లక్షణమైన నటన.. కోటి మంది వీక్షణ
ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికే గుర్తింపు వచ్చేది. ఆ రంగంలోని దర్శకులు, నిర్మాతలే వెలుగొందే వారు. నటన, రచనా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నా సామాన్యులకు, సాధారణ ప్రజానీకానికి అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలేది.
గొడిసిర్యాల చిన్నారుల ప్రతిభ
బాలనట బలగంతో విష్ణు
మామడ/దస్తురాబాద్, న్యూస్టుడే: ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికే గుర్తింపు వచ్చేది. ఆ రంగంలోని దర్శకులు, నిర్మాతలే వెలుగొందే వారు. నటన, రచనా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నా సామాన్యులకు, సాధారణ ప్రజానీకానికి అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలేది. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్్ ఛానళ్లు అందుబాటులోకొచ్చాక ప్రతిభ ఉంటే ఎవరైనా, ఎక్కడి నుంచైనా .హీరోలుగా మారేందుకు, దర్శకత్వం వహించేందుకు దారులు దగ్గరయ్యాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసిర్యాలకు చెందిన ఓ యువకుడి మార్గదర్శనంలో తెరమీద ఇరగదీస్తున్న చిన్నారుల సన్నివేశాలు ఇందుకు నిదర్శనం.
‘స్వాతి’ ఏ పాత్రలోనైనా జీవిస్తుంది..
తెర వెనక విష్ణు..
గొడిసిర్యాలకు చెందిన సౌధాని విష్ణు డిగ్రీ పూర్తి చేశారు. అంగవైకల్యంతో ఆయన చిన్నప్పటి నుంచి అనేక కష్టనష్టాలెదుర్కొన్నారు. ఉన్నత తరగతులకు పక్క ఊరి బడికెళ్లేందుకు సైకిల్ నడపలేని పరిస్థితి. అవిటితనం బాధపెట్టినా పని చేయకుంటే కుదరని పేదరికం. ఎన్ని అడ్డంకులెదురైనా పక్క గ్రామానికి వెళ్లి పదో తరగతి, ఆ తర్వాత జన్నారం, జగిత్యాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పుడు సొంతూరులో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంతకే పరిమితమై ఉంటే అతడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి బాల నటులచే భళా అనిపిస్తూ తెర వెనక ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.
మదిలో మెదిలిన ఆలోచనలతో..
ఆధునిక పోకడలతో అంతరించి పోతున్న పల్లె పదాలు, జానపదాలు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను బతికించాలన్న తపన విష్ణులో బలంగా ఉంది. ఇందుకు యూట్యూబ్ను వేదిక చేసుకున్నారు. ‘ఎస్వీవై ఎడిటింగ్స్’ అనే ఛానల్ను 2022లో ప్రారంభించారు. నటనలో ప్రతిభ కనబరిచే అదే గ్రామానికి చెందిన పది మంది పిల్లలతో అద్భుతమైన, సందేశాత్మక లఘుచిత్రాలను తీస్తున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండే గ్రామీణ కుటుంబ నేపథ్యమున్న ఆయన కథాంశాలు, చిన్నారుల మహానటన లక్షల మందిని ఆకట్టుకుంటోంది. ‘నాయి దొరో’ అనే పాటను 5 లక్షల మంది వీక్షించారంటే మాటలా మరి.
భళా బాల నటులు..
అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ఏ మాత్రం ప్రతిభ ఉన్నా అది విశ్వవ్యాప్తమవుతోంది. తన రచనా శైలిలో విష్ణు, నటనా ప్రతిభతో గొడిసిర్యాల చిన్నారుల పాటలు, లఘుచిత్రాలను ఇప్పటి వరకు 1,43,33,771 మంది వీక్షించారంటే ఈ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చిందనడంలో అతిశయోక్తి లేనట్లే.. ఆ యువకుడి దర్శకత్వంలో చిన్నారులు స్వాతి, నాగరాజు, రాహిణి, వినీష, వినయ్, నిషాంత్, విశ్వంత్, అక్షిత్, లల్లి, అభిరామ్, క్రిష్ నటనలో ఇప్పటి వరకు చిత్రీకరించిన ‘నాతో పెట్టుకోకు మరి, దుబాయ్ షేక్, బతుకమ్మ ఆడనివ్వక పోతే, ఆకాశి పండగకు అవ్వగారింటికి పోత, యారాండ్ల కొట్లాట, అప్పుతోటి తిప్పలు, వదినోళ్ల బర్రె సచ్చిపాయే, బస్సులేక బడికి ఇబ్బంది’ వంటి వీడియోలు జనాదారణ పొందాయి. పిల్లల చదువుకు ఇబ్బంది కాకుండా ఆదివారాల్లో, సెలవు దినాల్లో తల్లిదండ్రుల అనుమతితో ఊరి చుట్టూనే చిత్రీకరిస్తుంటారు. తమ గ్రామ పిల్లలు ఇంత బాగా నటిస్తారా అని ఎక్కడెక్కడో ఉండే వారు ఆసక్తితో చూస్తుంటారు.
సంతృప్తిగా ఉంది: విష్ణు
ఉన్నచోటే ఉండి పోతే ఈ రోజుల్లో ఎవరూ పట్టించుకోరు. పనిచేస్తూనే అదనంగా ఆసక్తి ఉన్న రంగంలో రాణిస్తే గుర్తింపు వస్తుంది. ఒకప్పుడు వైకల్యంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని నేను ఈ రోజు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే లఘు చిత్రాలు తీస్తున్నాను. మా ఊరి పిల్లలు అద్భుతంగా నటిస్తుండడంతో యూట్యూబ్లో నా ఛానల్కు చక్కని పేరొచ్చింది. పెద్దగా ఖర్చు లేకుండా చరవాణిని చిన్న స్టాండ్కు బిగించి స్థానికంగా తీస్తున్న సన్నివేశాలను వీక్షకులు ఆదరించడం సంతృప్తినిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఐ నాయకుల ముమ్మర ప్రచారం
[ 10-05-2024]
మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. -
భగత్ సింగ్ నగర్లో సీపీఎం విస్తృత ప్రచారం
[ 10-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో సీపీఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు. -
హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికుల బృందం
[ 10-05-2024]
హజ్ యాత్రకు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి 29 మంది గల సభ్యుల బృందం గురువారం రాత్రి బయలుదేరింది. -
పట్టణంలో పోలీసుల కవాతు
[ 10-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు -
ఎన్నికల్లో భాజపాను ఓడించాలి
[ 10-05-2024]
భాజపా దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(యంఎల్)- మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. -
మూడోసారి మోదీ ప్రధాని కావాలి
[ 10-05-2024]
మోదీ మూడోసారి ప్రధాని కావాలని, అందుకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో భాజపాను గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. -
మాజీ సర్పంచులు కాంగ్రెస్లో చేరిక
[ 10-05-2024]
తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
బంగారం దుకాణాల్లో సందడి
[ 10-05-2024]
అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణాల్లో వినియోగదారుల సందడి నెలకొంది. -
పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి
[ 10-05-2024]
‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. -
మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్ ఆనాడే అన్నారు కాంగ్రెస్, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం
[ 10-05-2024]
పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. -
సరిహద్దుపై నజర్
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. -
బాధ్యతగా ఓటేద్దాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. -
గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం
[ 10-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. -
ఓటరు చీటీ అందలేదా.. ఇలా తెలుసుకోండి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరుకు సంబంధించి ఓటరు చీటీలను ఇంటింటా బీఎల్వోల సాయంతో పంపిణీ చేస్తున్నారు. -
ఎంపీగా గెలిచిన వారికి వసతులు బోలెడు
[ 10-05-2024]
ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తోంది. -
గ్రామస్థులను పలకరించి... కన్నీళ్లు పెట్టుకొని
[ 10-05-2024]
‘పార్టీలను పక్కన పెట్టి మీ ఊరి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తాను. -
ఓటు వేయడం.. బాద్యతగా భావిద్దాం
[ 10-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. -
ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం
[ 10-05-2024]
ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. -
ప్రత్యేక కేంద్రం.. శతశాతం లక్ష్యం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు వజ్రాయుధం. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికారులు ఓటరు నమోదు శాతం పెంపునకు కళాజాత బృందాలతో ప్రదర్శనలు, 2కే రన్, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఇక రెండు రోజులే..
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు ఉండగా.. ప్రచారం శనివారం సాయంత్రానికే పరిసమాప్తం కానుంది. -
అనుమతి ఒకటి.. చేసేది మరొకటి!
[ 10-05-2024]
రహదారి నిర్మాణం కోసం అవసరమైన మొరం కోసం అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వెంచర్లకు లారీల్లో మొరం తరలిస్తున్న ఉదంతం ఇది. -
ఫోన్ చేయండి.. కథలు వినండి!
[ 10-05-2024]
కథల పుస్తకాలు చదవడం ద్వారా పిల్లల్లో జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందించవచ్చని మండల విద్యాధికారి ఎం.వెంకటేశ్వరస్వామి అన్నారు. -
చరవాణికి బానిసై విద్యార్థి ఆత్మహత్య
[ 10-05-2024]
చరవాణికి బానిసైన తొమ్మిదో తరగతి విద్యార్థి (17) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్