Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 177 పాయింట్లు లాభపడి 72,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకొని 21,888 దగ్గర కొనసాగుతోంది.

Updated : 15 Feb 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 177 పాయింట్లు లాభపడి 72,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకొని 21,888 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.99 వద్ద మొదలైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎం అండ్‌ ఎం, విప్రో, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం పుంజుకున్నాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గత 24 గంటల్లో 0.42 శాతం తగ్గి 81.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.3,929.60 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,897 కోట్ల విలువ చేసే వాటాలను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని