logo

టాంజానియాలో తేనెటీగల దాడి.. నగరవాసి మృతి

తేనెటీగల దాడిలో టాంజానియాలో నగరవాసి మృతి చెందాడు. మృతుడి సోదరుడు పడకంటి మనోహరాచారి తెలిపిన వివరాల ప్రకారం..

Published : 31 Mar 2023 02:44 IST

బ్రహ్మచారి

ఉప్పల్‌, న్యూస్‌టుడే: తేనెటీగల దాడిలో టాంజానియాలో నగరవాసి మృతి చెందాడు. మృతుడి సోదరుడు పడకంటి మనోహరాచారి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని కావేరీనగర్‌కు చెందిన బ్రహ్మచారి(55)  టాంజానియాలో భార్య సరోజతో కలిసి 12 ఏళ్లుగా ఉంటున్నారు. మూడేళ్లుగా అక్కడ వ్యయసాయ భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. గత సోమవారం మధ్యాహ్నం మొక్కజొన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా తేనె టీగల గుంపు దాడి చేయడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా అదే రోజు రాత్రి  మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు శ్రుతి, శ్రావిక ఉన్నారు. సోమవారం బ్రహ్మచారి మృతదేహం నగరానికి చేరే అవకాశముందని  మనోహరాచారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని