Year Ender 2022: ఈ ఏడాది వచ్చిన కీలక ఆర్థిక మార్పులివే..!
క్రెడిట్ కార్డు కొత్త రూల్స్, టోకనైజేషన్, డిజిటల్ రూపాయి.. ఇలా 2022లో ఆర్థికంగా అనేక మార్పులు వచ్చాయి. వీటిపై ఓ లుక్కేద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఆర్థికపరంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని సామాన్యులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపేవైతే.. మరికొన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆర్బీఐ (RBI) రేట్ల పెంపుతో నెలవారీ వాయిదాల భారం పెరగ్గా.. టోకనైజేషన్ రూపంలో వినియోగదారులకు బ్యాంకులు మరింత భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు క్రిప్టోల (Cryptocurrency)తో పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం.. అధిక పన్నులతో మదుపర్లను రక్షించే ప్రయత్నం చేశాయి. ఇలా.. ఈ ఏడాది చోటుచేసుకున్న కీలక ఆర్థిక పరిణామాలపై ఓ లుక్కేద్దాం...
ఆర్బీఐ ముందు చూపు.. క్రిప్టోలపై పన్ను
క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాల మీద 30 శాతం పన్ను అమల్లోకి వచ్చింది. ఒక పరిమితికి మించిన వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 1 శాతం టీడీఎస్ (మూలంలో పన్ను కోత) వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించారు. క్రిప్టో ఆదాయాలను, వాటిపై వచ్చిన నష్టాలతో సర్దుబాటు చేయటానికీ వీల్లేదు. అదేవిధంగా షేర్లు, కమొడిటీల వంటి ఇతర ఆస్తులపై వచ్చిన నష్టాలతోనూ సర్దుబాటు చేయలేరు. అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు కూడా ఉండదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి.
క్రెడిట్ కార్డుపై మరింత పట్టు
క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు వచ్చాయి. ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ కార్డు సంస్థలు.. కార్డు వినియోగదారుడిని సంప్రదించకుండా.. కొత్తగా పరిమితి పెంచడం, కొత్త కార్డులను పంపించడంలాంటివి చేసేందుకు వీల్లేదు. దీంతోపాటు.. కార్డుదారుడు తన వెసులుబాటును బట్టి, బిల్లింగ్ సైకిల్ను మార్చుకోవచ్చు. అయితే, దీనికి ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. క్రెడిట్ కార్డును రద్దు చేయాల్సిందిగా వినియోగదారుడు కోరినప్పుడు ఎలాంటి బాకీలు లేకపోతే ఏడు పనిదినాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆలస్యం అయితే.. రోజుకు రూ. 500 చొప్పున వినియోగదారుడికి కార్డు సంస్థ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
టెలికాంలో నవశకం..
దేశ టెలికాం రంగంలో ఒకరకంగా చెప్పాలంటే ఈ ఏడాదే నవశకం మొదలైంది. దేశంలో 5జీ సేవలు అక్టోబరు 1న ప్రారంభమయ్యాయి. 5జీ (5G) సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా ఇతర నగరాలకూ విస్తరిస్తున్నాయి. తొలి దశలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్నగర్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ (5G) సేవల్లో లభిస్తుంది. దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ను కొనుగోలు చేశాయి. 5జీ రాకతో సాంకేతిక రంగంలో అనూహ్య మార్పులు రానున్నాయి. ముఖ్యంగా మెటావర్స్, ఆటోమేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతలు మనిషిని కొత్త శకంలోకి తీసుకువెళ్లనున్నాయి.
డిజిటల్ రూపాయితో ప్రయోగాలు..!
దేశంలో తొలిసారిగా అధీకృత ‘డిజిటల్ రూపాయి’ నవంబరు 1 నుంచి వినియోగంలోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా టోకు వినియోగానికి తొలుత అనుమతించారు. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీలు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీల కోసం డిజిటల్ రూపాయిని జారీ చేశాయి. ఆ తర్వాత డిజిటల్ రూపాయి- రిటైల్ విభాగంలో తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1న ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. పరిమిత వినియోగదార్లు-వ్యాపారుల బృందాలకు ప్రారంభించాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అనేది ప్రస్తుత కరెన్సీ నోట్లకు డిజిటల్ రూపం మాత్రమే. వీటికి ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుత నగదు కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించేందుకే సీబీడీసీని తీసుకొచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
ధరలు పెరిగే.. వడ్డీరేట్లూ పెరిగే..
దేశంలో అదుపు తప్పిన ధరల్ని నియంత్రించేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. మే నెలలో అనూహ్యంగా భేటీ అయి రెపోరేటును 0.40 శాతం పెంచింది. తర్వాత జరిగిన ప్రతి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చింది. ఇప్పటి వరకు రెపోరేటు 2.25 శాతం పెరిగింది. బ్యాంకులు ఈ పెంపును వినియోగదారులపైకి బదిలీ చేశాయి. దీంతో సామాన్యులపై ఈఎంఐల భారం గణనీయంగా పెరిగింది. అయినా ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. వరుసగా 9 నెలల పాటు ద్రవ్యోల్బణం లక్షిత పరిధి అయిన 6 శాతం ఎగువన నమోదవ్వడంతో చరిత్రలో తొలిసారి ఆర్బీఐ ద్రవ్యపరపతి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరులో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
టోకనైజేషన్తో మన కార్డుకు మరింత భద్రత..
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే ఆన్లైన్ చెల్లింపు లావాదేవీల్లో భద్రతను పెంచడమే లక్ష్యంగా టోకనైజేషన్ను ఈ ఏడాదిలోనే తీసుకొచ్చారు. టోకనైజేషన్తో కార్డు వివరాల నిల్వ పరిమితంగా ఉంటుంది. తాజాగా అన్ని ఆన్లైన్ చెల్లింపు గేట్వేలు, వ్యాపారులు, ఇ-కామర్స్ కంపెనీలు తమ వినియోగదార్లకు చెందిన కార్డుల టోకనైజేషన్ను అమలు చేయాలని ఆర్బీఐ కోరింది. మర్చంట్లు తమ సర్వర్లలో వినియోగదారు కార్డు వివరాలను నిల్వ చేయకుండా, ప్రత్యామ్నాయంగా సీఓఎఫ్(కార్డ్ ఆన్ ఫైల్) టోకనైజేషన్ను అందిపుచ్చుకోవాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు