logo

రూ.28 లక్షలు స్వాధీనం

జిల్లాలో ఎన్ఫోర్స్‌మెంట్‌ బృందాల ద్వారా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు  తనిఖీల్లో రూ.28,22,000 నగదు, రూ.2,37,702 విలువైన ఇతర వస్తువులు, 69.03 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తెలిపారు.

Published : 17 Apr 2024 02:16 IST

ఈనాడు డిజిటల్‌, హైదారబాద్‌: జిల్లాలో ఎన్ఫోర్స్‌మెంట్‌ బృందాల ద్వారా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు  తనిఖీల్లో రూ.28,22,000 నగదు, రూ.2,37,702 విలువైన ఇతర వస్తువులు, 69.03 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తెలిపారు. నగదు, ఇతర వస్తువుల తరలింపుపై 16 ఫిర్యాదులు రాగా వాటిని  పరిష్కరించామన్నారు. 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. లైసెన్స్‌ కలిగిన 76 ఆయుధాలు డిపాజిట్‌ చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని