Sita Soren: సోరెన్ కుటుంబంలో ‘ఇంటిపోరు’.. కల్పనకు ‘సీత’ చెక్!
సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు మొదలైనట్లు కనిపిస్తోంది. కల్పనాను ముఖ్యమంత్రి చేసేందుకు తాను వ్యతిరేకం అంటూ శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ (Sita Soren) ప్రకటించారు.
రాంచీ: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కొనసాగుతోన్న తరుణంలో అక్కడ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే (హేమంత్ సోరెన్ అరెస్టైతే).. కల్పనా సోరెన్కు (Kalpana Soren) సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు మొదలైనట్లు కనిపిస్తోంది. కల్పనను ముఖ్యమంత్రి చేసేందుకు తాను వ్యతిరేకం అంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ (Sita Soren) బహిరంగ ప్రకటన చేయడం అక్కడి రాజకీయాలను మరింత వేడెక్కించింది.
కల్పనా సోరెన్.. జేఎంఎం ప్లాన్-బి కర్త ఆమె..!
‘ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలుండగా.. ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్ను. 14ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తా’ అని దుర్గా సోరెన్ భార్య, ప్రస్తుత ఎమ్మెల్యే సీతా సోరెన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె.. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనలేదన్నారు. ఆ సమావేశానికి అనేకమంది ప్రజాప్రతినిధులు హాజరుకాలేదని మరో సీనియర్ నేత వెల్లడించారు.
ఇదిలాఉంటే, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఇప్పటికే జనవరి 20న ఓసారి విచారించినప్పటికీ.. మరింత సమాచారం కోసం మరోసారి ప్రశ్నించనున్నట్లు ఈడీ ఇటీవల పేర్కొంది. ఈ విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న వార్తలతో అక్కడ భారీ భద్రత ఏర్పాటుచేశారు. పలు ప్రాంతాల్లో సెక్షన్ 144ను విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
సీఎం కాన్వాయ్ను అనుసరించి ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదైంది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు (Latest News)
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్