సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ,
డ్రోన్ శిక్షణ పొందుతున్న మహిళలు
ఆదిలాబాద్ వ్యవసాయం, న్యూస్టుడే : వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, వినియోగం తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. కోరమాండల్, ఇఫ్కో కంపెనీల ఆధ్వర్యంలో మహిళలను ఎంపిక చేసి ఇటీవల శిక్షణ ఇప్పించడంతోపాటు వీరికి డ్రోన్లను సైతం అందించారు. ఇంకా కొన్ని పరికరాలను ఇవ్వాల్సి ఉంది. శిక్షణ పొందిన యువతులు వానాకాలం సీజన్ నుంచి డ్రోన్ పైలట్లుగా మారనున్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 15 వేల మంది మహిళలను డ్రోన్ పైలట్లుగా మార్చి డ్రోన్లు అందించాలని డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలివిడతలో ఉమ్మడి జిల్లా మొత్తంలో 10 మంది యువతీ, యువకులు శిక్షణ పొందారు. వీటిని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పథకం వల్ల సత్ఫలితాలు వస్తే మరి కొంత మందికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉంది. సంఘాల్లోని కొంత మంది చదువుకున్న యువతులకు శిక్షణ ఇచ్చి, వారే స్వయంగా నిర్వహించుకునేందుకు వీలుగా రూ.10 లక్షల విలువ గల డ్రోన్లను మంజూరు చేశారు.
ఖర్చు తక్కువ.. సమయం ఆదా..
వ్యవసాయరంగంలో డ్రోన్లతో పొలాలకు ఎరువులు, పురుగు మందులు చల్లటం తేలిక. పైగా ఖర్చు తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు డ్రోన్లను రైతులు వినియోగించుకునేలా పురుగుమందులు తయారు చేస్తున్నాయి. డ్రోన్లు గరిష్ఠంగా 10 లీటర్ల మందును మోసుకెళ్లగలవు. సాధారణంగా రైతులు ఎకరా పొలంలో మందు పిచికారీ చేయాలంటే అయిదారు గంటలు పడుతుంది. అదే డ్రోన్ అయితే పది నిమిషాల్లో పూర్తి చేస్తుంది. రాత్రి ఛార్జి చేసి పెట్టుకుంటే రోజంతా డ్రోన్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒక రోజు గరిష్ఠంగా 30 ఎకరాల్లో రసాయన మందులు పిచికారీ చేసే వీలుంది.
అవకాశం వచ్చింది.. వినియోగించుకుంటాం
శ్రీదేవి, రజిత, కుమురంభీం జిల్లా
మాది మారుమూల లంబాడిహెట్టి గ్రామం. చింతలమానేపల్లి మండలం. డ్రోన్లతో రసాయన మందులు పిచికారీ చేయడంపై పది రోజులు శిక్షణ తీసుకున్నాం. తర్వాత మళ్లీ మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. స్వయంగా డ్రోన్ను నిర్వహించగలమనే నమ్మకంతో ఉన్నాం. డ్రోన్తోపాటు వాటికి సంబంధించిన పరికరాలు, బ్యాటరీ తదితర నిర్వహణకు శిక్షణ కోరమాండల్ కంపెనీ వాళ్లు ఇచ్చారు. ఇంకా కొన్ని పరికరాలు ఇస్తామని చెప్పారు. స్వయంగా ఆదాయం సంపాదించడంతోపాటు రైతులకు మేలు జరిగే అవకాశం ఉండటంతో డ్రోన్లను సమర్థవంతంగా నిర్వహిస్తాం.
ఆర్థికాభివృద్ధి చెందేలా..
సాయిరమ్య, మంచిర్యాల జిల్లా
నాది టేకుమట్ల గ్రామం జైపూర్ మండలం. నేను పీజీ పూర్తి చేశాను. మహిళా సంఘంలో ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. స్వయం ఉపాధి పొందేందుకు డ్రోన్లపై శిక్షణ ఇవ్వడమే కాకుండా వాటిని ఉచితంగా అందించడంతో ఉపాధి పొందే అవకాశం కలిగింది. రైతులకు తక్కువ ఖర్చుతో పని పూర్తి చేసే డ్రోన్లకు రాబోయే రోజుల్లో మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయరంగంలో సాంకేతికతను ప్రోత్సహించడంతోపాటు మహిళలకు డ్రోన్ల నిర్వహణ అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం దక్కింది.
రైతులకు మేలు
హారిక, నిర్మల్ జిల్లా
నాది కొరిటికల్ గ్రామం మామడ మండలం. డ్రోన్ నిర్వహణపై శిక్షణ తీసుకున్నాను. వ్యవసాయరంగంలో పంటలపై పురుగుమందుల పిచికారీ అనేది పెద్ద సమస్య. పంట చేతికి వచ్చే వరకు అయిదారుసార్లు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో పిచికారీ చేయవచ్చు. నేను డ్రోన్ శిక్షణ తీసుకున్నా. అవసరమైన రైతులు తమ పంటకు అవసరమైన రసాయన మందులు తెచ్చుకుంటే పంటలపై పిచికారీ చేసి ఇస్తాం. మరిన్ని డ్రోన్లు అందుబాటులోకి వస్తే రైతులకు మేలు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓడితేనే ఆదివాసుల మనుగడ
[ 28-04-2024]
కేంద్రంలో భాజపా సర్కారును ఓడిస్తేనే దేశంలో ఆదివాసుల మనుగడ సుసాధ్యమవుతుందని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసం సచిన్ అన్నారు. -
భాజపా ఆధ్వర్యంలో ఇటింటి ప్రచారం
[ 28-04-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం తాంసి (బి) లో ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కళలకు నిలయం బాలకేంద్రం
[ 28-04-2024]
వివిధ భారతీయ కళలకు నిలయంగా బాలకేంద్రం నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది ఉదయశ్రీ అన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
[ 28-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
[ 28-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది. -
కార్మికుల్లో సామాజిక స్పృహ అభినందనీయం
[ 28-04-2024]
కార్మికుల్లో సామాజిక స్పృహ ఉండటం అభినందనీయమని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ పేర్కొన్నారు. -
అక్రమాలకే ప్రా‘ధాన్యం’?
[ 28-04-2024]
ఎక్కడ ముడిసరకు లభ్యమవుతుందో సాధారణంగా అక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ధాన్యం ఆశించిన రీతిలో పండకున్నా ఇక్కడ ఏకంగా తొమ్మిది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయి. -
భాజపా బలగాల మోహరింపు
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేలా భాజపా కార్యాచరణ చేపట్టింది. -
మండుటెండల్లో అంటుకుంటున్న అడవులు
[ 28-04-2024]
జిల్లాలో గతంకంటే ఈ ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా ఉండి ఉదయం పది గంటలకే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. -
వంద ఎకరాలు కొట్టేసే పన్నాగం
[ 28-04-2024]
‘వడ్డించే వాడు మనవాడైతే చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరుతాయి’ అన్న చందంగా అధికారులు, నేతలు కుమ్మక్కై వంద ఎకరాల భూమిని ఆక్రమించే ప్రయత్నం సాగుతోంది. -
నిధులు రాక.. నిర్వహణ లేక
[ 28-04-2024]
రైతులకు పండ్ల తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, మొక్కల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రాలు నిర్వహణ లోపంతో మూతపడే దశకు చేరుకున్నాయి. -
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. -
నేర ప్రవృత్తి మార్చుకోవాలి : ఎస్పీ
[ 28-04-2024]
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.సురేష్కుమార్ తెలిపారు. -
ఓటర్లు @ 15,96,430
[ 28-04-2024]
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. -
సిబ్బంది కొరత.. వసతుల లేమి
[ 28-04-2024]
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, వసతుల లేమితో సరైన సేవలు అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ను గెలిపించాలి
[ 28-04-2024]
మనిషికి చేతులు ఎంతముఖ్యమో.. దేశానికి చేతిగుర్తు పార్టీ అవసరం అంతే ఉందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కోరారు. -
అవగాహన లేక.. అనుమతి పొందక..!
[ 28-04-2024]
పెళ్లి.. రిసెప్షన్.. పుట్టినరోజు.. ఇలా వేడుకేదైనా చాలామంది ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలనుకుంటున్నారు. -
నీతి ఆయోగ్ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం
[ 28-04-2024]
మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. -
గుంపులున్న చోటుపై గురి..
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులు మాత్రమే గడువుంది. లోక్సభ పరిధిలో రెండు వేలకు పైగా గ్రామాలు, 380కి పైగా గూడేలు, తండాలు ఉన్నాయి. -
పెద్దపల్లిలో స్థానికేతరులకే పెద్దపీట
[ 28-04-2024]
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీలుగా ఎన్నికైనవారిలో ఇప్పటి వరకు స్థానికులెవరూ విజయం సాధించలేకపోయారు. -
మండే ఎండతో జాగ్రత్త..
[ 28-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. -
తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
[ 28-04-2024]
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. -
వేసవి తాపం.. కొబ్బరినీరే ఉపశమనం
[ 28-04-2024]
రామకృష్ణాపూర్లోని ఆర్కేపీ ఓసీ, సీహెచ్పీ, సింగరేణి ఏరియా ఆసుపత్రితో పాటు కాలనీల్లో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM