్ అరోడా, కె.దినేశ్, ఎన్.ఎస్.రాఘవన్ కంపెనీని స్థాపించిన వారిలో ఉన్నారు. 2020 నాటికి ఆదాయాల ప్రకారం భారత్లో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.6.26 లక్షల కోట్లు. యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టయిన మొదటి భారత కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. టైమ్ తాజా జాబితా (TIME World’s Best Companies 2023)లో చోటు దక్కించుకున్న మూడో ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీగానూ ఇన్ఫోసిస్ నిలిచింది. యాక్సెంచర్, డెలాయిట్ దీనికంటే ముందున్నాయి. ఇన్ఫోసిస్ షేరు విలువ ఈరోజు 0.34 శాతం పెరిగి రూ.1,512 దగ్గర స్థిరపడింది.
క్రెడిట్ కార్డు బిల్లు అధికంగా చెల్లిస్తున్నారా?ఇకపై కుదరదు!
ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత (ESG) ఆధారంగా టైమ్.. ఈ కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చింది. 58 దేశాల్లో మొత్తం 1.5 లక్షల ఉద్యోగులను సర్వే చేసినట్లు తెలిపింది. గత మూడేళ్ల ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆదాయ వృద్ధిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కర్బన ఉద్గారాలు, వాటిని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు, మానవ హక్కుల విధానాలు, డైరెక్టర్ల బోర్డులో మహిళల సంఖ్య వంటి వివరాల ఆధారంగా సుస్థిరతను అంచనా వేసినట్లు వివరించింది.
100 అత్యుత్తమ కంపెనీల్లో తొలి 10 ఇవే..
- మైక్రోసాఫ్ట్
- యాపిల్
- ఆల్ఫాబెట్
- మోటా ప్లాట్ఫామ్స్
- యాక్సెంచర్
- ఫైజర్
- అమెరికన్ ఎక్స్ప్రెస్
- ఎలక్ట్రిసైట్ డి ఫ్రాన్స్
- బీఎండబ్ల్యూ గ్రూప్
- డెల్ టెక్నాలజీస్
750లో 8 భారత కంపెనీలు..
ప్రపంచవ్యాప్తంగా టైమ్ పరిగణనలోకి తీసుకున్న అత్యుత్తమ 750 కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ (Infosys) సహా భారత్ నుంచి మరో ఏడు కంపెనీలు ఉన్నాయి.
- ఇన్ఫోసిస్-64
- విప్రో- 174
- రిలయన్స్ ఇండస్ట్రీస్- 248
- హెచ్సీఎల్- 262
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 418
- డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్- 596
- ఐటీసీ- 672
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక