కరోనా ఎఫెక్ట్:‘డ్రాగన్’ చేపట్టిన చర్యలివే!
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచమంతటికీ విస్తరించినప్పటికీ చైనాలో క్రమంగా తగ్గుతోంది. కరోనా బయటపడ్డ హుబెయ్ ప్రావిన్స్లో జనాభా దాదాపు 6కోట్లు కాగా ప్రధాన కేంద్రమైన వుహాన్ నగరంలో జనాభా 1.15కోట్లు..
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచమంతటికీ విస్తరించినప్పటికీ దాని ప్రభావం చైనాలో క్రమంగా తగ్గుతోంది. కరోనా బయటపడ్డ హుబెయ్ ప్రావిన్స్లో జనాభా దాదాపు 6కోట్లు కాగా ప్రధాన కేంద్రం వుహాన్ నగరంలో జనాభా 1.15కోట్లు.. అప్పటికే వేల మందికి ఈ వైరస్ సోకింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా కరోనా వైరస్ నియంత్రణకు తీసుకున్న చర్యలేంటి? అంతమందికి సమర్ధంగా వైద్యం ఎలా అందించింది. వైరస్ ప్రభావాన్ని అత్యంత సమర్ధంగా ఎలా తగ్గించగలిగింది?
వుహాన్..అష్టదిగ్బంధం
చైనా ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ధనిక దేశమేమీ కాదు. దేశ జనాభాలో సగానికి పైగా పేదలే ఉన్నారు. విశాలమైన రహదారులు, అందమైన భవనాలతో పాటు ఇరుకు ఇళ్లతో ఉండే మురికి వాడలు అక్కడ కోకొల్లలు. అలాంటి దేశాన్ని కరోనా వైరస్ ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. వైరస్ ప్రభావాన్ని ఆ దేశం గుర్తించే సరికి అది తీవ్రరూపం దాల్చింది. వైరస్ బయటపడిన హుబెయ్ ప్రావిన్స్లో జనాభా 6కోట్లు ఉండగా.. వాణిజ్య కేంద్రమైన వుహాన్ నగరంలో జనాభా 1.15కోట్లు. వీరితో పాటు వ్యాపారం తదితర అవసరాల కోసం వచ్చిపోయే చైనీయులు, విదేశీయులు ఎంతో మంది. అలాంటి చోట ఒక్కసారి వెలుగు చూసిన కరోనా వైరస్ను గుర్తించే సరికి అది వేల మందికి సోకింది. దీంతో చైనా ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వుహాన్ నగరాన్ని అష్టదిగ్బంధం చేసింది.
వేగంగా ఆస్పత్రుల నిర్మాణం
జనాభా ఎక్కువగా ఉన్న ఏ నగరంలోనైనా వారికి సరిపడా ఆస్పత్రులు ఉండడం అరుదు. వుహాన్ పరిస్థితీ అంతే. వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స చేయాల్సి ఉంచి చికిత్స అందించాల్సి వచ్చింది. గతంలో ఆస్పత్రులు ప్రస్తుత అవసరాలకు సరిపోవని గుర్తించి 10, 15 రోజుల్లో 1,000, 1,500 పడకల ఆస్పత్రులను నిర్మించింది. వేలాదిగా వస్తున్న కరోనా రోగులకు ఆ పడకలు ఏ మాత్రం సరిపోలేదు. అంతకు ముందు ఉన్న ఆస్పత్రులు నిండిపోవడంతో, రోగుల కోసం ఆడిటోరియంలు, హోటళ్లు, ప్రదర్శనశాలు, ఖాళీగా ఉండే కార్యాలయాలను ఆస్పత్రులుగా మార్చేశారు అక్కడి అధికారులు. వుహాన్లోని ఎగ్జిబిషన్ సెంటర్ను కేవలం 3రోజుల వ్యవధిలోనే ఆస్పత్రిగా మార్చేశారు. అక్కడ 2వేల పడకలను ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. వుహాన్లో దాదాపు 13 భవనాలు 13,348 పడకలతో తాత్కాలిక కరోనా కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. వాటిలో స్టేడియాలు, కాన్ఫరెన్స్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ అత్యంత వేగంగా ఆస్పత్రులుగా మారినవే కావడం గమనార్హం. ఇవి కాకుండా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసి వాటినే చికిత్సా కేంద్రాలుగా మార్చేశారు.
సమర్థంగా చికిత్స
ఒక పక్క రోగులకు సరిపడా ఆస్పత్రులను వేగంగా ఏర్పాటు చేస్తూనే మరో పక్క వైరస్ నిర్మూలనకు చికిత్సను సైతం ప్రారంభించారు. కొత్త వ్యాధి కావడంతో ఎలాంటి చికిత్స అందించాలనే సందిగ్ధావస్థలో ఉన్న చైనా వైద్యులు.. న్యుమోనియా లక్షణాలు ఉండడంతో మొదట్లో ఆ తరహాలోనే చికిత్స అందించారు. సార్స్ తరహాలోనే ఉన్న కరోనాకు చికిత్స ఎలా చేయాలో సతమతమయ్యారు. మరణించిన వ్యాధిగ్రస్థులకు శవపరీక్ష నిర్వహించిన తర్వాతే ఒక అవగాహనకు వచ్చామని అక్కడి వైద్యులు వెల్లడించారు. ప్రధానంగా అల్వియోలర్ వ్యవస్థ(శ్వాసవ్యవస్థ)ను వైరస్ దెబ్బతీస్తుందని శవపరీక్షల్లో వెల్లడైంది. వాయునాళంలో దట్టంగా మ్యూకస్ పేరుకుపోవడం వల్ల ఏర్పడిన సమస్యలను గుర్తించిన వైద్యులు దానికి అనుగుణంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు. మెరుగైన ఫలితాలు రావడడంతో పాటు కొద్దిరోజులకే చాలా మంది కోలుకున్నారు.
ఒకరినొకరు కలుసుకోకుండా చర్యలు
వుహాన్ నగరాన్ని దిగ్బంధించడంతో పాటు అప్పటికే అక్కడికి వచ్చిన విదేశీ పౌరుల్లో మనోధైర్యం దెబ్బ తినకుండా చైనా ప్రభుత్వం వలంటీర్లను నియమించింది. కొవిడ్ అంటు వ్యాధి కావడంతో వుహాన్లో వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు చైనా సర్కారు సమాజంలోని వివిధ వర్గాల వారు నేరుగా కలుసుకోకుండా చర్యలు చేపట్టింది. కొద్దిరోజుల పాటు ఒక్కో అపార్టుమెంటు నుంచి ఒకరిని మాత్రమే బయటకు అనుమతించింది. అలా చాలా మంది ఐదారు వారాల వరకు తమ ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. సొంత ఇళ్లలోనే బందీలై వారికీ సైతం వలంటీర్లే సేవలందించడం విశేషం.
వైరస్ వ్యాప్తితో మాస్కుల కొరత ఏర్పడడంతో వాటి తయారీని కూడా పెంచిన చైనా ప్రభుత్వం ప్రజలందరికీ మాస్కులను అందుబాటులోకి తేగలిగింది. వుహాన్తో పాటు ఇతర నగరాల్లోని ప్రజల మధ్య నేరుగా సంబంధాలు లేకుండా చేసింది. దీంతో కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరో 1, 2 నెలల్లోనే కొవిడ్ను పూర్తిగా నియంత్రించవచ్చని భావిస్తున్న చైనా సర్కారు.. వ్యాక్సిన్ను సైతం అభివృద్ధి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.