logo

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీకు మంత్రి హరీశ్‌రావు పరామర్శ

తెలంగాణ రాష్ట్ర వైద్య, మౌలిక సేవల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. హైదరాబాద్‌లోని డీడీ కాలనీలో ఆయన ఇంటికి వెళ్లి

Published : 28 Sep 2022 02:38 IST

చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వైద్య, మౌలిక సేవల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. హైదరాబాద్‌లోని డీడీ కాలనీలో ఆయన ఇంటికి వెళ్లి గుండెపోటుతో అకాల మరణం చెందిన చంద్రశేఖర్‌రెడ్డి తనయుడు అభిజిత్‌ చిత్రపటం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. మంత్రి వెంట టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, అంబర్‌పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం ఇంటికి చేరుకున్న నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ను మంత్రి హరీశ్‌రావు మంగళవారం పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని