ప్రాధాన్యం విడువక..సంక్షేమం మరువక
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేదిగా ఉంది.
బడ్జెట్ కేటాయింపులతో జిల్లాకు ప్రయోజనం
- న్యూస్టుడే, తాండూరు
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేదిగా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు, నీటి పారుదల, అడవుల అభివృద్ధితో పాటు పట్టణ, పల్లె ప్రగతి వంటి తదితర రంగాలకు నిధుల కేటాయింపు జరిగింది. బడ్జెట్లో కేటాయించిన మొత్తం నుంచి జిల్లాకు ఆయా పద్దుల కింద నిధులు మంజూరు కానున్నాయి. వీటి ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సొంత స్థలం ఉన్నా.. ఇళ్లు లేని పేదలకు..
జిల్లాలో సొంతంగా స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.3లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన 8000 మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే జిల్లాలో మంజూరైన 4,323 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేందుకు దోహద పడుతుంది.
మాఫీ కానున్న రూ.422.85 కోట్ల వ్యవసాయ రుణాలు
తాజా బడ్జెట్ కేటాయింపుతో జిల్లాకు చెందిన 59,073 మంది రైతులు రుణమాఫీలో లబ్ధి పొందనున్నారు. వీరికి రూ.75 వేల నుంచి రూ.లక్ష లోపు కలిపి మొత్తం రూ.422.85 కోట్లు రుణాలు మాఫీ కావాల్సి ఉంది.
సాగు నీటి రంగంపై చిన్న చూపు
జిల్లాలో అతి పెద్దదైన కోట్పల్లి జలాశయం మరమ్మతుకు ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగలేదు.
* ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములు.. 9,200 ఎకరాలు.
* ప్రస్తుతం నీరు పారేది.. కేవలం 4000 ఎకరాలు
* మరమ్మతులకు రూ.40 కోట్లు కావాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదనలు ఇంతకు ముందే పంపినా నిధులు కేటాయించలేదు. ఇదే సమయంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తయ్యాని బడ్జెట్లో పేర్కొన్నారు.
దళిత బంధుతో 4,400 కుటుంబాలకు లబ్ధి
దళిత బంధు పథకం కింద ఒక్కో నియోజక వర్గం నుంచి 1100 మంది దళితులు లబ్ధి పొందేలా నిధుల కేటాయింపు జరిగింది. ఈ లెక్కన ప్రతి లబ్ధి దారునికి రూ.10 లక్షల చొప్పున 4,400 మంది రూ.440 కోట్ల విలువ చేసే యూనిట్లు మంజూరు చేస్తారు.
కంది బోర్డు, పర్యాటక ప్రకటన లేక నిరాశ
జిల్లాలో కంది బోర్డు ఏర్పాటుతో పాటు అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన ఉంటుందని అందరూ ఎదురు చూశారు. తీరా ఆ ఊసేలేక పోయింది.
ఒప్పంద ఉద్యోగులకు ప్రయోజనం
జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారు ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య 500కు పైగా ఉంది.
బాగుపడనున్న రహదారులు
తాజా బడ్జెట్ కేటాయింపులతో రహదారులు, భవనాల శాఖకు చెందిన రహదారులు ఈఏడాది దశల వారీగా మరమ్మతులకు నోచుకోనున్నాయి.
స్థానిక సంస్థలకు ఆర్థిక వెసులుబాటు
జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలు, తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ పురపాలికలకు ఈ బడ్జెట్లో కొంత ఆర్థిక వెసులుబాటు కలిగింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కలిపి ఏటా జనాభా ప్రాతిపదికన రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు మంజూరవుతాయి.
విద్య, వైద్యకు గుర్తింపు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 సామాజిక ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, మూడు బస్తీ దవాఖానాలకు చికిత్స కోసం వచ్చే వారి కోసం బడ్జెట్లో కేటాయించిన నిధుల్లోంచి వినియోగిస్తారు. ఇక జిల్లాలోని 154 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు సమకూరుతాయి.
మహిళా, శిశు సంక్షేమం
జిల్లాలో 968 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. 120 మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని 69,974 మంది చిన్నారులకు, 8,256 మంది బాలింతలు, 7,300 గర్భిణులకు ప్రయోజనం కలుగుతుంది.
పొదుపు సంఘాలకు చేయూత
జిల్లాలో 16,500 పొదుపు సంఘాలున్నాయి. వీటికి రూ.538 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.295 కోట్లు ఇచ్చారు. తాజా కేటాయింపులతో అన్ని మహిళా సంఘాలకు రుణాలు అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఉత్తమ్
[ 10-05-2024]
గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్లో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. -
ఓటేసేందుకు బయల్దేరిన నగరవాసులు.. బస్సులు, రైళ్లు కిటకిట
[ 10-05-2024]
ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
[ 10-05-2024]
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి
[ 10-05-2024]
ఈత కొలనులో మునిగి చిన్నారి మృతి చెందింది. శుక్రవారం మొయినాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. -
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
[ 10-05-2024]
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60వేలతో పరారైన ఘటన ఫిల్మ్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
మల్కాజిగిరి.. విలక్షణమే ప్రతిసారీ
[ 10-05-2024]
అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ప్రజల తీర్పు ప్రతిసారీ విలక్షణంగానే ఉంటోంది. 2009లో ఏర్పాటైన ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు. -
జనం పోటెత్తి.. జాతర హోరెత్తి
[ 10-05-2024]
కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు.. నాయకుల హర్షాతిరేకాల నడుమ సరూర్నగర్ స్టేడియంలో గురువారం రాత్రి ఆ పార్టీ నిర్వహించిన జన జాతర సభ విజయవంతమైంది. -
కమలానికి అండగా.. ప్రచారంలో భిన్నంగా
[ 10-05-2024]
రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా భాజపా ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా సంఘ్ పరివార్ ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. ఈ పరివారంలోని సభ్యులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
ఓటేద్దాం.. ఛాలెంజ్ చేద్దాం
[ 10-05-2024]
ఓటింగ్శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్ విసరండి’ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. -
లోక్సభ బరి.. 17 మంది మహిళల గురి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నారు. మిగిలిన వారు రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని పార్టీలు, స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. -
మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు: కేటీఆర్
[ 10-05-2024]
తెలంగాణ కోసం తెగించి కోట్లాడేది భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గురువారం అల్వాల్లో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. -
లబ్ధిదారులే గెలిపిస్తారు
[ 10-05-2024]
‘హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప.. -
కక్కుర్తి పడొద్దు.. భోజనాలు బాగుండాలి
[ 10-05-2024]
ఎన్నికల నిర్వహణలోని అధికారులు, సిబ్బందికి నాసిరకం భోజనం సరఫరా అవుతోంది. అన్నం, కూరలు సరిగా ఉండట్లేదంటూ కొన్ని రోజులుగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
నాడు సందడిగా.. నేడు సైలెంట్గా
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారమంటేనే హంగూ, ఆర్భాటం అధికం.. మైకుల గోల, కార్యకర్తల హంగామా మామూలుగా ఉండదు..అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలే అయినా లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ఆ సందడి కనిపించడం లేదు. -
మోదీతోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు: కొండా
[ 10-05-2024]
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరుతోనే ప్రపంచంలోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
హామీలు అమలు చేస్తాం: కాంగ్రెస్
[ 10-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డిని గెలిపించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఓటర్లను కోరారు. పట్టణంలోని 2,3,4,5,6,25 వార్డులలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మేం ఓటేస్తాం.. మరి మీరు..
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. -
బీసీలు ఏకమై కాసానిని గెలిపించాలి
[ 10-05-2024]
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల పాలన సుభిక్షంగా కొనసాగిందని, ఐదు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. -
కొత్త వారికి కలిసొస్తుందా..!
[ 10-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజక వర్గానికి ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ భారాస నుంచి కొత్తగా పోటీచేసిన అభ్యర్థులే విజయం సాధించారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం..ఎక్కువ మంది గుమిగూడడంపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు గురువారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. -
మహిళల అభ్యున్నతికి మోదీ ప్రాధాన్యం
[ 10-05-2024]
మహిళల స్వయంసమృద్ధి, ఆత్మగౌరవానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యమిస్తున్నారని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, తమిళనాడు దక్షిణ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. -
‘యాదాద్రి కట్టినా.. రాజకీయాలకు వాడుకోలేదు’
[ 10-05-2024]
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం తెల్లాపూర్ ఎంఐజీ కాలనీలో మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. -
బాచుపల్లి.. ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 10-05-2024]
బాచుపల్లి రేణుకాఎల్లమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనపై నమోదైన కేసులో ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అర్జన్ నిర్మాణ సంస్థకు చెందిన రైజ్ ప్రాజెక్టు వద్ద రక్షణ గోడ కూలడంతో ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం -
ప్రధాని రాక.. ట్రాఫిక్ ఆంక్షలు నేడు
[ 10-05-2024]
ఎల్బీ స్టేడియంలో శుక్రవారం భాజపా బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సా.4 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. -
నన్నొదిలేసి వెళ్లిపోతావా బిడ్డా..
[ 10-05-2024]
షాపింగ్కని తల్లిని తీసుకొచ్చిన కుమారుడు వదిలేసి పలాయనం చిత్తగించిన ఘటన కేపీహెచ్బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. -
నరేంద్రమోదీ నాయకత్వానికి అండగా నిలవాలి: కిషన్రెడ్డి
[ 10-05-2024]
భారత్ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పిన నరేంద్రమోదీ నాయకత్వానికి ఈ దఫా ఎన్నికల్లోనూ ప్రజలు అండగా నిలవాలని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్రెడ్డి కోరారు. -
కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరు: కొండా
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చేవెళ్ల పట్టణ కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం