logo

నాగార్జున సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ జలాల్లో తేలిన మృతదేహం

వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యకు గురైన కారు డ్రైవరు రాగ్యా నాయక్‌ మృతదేహం నాగార్జున సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ జలాల్లో లభ్యమైంది.

Published : 01 Apr 2023 02:49 IST

మత్తుమాత్రలిచ్చి హత్యచేసినట్లు కేసు నమోదు

రాయదుర్గం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యకు గురైన కారు డ్రైవరు రాగ్యా నాయక్‌ మృతదేహం నాగార్జున సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ జలాల్లో లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ లావుడి తాండాకు చెందిన రాగ్యా నాయక్‌ (32), తన భార్య రోజాతో కలిసి 2015లో నగరానికి వచ్చి మణికొండ గార్డెన్‌ ప్రాంతంలో నివస్తున్నాడు. రోజా తన అక్క భర్త లక్పతీతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను అంతమొందించాలని పథకం వేసింది. ఈ క్రమంలో గత ఆగస్టు 19న లక్పతీకి మత్తు మాత్రలు కలిపిన బాదాం మిల్క్‌ రాగ్యాకు ఇచ్చాడు. మత్తులో ఉన్న రాగ్యాను నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి వలలో బండరాయి, ఇనుప రాడ్డుకు చుట్టి నీటిలో పారవేశారు. నాడు గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వారంపాటు గాలించినా ఫలితం లేకపోయింది. నీటిమట్టం తగ్గడంతో రెండు రోజుల క్రితం బయటపడింది. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెళ్లి స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని