Electric Scrambler: ప్రపంచ తొలి ఎలక్ట్రిక్ ఆఫ్రోడ్ బైక్ ఇదే.. లుక్ అదిరిపోయిందిగా..!
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలకు పోటీగా ఇప్పటికే విద్యుత్ స్కూటర్లు, బైకులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్లైన్ బైకుల విభాగంలో సైతం ఎలక్ట్రిక్ వాహన ప్రస్థానం మొదలైంది. న్యూజిలాండ్కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ స్విచ్ దీన్ని తీసుకొచ్చింది. మట్టి రోడ్లు, ఇసుక తిన్నెలపై సునాయాసంగా నడిపేందుకు వీలుగా ఉండే ఇ-స్క్రాంబ్లర్ (ఆఫ్రోడ్ బైక్)ను ఆవిష్కరించింది. ప్రపంచ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ మోటార్ సైకిల్ ఇదేనని కంపెనీ ఇదేనని కంపెనీ పేర్కొంది. తాజాగా ఈ బైక్ ప్రీ బుకింగ్స్ను ప్రారంభించింది. 2023 తొలి త్రైమాసికం నుంచి విక్రయాలు ప్రారంభించనుంది.
వాస్తవానికి ఈ కంపెనీ 2020లోనే ఈ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. అయితే, కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు దీనికి బ్రేక్ పడింది. స్క్రాంబ్లర్ విభాగంలో డుకాటి కంపెనీ గతంలో తీసుకొచ్చిన మోడల్ను పోలి ఉన్న ఈ బైక్.. అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. 170 కేజీల బరువు ఉండే ఈ బైక్ మోనో సస్పెన్షన్తో వస్తోంది. 13kWh బ్యాటరీని అమర్చారు. 50kW ఎయిర్కూల్డ్ మోటార్ కలిగిన ఈ మోటార్ సైకిల్ 70hp పవర్ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, 3.5 సెకెన్ల సమయంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. కేవలం 4 గంటల్లోనే 90 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. బయటకు కనిపించకుండా ఎలక్ట్రిక్ పరికరాలు, కంట్రోల్స్ను ట్యాంక్ భాగంలో అమర్చారు. బైక్ ధరను 11,999 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించింది. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.10 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా డెలివరీలు అందిస్తామని కంపెనీ చెబుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం