వివాదాల రాజమార్గం
నవ్యాంధ్రకు తలమానికంగా ఉండేలా ఏపీఐఐసీ ఆదర్శ పారిశ్రామికవాడకు చేరుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాజమార్గ నిర్మాణానికి ఇంకా అవరోధాలు తప్పడం లేదు. నాలుగేళ్ల కిందట నిర్మించ తలపెట్టిన ఈ
మళ్లీ నిలిచిన మల్లవల్లి పారిశ్రామికవాడ రహదారి నిర్మాణం
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: నవ్యాంధ్రకు తలమానికంగా ఉండేలా ఏపీఐఐసీ ఆదర్శ పారిశ్రామికవాడకు చేరుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాజమార్గ నిర్మాణానికి ఇంకా అవరోధాలు తప్పడం లేదు. నాలుగేళ్ల కిందట నిర్మించ తలపెట్టిన ఈ రహదారి నేటికీ కొలిక్కి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. భూసేకరణలో నెలకొన్న అడ్డంకులు తొలగించడంలో ఏపీఐఐసీ వర్గాలు పూర్తిగా సఫలీకృతం కాలేకపోవడంతో చివరి దశకు వచ్చిన తర్వాత కూడా రహదారి పనులు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తేనే పారిశ్రామికవాడకు రవాణా సౌకర్యం ఎంతో మెరుగవుతుందని తెలిసినా కూడా అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బాపులపాడు మండలం మల్లవల్లిలో 1,260 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడ, వందెకరాల్లో నిర్మిస్తున్న ఆహార పార్కుకు చేరుకోవాలంటే మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారి నుంచి మీర్జాపురం మీదుగా ఉన్న మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెండు గ్రామాలు, నివాసాల మీదుగా వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో రాకపోకలకు అంత అనువుగా లేదు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం-కల్లూరు రహదారి నుంచి నేరుగా పారిశ్రామికవాడకు చేరుకునేలా 150 అడుగుల వెడల్పుతో రాజమార్గం నిర్మించేలా ఏపీఐఐసీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం నూజివీడు, బాపులపాడు మండలాల్లో అవసరమైన భూమిని సేకరించేందుకు 2018లోనే కార్యాచరణ చేపట్టినా, పరిహారం విషయంలో రైతులు, అధికారులకు ఏకాభిప్రాయం కుదరక 2021 వరకు పూర్తిగా భూ సేకరణ జరగలేదు. ఏడాది కిందటే ఈ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ రహదారి పనులు కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
అడుగడుగునా అడ్డంకులే: కీలకమైన రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు దాదాపుగా రైతులంతా సానుకూలంగానే స్పందించినా, ధరపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. పోలవరం కుడి కాల్వ నిమిత్తం సేకరించిన భూమికి ఇచ్చినట్లు ఇవ్వాలనే డిమాండ్ రాజమార్గం కోసం భూములిస్తున్న రైతుల్నుంచి అప్పట్లో వ్యక్తమైంది. ఇక్కడ ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.6.50 లక్షలుగా ఉండగా, రైతుల డిమాండ్ మేరకు రూ.35 లక్షల చొప్పున ఇచ్చారు. 6.38 ఎకరాలకు సంబంధించి రైతులు ససేమిరా అనడంతో గతేడాది చివరి వరకు 900 మీటర్ల మేర రహదారి నిర్మాణం ఆగిపోవడం, రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వడంతో సమస్యకు పరిష్కారమవ్వడం తెలిసిన విషయమే. తాజాగా భూ సేకరణ సమయంలో తన పొలంలో వ్యవసాయ బోరు కోల్పోవాల్సి రావడంతో, ఏపీఐఐసీ అధికారులు ప్రత్యామ్నాయంగా మరో బోరు నిర్మించి ఇస్తామని చెప్పారని, బోరు నిర్మించే వరకు తన పొలం పొడవునా రహదారి నిర్మించడానికి వీల్లేదంటూ ఓ రైతు అడ్డం తిరిగారు. దీంతో పనులు మళ్లీ స్తంభించాయి.
కార్యాచరణ మొదలైందిలా..
ప్రతిపాదిత రహదారి పొడవు - 3.9 కి.మీ.
వెడల్పు - 150 అడుగులు
అంచనా వ్యయం - రూ.15 కోట్లు
సేకరించిన భూమి- 39.98 ఎకరాలు
ప్రతిపాదనలు రూపొందించింది- 2018 మార్చి
భూ సేకరణకు శ్రీకారం - 2018 మే
టెండర్లు - 2020 డిసెంబరులో
పనులు ప్రారంభించింది- 2021 ఫిబ్రవరిలో
పారిశ్రామికవేత్తల అసంతృప్తి
ఇప్పటికే భూమి ధరల పెంపు, కేటాయించిన ప్లాట్ల రద్దు, మౌలిక వసతుల కల్పనలో జాప్యం కారణంగా పారిశ్రామికవేత్తలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికితోడు మూడేళ్ల కిందట అందుబాటులోకి రావాల్సిన కీలక రహదారిని నేటికీ పూర్తి చేయకపోవడంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటోందని వారు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు వద్దవ సంప్రదించగా సమస్యని పరిష్కరించి త్వరలోనే రహదారిని అందుబాటులోకి తెస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసుర వారి.. నరకాపురి..!
[ 06-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు. -
ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!
[ 06-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్ విడుదల కాలేదు. -
ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్!
[ 06-05-2024]
ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు కళాశాలల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకున్నారు. -
పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
[ 06-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. -
ఉట్టిపడిన సంప్రదాయం
[ 06-05-2024]
రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!