Hyderabad: ప్రధాని పర్యటన.. నగరంలో హై అలర్ట్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నగర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ప్రధాని రాక సందర్భంగా సోమవారం రాత్రి ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద నిలిపివేసిన ట్రాఫిక్
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే, బేగంపేట: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నగర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని బస చేసే రాజ్భవన్ సమీప ప్రాంతాలు, బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్భవన్కు రాకపోకలు సాగించే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9.30 వరకూ మోదీ రాజ్భవన్లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్, సమీప ప్రాంతాలను పూర్తిగా ఎన్ఎస్జీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. సమీప ప్రాంతాల్లో నగర పోలీసు విభాగానికి చెందిన వివిధ స్థాయిల అధికారులు 200 మంది వరకూ బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో రాజ్భవన్ మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
రాజ్భవన్కు రాక.. ప్రధాని సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి 9.10 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఆయన బేగంపేటకు వచ్చారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమార్, రాష్ట్ర డీజీపీ రవిగుప్త, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు.
నేడు ఉజ్జయిని మహంకాళి దర్శనం
ఈనాడు, హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకోనున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచే ఆలయ అలంకరణ పనులు ప్రారంభించారు. పోలీసులు ఉన్నతాధికారులు, ఎండోమెంట్ కమిషనర్ అనిల్కుమార్, ఆర్జేసీ రామకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఆలయానికి చేరుకోనుండగా అర్చకులు, వేదపండితులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.
ప్రధాని రాక.. ట్రాఫిక్ ఆంక్షలు
పటాన్చెరు, న్యూస్టుడే: పటాన్చెరుకు మంగళవారం ప్రధాని మోదీ రానున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్కుమార్ చెప్పారు. అమీన్పూర్ మండలం పటేల్గూడ ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి, తూప్రాన్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, హత్నూర, దౌల్తాబాద్ నుంచి వచ్చే బస్సులు నేరుగా అవుటర్ మీదుగా ముత్తంగి జంక్షన్ వద్ద దిగి సభాస్థలికి చేరుకోవచ్చని వివరించారు. అవుటర్ సర్వీస్ రోడ్డు మీదుగా రామేశ్వరంబండ, ఎల్లంకి కళాశాల ప్రాంగణంలో పార్కింగ్ చేయవచ్చని చెప్పారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ముత్తంగి అవుటర్ ఎక్కి మరోవైపు నుంచి దిగి సర్వీస్రోడ్డు ద్వారా ఎల్లంకి కళాశాల పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవచ్చని తెలిపారు. కొల్లూరు అవుటర్ జంక్షన్ వద్ద దిగడానికి అనుమతిస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమిత్షా వీడియో మార్ఫింగ్.. దేశ భద్రత అంశం: కిషన్రెడ్డి
[ 29-04-2024]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో, వీడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
నిన్నటి వరకు సీబీఐ, ఈడీ.. ఇప్పుడు దిల్లీ పోలీసులు: రేవంత్రెడ్డి
[ 29-04-2024]
అమిత్షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
[ 29-04-2024]
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
[ 29-04-2024]
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
బెట్టింగ్ భూతం.. దా‘రుణాలు’ అనంతం
[ 29-04-2024]
బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇంకొందరు బరితెగించి చోరీలు, హత్యలు చేస్తున్నారు. -
కారు రూపురేఖలు మార్చి.. భయభ్రాంతులకు గురిచేస్తూ..
[ 29-04-2024]
రూపురేఖలు మార్చిన ఓ కారుతో రహదారులపై శబ్దాలు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజాసింగ్.. రాస్తా అలగ్: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే
[ 29-04-2024]
ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
అరచేతిలో ఏఐ..ప్రచారానికి సై
[ 29-04-2024]
మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం.. రహదారులను విస్తరిస్తాం.. గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం.. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. -
ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద
[ 29-04-2024]
ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. -
ఎండలు సలసల.. మీటర్లు గిరగిరా
[ 29-04-2024]
నగరంలో విద్యుత్తు డిమాండ్ 4వేల మెగావాట్లను దాటింది. ఇందులో పావువంతు ఒక్క మేడ్చల్ జోన్ పరిధిలోనే ఉంటోంది. వెయ్యి మెగావాట్లకు ఈ జోన్ డిమాండ్ చేరువైంది. -
నీటి ట్యాంకర్లకు ట్రాకింగ్
[ 29-04-2024]
ఫుడ్ డెలివరీ యాప్స్లో ఏదైనా ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్ని నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాడో ఇట్టే తెలుకోవచ్చు. -
అభ్యర్థుల తరపున అన్నీ తామై..
[ 29-04-2024]
చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. -
ఓటు మన ప్రాథమిక హక్కు
[ 29-04-2024]
ఓటుని వినియోగించుకోవడం మన ప్రాథమిక హక్కని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఆదివారం ఉదయం -
ఓట్ల పండగకు దూరంగా ఉంటే ఎలా?
[ 29-04-2024]
చట్టసభలకు ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న Ëపోలింగ్ ప్రక్రియలో మేధావులు, విద్యావేత్తలు, యువకులు, విద్యార్థులు సరిగా పాల్గోవడం లేదు. -
ఓటు సమ్మేళనాలు
[ 29-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్సభ ఎన్నికల్లో.. -
ఫలితాల్లో.. పత్తాలేని కొత్త పార్టీలు
[ 29-04-2024]
ప్రధాన పార్టీలు మినహాయిస్తే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేర్వేరు పార్టీల అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వడం లేదు. 1శాతం ఓట్లను పొందలేక చతికిలపడుతున్నారు. -
అంకురాల ప్రోత్సాహానికి స్టార్టప్ మిక్సర్
[ 29-04-2024]
అంకుర సంస్థలు ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా మనసును తొలిచే మొదటి ప్రశ్న పెట్టుబడి ఎలా? ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండింగ్ పెంచుకోవడం, -
పుడమికి బలం.. జగతికి జీవాధారం
[ 29-04-2024]
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. -
రసవత్తరం..చేవెళ్ల పోరు
[ 29-04-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. -
ఓటు.. ఐదు రూపాలు
[ 29-04-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటును నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేస్తారు. అయితే ఓటును ఐదు విధాలుగా వినియోగించుకునే అవకాశం భారత ఎన్నికల సంఘం కల్పించింది. -
పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ
[ 29-04-2024]
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్
[ 29-04-2024]
వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్, మరికొందరు -
వేసవిలో నగరానికి అదనపు జలాలు
[ 29-04-2024]
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందని.. -
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం
[ 29-04-2024]
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్