Nayanthara: స్టూడెంట్స్‌కు బిర్యానీ వడ్డించిన నయనతార.. వీడియో చూశారా!

నయనతార, జై చెన్నైలోని పలువురు స్టూడెంట్స్‌ను కలిసి సరదాగా మాట్లాడారు. వారికి బిర్యానీ వడ్డించారు.

Published : 04 Dec 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి నయనతార (Nayanthara) కొందరు విద్యార్థినిలను సర్‌ప్రైజ్‌ చేశారు. సరదాగా మాట్లాడడమే కాకుండా స్వయంగా బిర్యానీ వడ్డించి వారికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. సంబంధిత వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నయనతార, జై ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనేది ఉపశీర్షిక. నీలేశ్‌ కృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా ఈ నెల 1 ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకి మంచి స్పందన వచ్చిన సందర్భంగా ఈ హీరో, హీరోయిన్లు చెన్నైలోని ఓ లేడీస్‌ కాలేజ్‌ను సందర్శించారు. లంచ్‌ టైమ్‌కి వెళ్లి వారితో ముచ్చటించి, బిర్యానీ వడ్డించారు. తమ అభిమాన తారలను చూడగానే ఆ స్టూడెంట్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను నటించిన ఏ సినిమా ప్రచారానికైనా దూరంగా ఉండే నయనతార ఇప్పుడిలా చేయడం విశేషం.

క్యూట్‌ ట్రైనర్‌తో మహేశ్‌ బాబు.. మీనాక్షి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌

‘అన్నపూరణి’.. నయనతార నటించిన 75వ చిత్రం. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి.. ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకుందనేది ఈ సినిమా కథాంశం. ఈ చిత్రానికంటే ముందు ఆమె ‘జవాన్‌’(Jawan)తో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘టెస్ట్‌’ (Test)తో బిజీగా ఉన్నారు. మాధవన్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌. శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని