Chiranjeevi: హనుమాన్‌ జయంతి.. ‘ఆచార్య’ సెట్‌లో ఏం జరిగిందంటే..!

Updated : 16 Apr 2022 13:30 IST

స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన చిరంజీవి

హైదరాబాద్‌: శ్రీరామబంటు ఆంజనేయుడికి అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి పరమ భక్తుడని అందరికీ తెలిసిన విషయమే. శనివారం హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఆయన ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. ‘ఆచార్య’ లొకేషన్స్‌లోని కొన్ని అపురూప దృశ్యాలను ఈ వీడియోలో పొందుపరిచారు. దేవాలయాలు, వాటిలో జరుగుతోన్న అవినీతి కథాంశంతో రూపుదిద్దుకున్న ‘ఆచార్య’ షూట్‌ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో జరిగింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లపై ఆయా ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, సిద్ధ పాత్ర కోసం చరణ్‌ తన కాటేజీలో సిద్ధమవుతోన్న వేళ అక్కడికి ఓ వానరం వచ్చింది. దాన్ని గమనించిన చరణ్‌ తన వద్ద ఉన్న బిస్కెట్స్‌ని దానికి అందించారు. వానరం వాటిని తింటూ అక్కడే కూర్చొంది. ఈ వీడియోని షేర్‌ చేసిన చిరు.. అందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందర్నీ ఆకర్షిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని