Hyderabad: సికింద్రాబాద్ దోపిడీ.. బంగారం కొట్టేశాక మహారాష్ట్ర చెక్కేశారు!
సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ మహారాష్ట్రకు చెందిన థానే ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
దోపిడీ జరిగిన నగల దుకాణం ఉన్న భవనం
ఈనాడు, హైదరాబాద్ రెజిమెంటల్బజార్, న్యూస్టుడే : సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ మహారాష్ట్రకు చెందిన థానే ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో పాట్ మార్కెట్లోని బాలాజీ గోల్డ్ షాప్లో ఐదుగురు అగంతుకులు ఐటీ అధికారులమంటూ జొరబడి 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయిన ఘటన సంచలనం రేకెత్తించింది. సీసీకెమెరాల ఫుటేజ్తో నిందితులను గుర్తించారు. థానే ముఠాగా నిర్ధారణకు వచ్చారు. ఉత్తర మండలం డీసీపీ చందనాదీప్తి, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు సారథ్యంలో ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. థానే పోలీసుల సహకారంతో ఆదివారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంటిదొంగల సహకారంతోనే బంగారం దోచుకెళ్లి ఉండొచ్చనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. దుకాణ యజమానులు, సిబ్బంది ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది. దొంగలు బసచేసిన లాడ్జి నిర్వాహకులను విచారిస్తున్నారు.
ఏడుగురు వచ్చారు.. ముగ్గురు రెక్కీ చేశారు
నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠాలో 8 మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఈనెల 24న ఉదయం, మరో నలుగురు మధ్యాహ్నం బస్సులో నగరానికి చేరారు. ప్యాట్నీ సెంటర్లోని లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. వీరిలో ఓ వ్యక్తి ఆధార్ నంబరును లాడ్జి నిర్వహకులకు ఇచ్చారు. గురు, శుక్రవారాలు బంగారు దుకాణం వద్ద ముగ్గురు రెక్కీ నిర్వహించారు. ఈనెల 27న ఐటీ అధికారులమంటూ ఐదుగురు రంగంలోకి దిగారు. ఓ వ్యక్తి దుకాణం బయట కాపలా ఉన్నాడు. మిగిలిన నలుగురు ముఖానికి మాస్క్లతో దుకాణంలోకి వెళ్లి కేవలం 15-20 నిమిషాల వ్యవధిలో 1700 గ్రాముల బంగారు బిస్కెట్లను చిన్న సంచిలో సర్దుకొని బయటకు వచ్చారు. పాట్మార్కెట్ వెనుక మార్గం నుంచి రోడ్డుపైకి వచ్చి ఆటోలో జేబీఎస్ చేరారు. అక్కడ సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి మరో ఆటోలో ఐదుగురు కేపీహెచ్బీ బస్టాండుకు చేరారు. పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. ఆటోలో ప్రయాణించినవారు తెలుగు, హిందీ, మరాఠీలో మాట్లాడుకున్నారని ఆ డ్రైవర్ చెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు కేపీహెచ్బీ బస్టాప్ నుంచి మహారాష్ట్ర వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. లేదంటే వీరు కాజేసిన బంగారాన్ని బయట ఉన్న ముగ్గురి చేతికిచ్చి దారి మళ్లించారా..? ఆ ముగ్గురు ఎక్కడున్నారు అనే కోణాల్లోనూ వివరాలు రాబడుతున్నారు.
సహకరించిందెవరు?
పాట్ మార్కెట్లో పలు బంగారు దుకాణాలున్నాయి. నాలుగో అంతస్తులోని బాలాజీ గోల్డ్షాప్నే దొంగలు ఎంచుకోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వ్యక్తులతోనే థానే దొంగలు నగరం చేరారని, అసలు సూత్రధారి పథకం అమలుచేశాడని అంచనా. ఇంటిదొంగల సహకారం లేకుండా బంగారం చోరీ సాధ్యమయ్యే పని కాదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు: కేసీ వేణుగోపాల్
[ 07-05-2024]
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. -
సర్వం తానై.. సమరానికి సై
[ 07-05-2024]
రాజధాని పరిధిలో మూడు లోక్సభ స్థానాలను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మహానగరంలో కీలకమైన కాంగ్రెస్ నేతలతో వారం రోజులుగా ఆయన మాట్లాడుతున్నారు. -
హైదరాబాద్లో ఆ ఏడు ప్రాంతాలు హీట్ ఐలాండ్లు
[ 07-05-2024]
చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోందని హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది. -
ఒక క్లిక్తో.. పోలింగ్ కేంద్రం ప్రత్యక్షం
[ 07-05-2024]
‘పోల్ క్యూ రూట్’ యాప్ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. -
ప్రశాంత ఎన్నికలకు సత్వర చర్యలు
[ 07-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
నిరంత విద్యుత్తుకు.. కమాండ్ కంట్రల్ సెంటర్
[ 07-05-2024]
నగరంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. అగ్నిమాపక కమాండ్ కంట్రోల్ సెంటర్ సైతం సిద్ధమవుతోంది. -
ఈవీఎంలు సిద్ధం.. స్ట్రాంగ్ రూముల్లో భద్రం
[ 07-05-2024]
ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధమయ్యాయి. రెండ్రోజుల క్రితం చేపట్టిన కమిషనింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మంగళవారంతో అన్ని స్ట్రాంగ్ రూముల్లో ముగుస్తుందని ఇంజినీర్లు సోమవారం వెల్లడించారు. -
చేయి చేయి కలిపి.. చెయ్యెత్తి కదిలి
[ 07-05-2024]
అడుగడుగున హారతులు.. బతుకమ్మ ఆటలు.. లంబాడీ నృత్యాలు.. సీఎం రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. సోమవారం రాత్రి కంటోన్మెంట్, అంబర్పేట, ఉప్పల్ పరిధిలో ఆయన రోడ్షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. -
మలక్పేట శ్రేణులకు దక్కని లోక్సభ
[ 07-05-2024]
మలక్పేట వాసులకు లోక్సభ స్థానం నుంచి ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. మలక్పేట నియోజకవర్గం 2009 వరకు నల్గొండ లోక్సభ పరిధిలో ఉండేది. అనంతరం హైదరాబాద్ లోక్సభలోకి మారింది. -
ఐసీఎస్ఈ ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం
[ 07-05-2024]
ఐసీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. సోమవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వరుసగా 17వ ఏటా శత శాతం ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది. -
అసెంబ్లీకి ఓటేసి.. లోక్సభకు ముఖం చాటేసి
[ 07-05-2024]
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నిక ఏదైనా.. అటు దేశం.. ఇటు రాష్ట్రం, నియోజకవర్గం బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. రెండు ఎన్నికలకున్న ప్రాధాన్యం ఒకటే. -
ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య
[ 07-05-2024]
ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన సంఘటన కడ్తాల్ ఠాణా పరిధిలోని మక్తమాదారంలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురినీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. -
ఆ నాలుగు పార్టీలు నా గెలుపును అడ్డుకోలేవు
[ 07-05-2024]
‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు. -
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల పరస్పర దాడులు
[ 07-05-2024]
గాంధీభవన్లో కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. సోమవారం పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ను నియోజకవర్గంలో ప్రచారానికి ఆహ్వానించేందుకు కార్వాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉస్మాన్బిన్ అల్హాద్రీ, ఇతర నాయకులు గాంధీభవన్కు వచ్చారు. -
మల్కాజిగిరికి ప్రత్యేక మ్యానిఫెస్టో
[ 07-05-2024]
‘మల్కాజిగిరిలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. మహిళా ఓటర్లు నా వెనకే ఉన్నారు. మల్కాజిగిరి మినీ భారత్.. అన్ని ప్రాంతాల వారుంటున్నారు. -
కాసానిని ఆశీర్వదించండి: కేటీఆర్
[ 07-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి గత 20 ఏళ్లలో ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలపలేదని, అలాంటిది భారాస అధినేత కేసీఆర్ 93 బీసీ కులాలను ఏకం చేసిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో ఉంచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పాలమూరు... ప్రచార హోరు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు సద్వినియోగానికి సౌకర్యాల కల్పన
[ 07-05-2024]
జిల్లాలోని దివ్యాంగులకు (మూగ, చెవిటి, అంధ) లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించామని జిల్లా స్వీప్ నోడల్ అధికారి మహ్మద్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. -
కేంద్రాలు దూరం.. సాయం అవసరం
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల తేదీ (ఈనెల 13) దగ్గరకొచ్చేస్తోంది.అయితే జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన ఇంకా కొలిక్కి రాలేదు. అసలే ఎండలు మండుతున్నాయి. -
మూడోసారీ మోదీయే ప్రధాని: కొండా
[ 07-05-2024]
ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, మూడోసారీ మోదీయే ప్రధాని అవుతారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలి
[ 07-05-2024]
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
అత్యధిక ఎంపీ స్థానాలు భాజపా కైవసం: గీతామూర్తి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యురాలు, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి ధీమా వ్యక్తం చేశారు. -
మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించకుండా తుదితీర్పు చెల్లదు: హైకోర్టు
[ 07-05-2024]
పైగా భూమి దస్తావేజుల రద్దుకు సంబంధించిన వివాదంలో ఇరుపక్షాలు సమర్పించిన ఆధారాలను, మధ్యంతర పిటిషన్లను పరిష్కరించకుండా కింది కోర్టు తుది తీర్పు వెలువరించడం చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. -
మహిళ మెడలోని గొలుసు లాక్కుని పరారీ
[ 07-05-2024]
మహిళ మెడలోని గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు లాక్కుని పరారయ్యారు. వీరిలో ఒకరు యువతి కావడం గమనార్హం. -
‘టెక్ మహీంద్ర’ సహకారంతో.. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ
[ 07-05-2024]
టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు 4 నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు క్యాడర్ సంస్థ ప్రతినిధి నాగరాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?