Kalyan ram: అందుకే నేను, ఎన్టీఆర్ ఏ విషయంలోనూ ఎక్కువగా స్పందించం: కల్యాణ్ రామ్
‘డెవిల్’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కల్యాణ్ రామ్ మీడియాతో ముచ్చటించారు. సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘డెవిల్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త మేనన్ కథానాయిక. ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారం జోరు పెంచారు. ఇందులో భాగంగా మీడియాతో కల్యాణ్రామ్ ముచ్చటించారు. ఆయన పంచుకున్న విశేషాలివే..
‘డెవిల్’ (Devil) సినిమా టెక్నిషియన్స్ గురించి చెప్పండి?
కల్యాణ్ రామ్: ‘అమిగోస్’కు పని చేసిన కొందరు దీనికి కూడా వర్క్ చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. నా కాస్ట్యూమ్స్ విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహించారు. నేను ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. కథ కోసం డైలాగులు చెప్పే విధానం మార్చుకున్నా.
‘బింబిసార’, ‘డెవిల్’ రెండు పాత్రలు ఎలా అనిపించాయి?
కల్యాణ్ రామ్: రెండు భిన్నమైనవి. ‘డెవిల్’లో పాత్ర కొత్తగా అనిపించింది. దీని కోసం బాడీ లాంగ్వేజ్లోనూ మార్పులు చేసుకున్నా. 2023కు ఈ సినిమా విజయంతో ముగింపు పలకనున్నాం. ఈ సినిమాలో కీలకాంశాలు చాలా ఉన్నాయి. దేశభక్తి కూడా ఇందులో ఓ ప్రధానాంశం.
‘డెవిల్’లో మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందా?
కల్యాణ్ రామ్: హర్షవర్ధన్ మంచి సంగీతాన్నిచ్చారు. ఈ సినిమాలో పాటల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది. ‘డెవిల్’ టైటిల్ రాసిన విధానాన్ని పరిశీలిస్తే కథ అర్థమవుతుంది. నాకు ఈ కథ చాలా నచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. శ్రీకాంత్ నా దగ్గరకు స్టోరీ తీసుకురాగానే నేను కొన్ని మార్పులు చెప్పాను. దీని కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. సినిమా చూసిన ప్రేక్షకులకు కొత్త కాన్సెప్ట్ను ఎంజాయ్ చేశామనే భావన కలుగుతుంది.
సంయుక్త మేనన్ గురించి చెప్పండి?
కల్యాణ్ రామ్: సంయుక్త మేనన్, మాళవిక నాయర్ పాత్రలు సినిమాకే కీలకం. ఇందులో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యముందో హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యముంది.
నిర్మాతగా మారిన తర్వాత మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
కల్యాణ్ రామ్: సినిమా కోసం నటీనటుల కంటే ప్రొడక్షన్ వాళ్లు ఎక్కువ కష్టపడతారు. అందరూ అలా టీమ్గా పని చేస్తేనే అవుట్పుట్ బాగా వస్తుంది. సినిమా ఫలితం ప్రభావం మొదట నిర్మాతపైనే పడుతుంది. ఇక ‘డెవిల్’ ఒకరి దర్శకత్వంలో మొదలై.. మరొకరి దర్శకత్వంలో ముగిసింది. డైరెక్టర్లు ఎందుకు మారారనే విషయంలో మీకు నిర్మాత మాత్రమే సమాధానం చెప్పగలరు.
ఈ సినిమా కోసం 90 కాస్ట్యూమ్స్ ఉపయోగించారన్నారు ఎందుకు?
కల్యాణ్ రామ్: పాత్రకు అలా కాస్ట్యూమ్స్ మార్చడం అవసరం. అందుకే అన్ని ఉపయోగించాం. అవన్నీ కూడా ఇక్కడివి కాదు. ఫ్రాన్స్, ఇటలీ నుంచి మెటీరియల్ తెప్పించి కుట్టించారు.
‘డెవిల్’లో కొత్తగా కనిపించే అంశం ఏది?
కల్యాణ్ రామ్: 1940ల్లో నేరపరిశోధన ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. అప్పటి రోజుల్లో ఒక కేసును ఎలా పరిశీలించేవాళ్లో, ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. సీసీ కెమెరాలు కూడా లేకుండా ఒక కేసును ఎలా పరిష్కరించారో ఇందులో చూపించాం. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి.
ఎవరి స్ఫూర్తితో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు?
కల్యాణ్ రామ్: ఎవరూ లేరు. నాకే కొత్త కథలను ప్రయత్నించాలనిపిస్తుంటుంది. ప్రేక్షకులు కొత్తదనాన్ని చూడడానికి ఇష్టపడతారు. ‘గజిని’ సినిమా వచ్చినప్పుడు అందరూ ఇలా ఉందేంటి అనుకున్నారు. కానీ, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టమే.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా?
కల్యాణ్ రామ్: చర్చలు జరిగాయి. సినిమా ఫలితం తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉంది.
కెరీర్ మొదలైనప్పటికీ ఇప్పటికీ సినిమా ప్రచారాల్లో మార్పులు వచ్చాయంటారా?
కల్యాణ్ రామ్: ఏ సినిమా చూడాలి, దేన్ని చూడకూడదు అనే విషయంలో ఆడియన్స్ క్లియర్గా ఉంటారు. గతంలో మూవీ పోస్టర్, దర్శకుడు, నటుడు.. ఇలాంటి అంశాలు చూసి సినిమాలకు వెళ్లేవారు. నేను కెరీర్ మొదలు పెట్టిన కొత్తల్లో టీవీల్లో వచ్చే సినిమా ప్రకటనలు చూసి చూడాలో వద్దా నిర్ణయించుకునే వాళ్లు. ఇప్పుడు ట్రైలర్ చూసి సినిమా గురించి ఓ అవగాహనకు వస్తున్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా.. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలంటే సినిమాలకు మాత్రమే వెళ్లాలి.
భవిష్యత్తులో రచనరంగం, దర్శకత్వం వైపు వెళ్లే అవకాశం ఉందా?
కల్యాణ్ రామ్: అది చాలా కష్టం. ఆ వైపు వెళ్లాలనే ఆలోచన కూడా నాకు లేదు.
‘దేవర’ (Devara) షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది?
కల్యాణ్ రామ్: 80శాతం అయిపోయింది. అందరూ అప్డేట్ అడుగుతుంటే మాకు ఒత్తిడి కలుగుతుంది. ఏ విషయంలోనైనా మాకు ఒక క్లారిటీ వచ్చే వరకు స్పందించకూడదని నేను, జూనియర్ ఎన్టీఆర్ (NTR) అనుకుంటాం. అందుకే అన్నిటికీ ఎక్కువగా స్పందించం.
మీరు కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్లు అవుతుంది? ఎలా అనిపిస్తుంది?
కల్యాణ్ రామ్: చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఈ వృత్తిలో నేర్చుకునే అవకాశం ఎక్కువ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.